Skip to main content

18Oct2017

★ i) క్రూరుడు, క్రీస్తు సంఘాన్ని హింసించిన సౌలు(పౌలు) క్రైస్తవునిగా మారిపోయిన తర్వాత తొలిసారిగా యెరూషలేములో ఉన్న అపొస్తలులను(క్రీస్తు శిష్యులును) కలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతడు మారిపోయ్యాడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. ఐతే "బర్నబా" అతనిని చేరదీసి, అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి వారికి పరిచయం చేశాడు (అ.కా 9:26-29). కొన్ని సంవత్సరాల తర్వాత..

ii) పౌలు బర్నబాతో౼ "మనం ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో, ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దాము" అన్నాడు. మునుపు తమతో రాకుండా మధ్యలో విడిచి వెళ్ళిపోయిన మార్కును వెంట బెట్టుకొని పోవడం భావ్యం కాదని పౌలు తలంచాడు. ఐతే అతణ్ని వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు (అ.కా 15:36-41).

iii) పౌలు-"పేతురు (క్రీస్తు శిష్యులలో ముఖ్యుడు) అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. అతడు అన్యులతో(యూదులు కాని వారితో) భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యూదులు రాగానే వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. మిగతా యూదులు కూడా పేతురుతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపటవేషధారణ వల్ల మోసపోయాడు. వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు నేను పేతురును ముఖాముఖిగా అతన్ని నిలదీశాను" (గలతీ 2:11-21). ★


■ పౌలు ఎవ్వరూ తనను నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు, బర్నబా అతణ్ని నమ్మి, ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. అతన్ని అపోస్తులలో ముఖ్యుడైన పేతురుకు పరిచయం చేశాడు(గలతీ 1:18,19). కొన్ని సంవత్సరాల తర్వాత అదే బర్నబాతోనూ, పేతురుతోనూ కొన్ని విషయాల్లో పౌలు విభేదించాడు. పౌలు గర్వంగా ప్రవర్తించాడా?లేదు.. పౌలు క్రీస్తు మాదిరిని సరిగా చూపిన వాడని పరిశుద్ధాత్ముని చేత సాక్ష్యం పొందాడు. ఒకప్పుడు క్రీస్తును ద్వేషించి, సత్యానికి ఎంత దూరంగా పరిగెత్తాడో, నేడు క్రీస్తులోని దైవత్వం గురించి వెలిగింపబడినప్పుడు, క్రీస్తులోని సత్యాలను అనుసరించడానికి అంతే వేగంతో పరుగెత్తాడు. క్రీస్తు నందు(వాక్యాన్ని బట్టి) ప్రతి వ్యక్తికి లోబడ్డాడు, కానీ క్రీస్తు సత్యాలకు వేరుగా ఒకరు ప్రవర్తించినప్పుడు, ఆ వ్యక్తులు ఎంతటి గొప్ప వారైనా వారితో విభేదించాడు. పౌలు మొదట క్రీస్తుకు దాసుడు-ఏ నరునికి కాదు(గలతీ 1:10, 2:5,6)

■ మనుష్యులు మనకు భౌతికంగా, ఆత్మీయంగా ఎంత మేలు చేసినప్పటికీ సైతం!ఏ మేలును బట్టి మనల్ని మనం(ఆత్మీయ జీవితాలను) అమ్మివేసుకోకూడదు. వారి మాటలను ప్రతిసారి దేవుని వాక్యంతో సరిపోల్చుకోవటం సరైన విషయం. దీనర్ధం మన స్వంత జ్ఞానంపై, అభిప్రాయాలపై ఆధారపడటమా? కాదు! 'నేను-నా అభిప్రాయాలకు' సిలువవేయబడి, నాపై క్రీస్తు వాక్యసత్యాలకు, ఆత్మ నడుపుదల అధికారానికి నన్ను నేను అప్పగించుకోవటం. ఒకవేళ తప్పు చేసినప్పుడు..వాక్యానికి, మనలోని దేవుని ఆత్మకు, ఆత్మీయుల సరిదిద్దు బాటుకు దీనులై అంగీకరించాలి. ఇది దేవునిపై ఆధారపడే వారి లక్షణం.

■ నిజమైన ఆత్మీయులు అలా నడిచే వారిని మరింతగా యదార్థవంతులై హత్తుకుంటారు, ప్రోత్సహిస్తారే కానీ ద్వేషించరు. కారణం! 'మనం నమ్మకత్వం మొదట క్రీస్తు సత్యానికే ఉండాలి' అనే మాటతో వారు ఏకీభవిస్తారు. అట్టివారు వారు ఏ వ్యక్తి జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదని భావిస్తారు. పౌలు కంటే పేతురుకు అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఐనా క్రీస్తు సత్యం ముందు దోషిగా ప్రవర్తించినప్పుడు, దీనుడై లోబడ్డాడు, కానీ అహాన్ని చూపలేదు. ఇది! క్రీస్తుతో నడిచేవారి లక్షణం.

౼ఇలా దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తి ఒకడున్నట్లైతే అతను కొనియాడబడడు అనేది స్పష్టమైన సంగతే!తనకు మేలు చేసి, అక్కున చేర్చుకున్నవారిని, ఆత్మీయ పెద్దలతో విభేదించాడని తెల్సిన ఎవ్వరైనా పౌలు గురించి ఏమనుకుంటారు? కానీ దేవుని గూర్చి అగ్నిలా మండుతున్న అతన్ని (ఆత్మీయులు, అతని పరిచర్య ద్వారా మేలు పొందుచున్న వారు)కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. మొదట దేవుడు గుర్తిస్తాడు..అది చాలు కదా!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...