Skip to main content

01Aug2017

 సువార్త నిమిత్తం ఖైదీగా ఉన్న పౌలు తన వాదనను కైసరు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని కోరాడు. కాబట్టి పౌలుతో పాటు మరికొందరు ఖైదీలను తీసుకొని శతాధిపతి ఓడలో ఇటలీకి ప్రయణమయ్యాడు. కానీ గొప్ప తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఓడ కొట్టుకొని పోయి 'మెలితే' అనే ఒక ద్వీపం దగ్గరకు వచ్చింది. అనాగరికులైన ద్వీపవాసులు వారికి ఎంతో సహాయపడ్డారు. వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టారు.
అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు.🔹(అపో 28:1-6) 
 పౌలు నిమ్మళమైన వైఖరిని గమనించండి. ఎందుకంటే పౌలు ఓడలో ఉన్నప్పుడు..
ఒక దేవదూత అతనితో౼'పౌలూ! భయపడకు. నీవు కైసరు ముందు నిలబడాల్సివుంది. ఇదిగో! నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు' అని చెప్పాడు.(అపో 27:23,24)
 పరలోకం నుండి దేవదూతను పంపిన దేవుడు, తుఫానును ఆపలేడా? పైగా తుఫానును పంపించిందే ఆయన! ఆ పరిస్థితుల ద్వారా పౌలు నడిపించబడటాన్ని బట్టి, దేవుడు మెలితే ద్వీపనికి, ఓడలోని వారికి సువార్తను తీసుకొని వెళ్ళాడు. శ్రమల్లో గుండా వెళ్తూ, దేవుని ఉద్దేశ్యలను గ్రహించడం పౌలు నేర్చుకొన్నట్లు మనం నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితి దేవుని ఆధీనంలో ఉందని విశ్వసిస్తూ, ఓర్పుతో భరిస్తూనే, ఆయన చిత్తం ఏమిటో గ్రహించాల్సివుంది. విశ్వాసి జీవితంలో ఆయన తిప్పే ప్రతి మలుపు ఆశీర్వదకరమైన అనుభవానికి ఒక మెట్టు.
 పౌలును పాము కాటు వేయునట్లుగా అనుమతించింది ఎవరు?దేవుడే! నిజానికి వారంతా అది 'దేవుని శిక్ష' అనుకొన్నారు. అక్కడ ఉన్న వారందరిలో అత్యంత పరిశుద్ధున్ని, అందరి కంటే పాపాత్మునిగా భావించారు. "వీళ్ళు నా వారు" అని సాక్షమియ్యడానికి, కొన్ని బాధాకరమైన సంఘటనలను సైతం దేవుడు వాడుకుంటాడు. ఈ సంఘటన ద్వారా దేవుడు.. పౌలు విశ్వాసానికి పదును పెడుతూనే, ఇతరులకు మేలుకరంగా మరల్చుతున్నాడని గమనించండి. పౌలు గలిబిలి అవ్వలేదు. అనుభవజ్ఞుడైన క్రైస్తవునిగా దేవుణ్ని ఆనుకొని, నిమ్మళమై ఆయనను(దూత ద్వారా దేవుడు చెప్పిన మాటను) విశ్వసించాడు. కాబట్టే ఆశీర్వాదకారకుడయ్యాడు.
◆ విశ్వాసం అంటే దేవుని పనులు(ఉద్దేశ్యాలు/ప్రణాళికలు) ఏమీ అర్థం కాకముందే, మేలు చేయు ఆ దేవుని నమ్మకత్వాన్ని నమ్మడం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...