Skip to main content

30 June 2017

యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే సాగిలపడ్డాడు.

కుష్టు రోగి- "ప్రభూ! నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను వేడుకున్నాడు.
అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని ముట్టుకున్నాడు. 

యేసు-"నిన్ను బాగు చేయడం నాకిష్టమే! బాగవ్వు" అన్నాడు.
వెంటనే అతని కుష్టు పోయింది.


● ఆ రోజుల్లో కుష్ఠు రోగానికి మందు లేదు. అలాంటివారు ఊరి వెలుపలే ఉండాలి.యేసును కలుసుకోవడానికి ఈ కుష్టురోగి దాగుతూ వచ్చాడేమో!

★ అప్పటి వరకు కుటుంబికులు, ఎంతో ఆత్మీయులుగా ఉన్న వారు అతన్ని ముట్టుకోవడానికి, దగ్గరకు రావడానికి వెనకాడివుంటారు. ఎందుకు నాకే ఈ వ్యాధి వచ్చిందన్న వ్యధ. దినదినం క్షిణించిపోతున్న శరీరం, ఒంటరితనం, అవమానం అతని మానసికంగా, శరీరంగా కృంగిపోయిన వానిగా చేశాయి. నిరీక్షణ లేని జీవితంలోకి తీసుకువెళ్ళాయి. ఎలా విన్నాడో కాని యేసు ఈ రోగాన్ని బాగుచేయగలడని తెల్సుకొన్నాడు, ఖచ్చితంగా తనను బాగుచేయగలడని విశ్వాసముంచాడు.

★ అతను ప్రభువు దగ్గరకు వచ్చి వేెడుకున్నప్పుడు, శరీర స్వస్థత కంటే ముందు, మనస్సుకు కలిగిన ఆ గాయాన్ని మాన్పాడు. అతణ్ణి చేతితో ముట్టాడు. దేవుని ఆత్మీయ స్పర్శ అతనికి ఆదరణ, నిరీక్షణ కలిగించాయి. ఎవ్వరూ చూపని ప్రేమను ఆయన చూపాడు. దీనిని బట్టి అతని ప్రధమ అవసరం ఆత్మీయ స్పర్శ అని అర్ధం చేసుకోవచ్చు. మనుష్యులెవ్వరూ నిన్ను అర్ధం చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదు అని భాధ పడ్తున్నావా! యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతుంది.

● అతని శరీరం(జీవితం) ఎప్పుడు బాగయిందంటే, విశ్వాసంతో దేవుణ్ని సమీపించి, బాగుచేయమని అతను వేడుకున్నప్పుడే!అతనితో పాటు ఇంకా కుష్టురోగులు ఉండే ఉంటారు, కాని విశ్వాసంతో వచ్చిన వాడే బాగయ్యాడు.

★ ప్రియ స్నేహితుడా! నీవు ఆయన దగ్గరకు విశ్వాసంతో రాకపోతే నీవెన్నాడూ ఆయన ప్రేమను, శక్తిని నీ జీవితంలో తెలుసుకోలేవు. రోగం..బ్రతికి ఉన్నంత వరకు శరీరాన్ని భాదించగలదు, కాని పాపం..మనిషి ఆత్మను అంతంలేని దేవుని ఉగ్రతకు తీసుకువెళ్తుంది.పాపక్షమాపణ, దేవునితో సఖ్యత మనిషికి అత్యవసరమైన విషయాలు. కనుకనే రక్షకుడైన క్రీస్తు సిలువపై మన పాపానికి బలిగా, విమోచనగా మారాడు.
క్రీస్తులో విశ్వాసం ద్వారా, దేవుని కనికరం వల్ల పాపం నుండి విడుదల పొంది, దేవునితో క్రొత్త జీవితాన్ని పొందుతాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...