Skip to main content

23 June 2017

హోషేయ--"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం!ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం రండి! ఆయన్ని అనుసరిద్దాం రండి!"(హోషేయా 6:1,3)

"దేవుని గూర్చిన జ్ఞానం అంటే, వాక్యం తెలియడం, దానిని చక్కగా విభజించడం కాదు. అది అందరికి తెలపడం అంతకంటే కాదు(మత్తయి 7:22,23). బైబిల్లోని దేవుని అనుభవాల ద్వారా వ్యక్తిగతంగా తెలుసుకోవడం,అవును అని మన జీవితల్లో రుజువు చేసుకోవడం. ఆయన చేత మనం గుర్తించబడటం!"

 ఇశ్రాయేలీయులు దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు బుద్ధిహీనమైన పనులు చేశారు(హోషేయా 4:1,2). సృష్టికర్తను విడచి లోకంతో స్నేహం చేశారు. ఐగుప్తు(పాపపు) బానిసత్వం నుండి విడుదల పొంది, కృతజ్ఞతరహితులై ఇష్టపూర్వకంగా ఈ లోకప్రజల విధానాలకు మరలి పోయారు. మొదట చేసిన నిబంధనను మరిచారు.

 గద్దించాల్సిన యాజకులు వారి బాధ్యతను మరచి(హెబ్రీ 13:17), దేవుడు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వదిలివేశారు. వారి కడుపే వారి దేవుడయ్యాడు(హోషేయా 4:6-8).కాబట్టి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడ్డారు(4:9).

 ఎఫ్రాయిము తెగను దేవుడు ఎంతో ప్రేమించాడు. దానిని గూర్చి ఉన్నతమైన ఉద్దేశ్యలను కలిగి ఉన్నాడు(ఆది 48:17-19, యిర్మీయా 31:20).కాని ఆ ప్రజలే మరి ఎక్కువగా దేవుని దుఖః పెట్టారు. విగ్రహాలతో కలిసి పోయి దేవుని శిక్షకు సిద్ధంగా ఉన్నారు(హోషేయా 5:9,11).

 కాబట్టి దేవుడు ఇశ్రాయేలను,యూదాను,ఎఫ్రాయిమును మరియు బెన్యామీనుకు గాయం చేసి, తానే మరలా బాగు చేసి, వారిని పాపం నుండి వారిని మరల్చాలని కోరుకున్నాడు. కాని ఎఫ్రాయిము, మనుష్యులను ఆశ్రయించి ఆ శ్రమ నుండి బయటకి రావాలని ఆశించారే కాని దేవుని దగ్గర కు మరలిన వారు కాదు.
ఆ సమయంలో హోషేయ ఇస్తున్న పిలుపు ఇది-"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం..ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం".

దేవుడు-"నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు" (హోషేయా 4:6), జ్ఞానము అంటే అక్షరం కాదు(దానికోసమైన ప్రాకులటకు వెళ్లొద్దు). ఆయన ఆత్మ ద్వారానే దైవ జ్ఞానం తెలియజేయబడుతుంది.మనం తీసుకొంటున్న ఆత్మీయ ఆహారం మనకు బలంగా మారాలి, లేదంటే పరిసయ్యుల జీవితంలా మారిపోతుంది.

 "దేవుని గూర్చిన జ్ఞానము మనకు తెలిసినప్పుడు, మన గురించి మనకు సరిగ్గా తెలుస్తుంది"

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...