Skip to main content

23Sep2017

❇ ఆదిలో దేవుడు భూమి, ఆకాశాలనూ సృజించాడు. అప్పుడు భూమి మొత్తం శూన్యంగా, రూపం లేకుండా ఉంది. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్ళపై సంచరిస్తూ ఉన్నాడు.
అప్పుడు దేవుడు౼“వెలుగు కలుగును గాక!” అనగానే, వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూశాడు. అది చక్కగా ఉన్నట్లు ఆయన చూసాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును, చీకటి నుండి 'వేరు' చేసాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టాడు. అస్తమయము, ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు ❇
■ దేవుడు సృష్టి నిర్మాణం అంతటిని ఆరు రోజుల్లో ముగించాడు. ఆదిలో ఖాళీగా, ఆకారం లేకుండా ఉన్న భూమిని దేవుడు తన ఆలోచనల్లోని రూపంతో నింపాలని కోరుకున్నాడు. ఆయన మాట పలుకగా, తన ఆత్మ ద్వారా నూతన నిర్మాణం జరిగింది. దినదినం ఆయన కోరుకున్న రూపంలోకి మార్పు చెందుతూ వచ్చింది.నేడు ఏ మాత్రం నిరీక్షణ లేని (శూన్యంగా, రూపంలేకుండా ఉన్న) జీవితాలపై దేవుడు పని చేయడానికి ఇష్టపడతాడు (మానవులందరి జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు).
■ నేర్పరియైన శిల్పి ఆకృతి లేని రాయిలో అందమైన రూపాన్ని ముందుగానే తన ఆలోచనల్లో చూచినట్లే...దేవుడు కూడా అస్తవ్యస్తంగా, నిరీక్షణ లేకుండా ఉన్న జీవితాల్లో ఉన్న విలువను ముందుగానే చూస్తున్నాడు. నేర్పరియైన పనివాడు అద్భుతమైన తన చేతి పనిని కనపర్చినట్లే, చెడిపోయిన ఏలాంటి జీవితాలను సైతం గొప్పవాడైన సృష్టికర్త బాగు చెయ్యగల సమర్ధుడు.దేవుడు ఎన్నడూ ఈ భూమిపై వ్యర్ధమైనది సృష్టించలేదు. ఇది వ్యర్ధమైనది అని దేనైనా చూసి చెప్తున్నామంటే దాని గూర్చి మనకు ఇంకా అర్ధం కాలేదని అర్ధం. అలాగే దేవుడు చేసిన మనుష్యుల్లో వ్యర్ధమైన వారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ విలువైన వారే! నేడు విలువ లేనివిగా కనిపిస్తున్న మన జీవితాలు౼సృష్టికర్తతో సంభంధం లేకుండా, మన స్వంత ఆలోచనల ప్రకారం జీవించడమే కారణం! ఎప్పుడైతే మనం దేవుణ్ని నమ్మి, తిరిగి ఆయన చేతుల్లోకి ఇష్టపూర్వకంగా వస్తామో..ఆయన ఆలోచనలోని విలువైన, నిజమైన జీవితంలోకి వస్తాము.
■ దేవుడు రక్షకుణ్ని సిలువలో వధించడం ద్వారా, ఆయన రక్తంలో మన పాపాల్ని కడిగి, పవిత్ర పరచి, మనుష్యులందరిని ఆయన పిల్లలుగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వెలుగు నుండి చీకటిని వేరుపర్చినట్లు, తన కుమారుడైన యేసులో మనల్ని దాచి, మన జీవితంలో నుండి అపవిత్రతను వేరుచేస్తాడు. దేవుడు యేసును ఎంతగా ప్రేమిస్తాడో, ఇప్పుడు అంతే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నీతిమంతుడైన యేసుకు పరలోకంలో ఎంత వారసత్వం ఉందో, మనకు అంతే వారసత్వం ఇవ్వాలని పరమ తండ్రి ఉద్దేశించాడు. యేసుని మనకు సహోదరునిగా (జ్యేష్టునిగా) చేసాడు కనుక ఇది సాధ్యమైనది. కనుక యేసు వలె మనం నీతికి వారసులుగా, ఆ పేరుకు తగినట్లు జీవించ కోరుకోమని ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యం మనపై అధికారం చేస్తునప్పుడు, దేవుని ఆత్మ మనకు సహాయకుడై అద్భుతమైన నూతన (సృష్టిని) జీవితాన్ని కొనసాగిస్తాడు. మనవైవు నుండి దేవుడు కోరుకునేది దేవునిపై విశ్వాసం౼విధేయత(లోబడటం)! మనలో ఆ పని చేసేవాడు దేవుడే!
✔ భూమికి పునాది వేయబడక ముందే నీ కొరకైన దేవుని ప్రణాళిక ఇదే౼"మనం క్రీస్తు స్వరూప్యంలోకి మారాలనేదే దేవుని అనాధికాల సంకల్పం". ఈ మాటలు సత్యం..నా జీవిత అనుభవం అని దేవుని యెదుట సాక్ష్యమిస్తున్నాను.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...