గేత్సేమనే వనంలో యేసు మోకరించి ఇలా ప్రార్థన చేసాడు- "తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి"(లూకా 22:43)
■ ఆయన తొలగించుమన్న పాత్ర ఏమిటి? శిలువ శ్రమా?లేక శరీర మరణమా?
■ ఆయన తొలగించుమన్న పాత్ర ఏమిటి? శిలువ శ్రమా?లేక శరీర మరణమా?
● ఆయన కష్టాలను, శ్రమల గూర్చి భయపడుతూ,ఈ మాటను అనుంటే గనుక, "లోకంలో మీకు శ్రమ కలుగుతుంది..మీరు సిలువను మోస్తూ నన్ను వెంబడించండి" అని ఆయనకు చెప్పే అర్హత ఉండదు.
● లేదు శరీర మరణం గూర్చి ఈ మాటలు చెప్పిఉంటే, నేడు ఆయన కోసం అంతకంటే ఘోరంగా చంపివేయబడ్డ అనేక మంది హతసాక్షుల కంటే తక్కువ వానిగా కనిపిస్తాడు. చివరికి పాత నిబంధనలోని షడ్రక్, మేషాక్, అబేడ్నోగులు సంతోషంగా దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన వారికంటే లోక రక్షకుడు తక్కువైనవాడవుతాడు.
●నిజానికి ఆయన ఎన్నడూ దూషణలను,శ్రమలను,నిందలను, చివరికి ప్రాణాన్ని కూడా లెక్కచెయ్యలేదు. ఆయన మరణించడానికే వచ్చాడని, ఆ సమయం ఎప్పుడో, ఏలాంటి మరణం పొందుతాడో, ఆయన్ను అప్పగించువాడేవాడో ఆయనకు బాగా తెల్సు. పేతురు ద్వారా సాతాను మరణాన్ని దూరం చెయ్యాలని చూస్తే ఆయనే సాతాన్ని గద్దించాడు. ఆయన్ను పట్టుకునే వారికి ఆయనే ఎదురూ వెళ్ళి, అప్పగించుకొన్నాడు.
"యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు,తనను మరణము నుండి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడాయన విన్నపం విన్నాడు." (హెబ్రీ 5:7)
● మరి ప్రభువు ప్రార్ధించిన "మరణము" ఏమిటి?
ఏదేను వనంలో పాపం చేస్తే నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు, అది శరీర మరణమా? కాదు. శరీర మరణం ఆదికాండం 3:17లో శాపంగా వచ్చింది. పండు తిన్నవెంటనే వారు ఆత్మీయంగా చనిపోయారు.మరణం అంటే ఎడబాటు అని అర్ధం. దేవునితో,ఆయన సహవాసంతో ఎడబాటు. అప్పట్నుంచి ప్రతి మనిషిని ఈ ఆత్మీయ మరణం ఎలుతుంది. క్రీస్తు లోకరక్షకునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎన్నడూ పరలోక తండ్రితో ఎడబయలేదు.కానీ సిలువలో లోకపాపంగా, శాపంగా చేయబడిన క్రీస్తును, దేవుడు వదిలివేయబోతున్నాడు. అంటే ఆత్మీయ మరణం. ఆయనతో ఎడబాటును క్రీస్తు తట్టుకోలేకపోతున్నాడు. అది కూడా నీతిమంతుని కోరికే, కాబట్టి ఆయనలో ఏ పాపంలేదు. ఐతే అనేకుల రక్షణార్థం ఆవిధంగా చేయాల్సి వచ్చింది.ఆ మరణం నుండి తప్పించి తిరిగి (బ్రతికింపగల) లేపగలవానికి, పైన చెప్పిన విధంగా ప్రార్ధించాడు. దేవునితో సహవాసం విషయంలో, ఆయన మాట వినడంలో క్రీస్తు మనకు మంచి మాదిరి.
ఏదేను వనంలో పాపం చేస్తే నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు, అది శరీర మరణమా? కాదు. శరీర మరణం ఆదికాండం 3:17లో శాపంగా వచ్చింది. పండు తిన్నవెంటనే వారు ఆత్మీయంగా చనిపోయారు.మరణం అంటే ఎడబాటు అని అర్ధం. దేవునితో,ఆయన సహవాసంతో ఎడబాటు. అప్పట్నుంచి ప్రతి మనిషిని ఈ ఆత్మీయ మరణం ఎలుతుంది. క్రీస్తు లోకరక్షకునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎన్నడూ పరలోక తండ్రితో ఎడబయలేదు.కానీ సిలువలో లోకపాపంగా, శాపంగా చేయబడిన క్రీస్తును, దేవుడు వదిలివేయబోతున్నాడు. అంటే ఆత్మీయ మరణం. ఆయనతో ఎడబాటును క్రీస్తు తట్టుకోలేకపోతున్నాడు. అది కూడా నీతిమంతుని కోరికే, కాబట్టి ఆయనలో ఏ పాపంలేదు. ఐతే అనేకుల రక్షణార్థం ఆవిధంగా చేయాల్సి వచ్చింది.ఆ మరణం నుండి తప్పించి తిరిగి (బ్రతికింపగల) లేపగలవానికి, పైన చెప్పిన విధంగా ప్రార్ధించాడు. దేవునితో సహవాసం విషయంలో, ఆయన మాట వినడంలో క్రీస్తు మనకు మంచి మాదిరి.
Comments
Post a Comment