Skip to main content

08Mar2018


❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు.....
ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇


■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని ఎల్లప్పుడూ కోరతాడు. నిజంగానే పేతురుకు క్రీస్తుపై యెనలేని ప్రేమ ఉంది. కానీ అది దైవబలంతోనే పరిపూర్ణమౌతుంది.

■ మూడున్నర సంవత్సరాలు ఒకనితో ఎంతో సన్నిహిత్యంగా నడిచి, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ స్నేహితుడు-'అతనెవరో నాకు తెలియదంటే', అతణ్ని ఎంత నయవంచకునిగా భావిస్తాము. అతనితో తిరిగి స్నేహం చేస్తామా? దగ్గరకు రానిస్తామా? మరో అవకాశం ఇస్తామా? ఆ విధమైన అపరాధ భావంతో పేతురు కుమిలిపోయ్యాడు. ఐతే క్రీస్తు౼'ఓడిపోయి, అపరాధభావంతో, కృంగినపోయి ఉన్న వారిని వెతుక్కుంటూ వచ్చి ప్రేమించే నిజస్నేహితుడు'. ఇప్పుడు పేతురు స్వంత బలం ముక్కలు ముక్కలుగా విరగొట్టబడాలి. అంటే 'ఇక నా బలం శూన్యం, నా గురించి నేను అతిగా ఉహించుకున్నాను, దీనికి నేను అర్హుడను కాను' అనేంతగా నలుగగొట్టబడాలి. అలా ఖాళీగా పాత్రలోనే దేవుని బలం కుమ్మరించడానికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. మన బలం సంపూర్ణంగా ఖాళీ చెయ్యబడితేనే, దైవం బలం అక్కడకు ప్రవేశిస్తుంది. అదే దీనత్వం.

■ ఇది లోకం చెప్పే దీనత్వం వంటి అర్ధం కాదు. దీనుడు అనగా దేవుని యెదుట తన నిజస్థితిని తాను గుర్తించగలిగిన వాడని అర్ధం. మన జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పదని, ఆయన అంతటి పైన ఉన్నవాడని గుర్తించి, దేవుడు నియమించిన స్థానాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించి, సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించుకోవటం. 'ఆయన లేకుండా నేనేమి చేయలేను' అని గుర్తించడం. సంపూర్ణంగా దేవునిపై ఆధారపడటం. అలాంటి వారికి(దీనులకు) ఆయన కృప చూపుతాడు. విరగొట్టబడిన వాడు చెప్పే సమాధానం- 'అది మీకే తెలియును ప్రభువా! నా అంచనాలు తారుమారు అవుతాయి. నీవే అన్నిటినీ, అందరిని తెలిసికొన్నవాడవు' అని చెప్పగలుగుతాడు. అంటే దానార్ధం ఆత్మనూన్యతలో ఉండి, ఎల్లప్పుడూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసేవారు ఆత్మీయులని కాదు(అట్టి వారు అల్పవిశ్వాసులు, దేవుని శక్తిపై అనుకొనివారు). దేవుని బలాన్ని తమ బలంగా చేసుకుని, ఆయనపై ఆధారపడే వారే నిజమైన దీనులు. బలమైన విశ్వాసులు.

★ అపవాది వాడే అగ్ని బాణం- 'అహంకారం'. అహం భావం ఎక్కడ ఉంటే, అక్కడ దేవుడు తన కృప చూపలేడు. పాపస్వభావం కలిగివున్న మనందరిలో (leaning on own self) గర్వపు తునకలు ఉంటుంది. కొందరిలో స్పష్టంగా, మరికొందరిలో అంతర్గతంగా గూడుకట్టుకొని ఉంటుంది. ఐతే దేవుడు విశ్వాసులను త్రోసి వెయ్యడు గానీ ఎల్లప్పుడూ ప్రత్యక్షతనిస్తూ, విరిస్తూ, తన కృప నుండి తొలగిపోకుండా కాపాడుకుంటాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...