Skip to main content

19Dec2017

❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు.

అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు....

వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇


■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి.

బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తికులు కారు. ప్రతిదినం వారి భక్తిలో ఉద్రేకం, ఉత్సాహం(excitement) పొందుతున్నారు. వీరితో అధికారుల మన్నన ఉంది(ఈ విశ్వాసంతో రాజు,రాణిలు ఏకీభవిస్తారు). పెద్ద గుంపే వారిని వెంబడిస్తున్నారు. బయలు ప్రవక్తలు ప్రతి దినం బయలును సేవిస్తూ, ఆరాధించే వారిగా కనిపిస్తున్నారు. ఐతే ఇది ఒకవైపు భక్తే(one way communication). వారు ఎవరిని దేవునిగా ఆరాధిస్తూ సేవిస్తున్నారో అటు వైపు నుంచి వానితో సహవాసం(relationship) ఏమాత్రం ఉండదు. వారు చేస్తున్న భక్తికి జవాబు ఉండదు(వారికి అవసరం కూడా లేదు). "తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా బ్రతకాలి" అనుకునే వారికి ఇలాంటి భక్తి అనువైనది. ఇది విశాల మార్గం కనుక ఈ భక్తికి మొగ్గు చూపేవారు సహజంగానే ఎక్కువగా ఉంటారు.ఇది మతసంబంధమైన భక్తి. ఆదిలో కయీను చేసిన భక్తి!

■ ఈ christmas season లో ఇలాంటి నామకార్థ క్రైస్తవుల్ని పెద్ద గుంపుల్నే చూడొచ్చు.christmasని అడ్డం పెట్టుకొని Dances, skits, songs, carol service..full excitement..! క్రీస్తు పేరే చెప్పొచ్చు కానీ క్రీస్తుతో సంభంధం లేని భక్తి.(దేవునితో సంభంధం కలిగి దేవుని మహిమార్ధం, దేవుణ్ని ప్రకటించడానికి చేసే పనులు ఉంటాయి. నేను మాట్లాడుతుంది క్రీస్తుతో సహవాసం లేని వాటి గూర్చి). అలాంటి వారి ఉద్దేశ్యలను సరిదిద్ది, క్రీస్తును కేంద్రీకృతం చేస్తే సంఘాలు ఖాళీ ఐపోతాయి కనుక భోధకులు గద్దించరు..బయలు ప్రవక్తల వంటి భక్తే 'ఈ భక్తి' అని చెప్పటానికి నేను సంశయించను(religion without relationship). దేవుడు ఇలాంటి ఆరాధనలకు బదులు పలుకడు.

■ మరొక భక్తి ఉంది. ఒక్కడిగానే ఉన్నా అతనితో దేవుడు ఉన్నాడు. ఏలీయా చేసిన ప్రార్ధన అతి చిన్న ప్రార్ధన! అతను అనుదినం దేవుని మాట కోసం కనిపెట్టి, దేవుని స్వరం వినే(నడిచే) వ్యక్తి. ఇందులో దేవుడు-మనిషి ఇరువురు కలిసి నడిచే సహవాసం ఉంటుంది (bidirectional communication). ఇలాంటి వారే పడిపోయిన దేవుని బలిపీఠం కట్టి దేవునికి మహిమ తెగలరు. ప్రత్యేకమైన అనుబంధం కలిగి దేవుణ్ని ఆనుకొని, ఆయనతో సహవాసం చేసే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. వాక్యానుసారం కానీ భక్తికి, లోకంతో కొట్టుకుపోయ్యె భక్తికి, వేరుగా కొత్త నిబంధన క్రైస్తవునిగా దేవుని ఆత్మ నడుపుదలకు మనల్ని మనం అప్పగించుకొని, ప్రభువుకు సాక్షులంగా జీవిద్దాం!

★ Religion or Relationship? To be who you want to be?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...