Skip to main content

30Aug2017


యేసు పునరుద్దారుడైన తర్వాత శిష్యులకు కనిపించాడు. అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వాళ్ళతో లేడు.
తోమా వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు౼"మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు.
అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.

8 రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి.
అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి౼" మీకు శాంతి కలుగు గాక!" అని చెప్పి..ఆయన తోమాను చూసి౼"నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.
తోమా ఆయనతో౼"నా ప్రభూ, నా దేవా" అన్నాడు.
యేసు౼"నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు

✔ యేసును సిలువ వేసినప్పుడు, సమాధి చేసినప్పుడు తోమా అక్కడ లేడు. కాని ఆయన పక్కలో పొడిచారని మరొకరు చెప్పినప్పుడు చూడకపోయినా నమ్మాడు(యోహా 19:34, 20:25). కానీ శిష్యులంతా క్రీస్తు పునరుద్దాణం (మరణం నుండి తిరిగి లేవడం) గూర్చి చెప్పినప్పుడు మాత్రం నమ్మలేకపోయ్యాడు. కారణం..మరణం అందరూ పొయ్యే మార్గమే, దానికి ప్రత్యేకగా విశ్వాసముంచాల్సిన అవసరం లేదు. కాని పునరుద్దాణం మీద విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్దాణం మీద విశ్వాసం ఉంచని వారిని క్రీస్తు అవిశ్వాసిగా పిలిచాడు(యోహా 20:27).

✔ క్రీస్తు తిరిగి లేచాడని నమ్మినప్పుడే ఆయన మన వంటి వాడు కాడని(పాపాన్ని జయించిన వాడని), ఆయనకు పాపంపై మరణంపై సంపూర్ణ విజయం ఉన్నదని, నన్ను పాపం నుండి విడిపించి, నన్ను తిరిగి లేప గల సమర్థుడని విశ్వాసం ఉంచుతున్నామని తెలియజేస్తుంది(రోమా 8:11, I థెస్స 4:14). ఆయన ఎందు కోసం చనిపోయాడన్న సంపూర్ణత, రుజువు పునరుద్దాణంలోనే ఉంది. క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు పునరుద్దాణంలో ఉంది. దీని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయతను ఇవ్వగా, విశ్వాసం ద్వారా మాత్రమే దీనిని తెల్సుకుంటాము.(పెంతుకోస్తు దినాన పేతురు ప్రసంగించినప్పుడు ప్రజలు ఒప్పించబడ్డారు.అపో 2:23,24,37)

✔ తోమా తాను దేవుని పునరుద్దణాన్ని నిర్ణయిస్తాననట్లుగా మాట్లాడాడు. ఆయన్ను చూడగానే, అర్ధమైన విషయం.. ఆయనే మన విశ్వాసాన్ని బట్టి నిర్ణయిస్తాడని తెల్సుకొన్నాడు. మనమెప్పుడు ఆయన కేంద్రంగా ఉండాలి తప్ప, మనమేదో నిర్ణేతలన్నట్లుగా ఉండకూడదు.ఆయన పరలోక సింహాసనంపై ఉన్నాడు. మనం భూమిపై ఉన్న మంటి వారమని మర్చిపోకూడదు. తోమా శిష్యులతో మాత్రమే పలికిన మాటలు దేవుడు విన్నాడు.ఆయన మనలందరిని స్పష్టంగా తెల్సుకున్నవాడు. అవిశ్వాసం, అల్ప విశ్వాసాల్లో నుండి విశ్వాసంలోకి నడిపించే సహాయకుడు. ఆయన లోపాలను చూపేవాడు మాత్రమే కాడు, ఆ తప్పు నుండి విడిపించే సహాయకుడు. ఆయనకు మహిమ కలుగును గాక! ఆమెన్!!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...