హోషేయ--"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం!ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం రండి! ఆయన్ని అనుసరిద్దాం రండి!"(హోషేయా 6:1,3)
✔"దేవుని గూర్చిన జ్ఞానం అంటే, వాక్యం తెలియడం, దానిని చక్కగా విభజించడం కాదు. అది అందరికి తెలపడం అంతకంటే కాదు(మత్తయి 7:22,23). బైబిల్లోని దేవుని అనుభవాల ద్వారా వ్యక్తిగతంగా తెలుసుకోవడం,అవును అని మన జీవితల్లో రుజువు చేసుకోవడం. ఆయన చేత మనం గుర్తించబడటం!"
➡ ఇశ్రాయేలీయులు దేవుని గూర్చిన జ్ఞానం లేనప్పుడు బుద్ధిహీనమైన పనులు చేశారు(హోషేయా 4:1,2). సృష్టికర్తను విడచి లోకంతో స్నేహం చేశారు. ఐగుప్తు(పాపపు) బానిసత్వం నుండి విడుదల పొంది, కృతజ్ఞతరహితులై ఇష్టపూర్వకంగా ఈ లోకప్రజల విధానాలకు మరలి పోయారు. మొదట చేసిన నిబంధనను మరిచారు.
➡ గద్దించాల్సిన యాజకులు వారి బాధ్యతను మరచి(హెబ్రీ 13:17), దేవుడు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వదిలివేశారు. వారి కడుపే వారి దేవుడయ్యాడు(హోషేయా 4:6-8).కాబట్టి వారు కూడా దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడ్డారు(4:9).
➡ ఎఫ్రాయిము తెగను దేవుడు ఎంతో ప్రేమించాడు. దానిని గూర్చి ఉన్నతమైన ఉద్దేశ్యలను కలిగి ఉన్నాడు(ఆది 48:17-19, యిర్మీయా 31:20).కాని ఆ ప్రజలే మరి ఎక్కువగా దేవుని దుఖః పెట్టారు. విగ్రహాలతో కలిసి పోయి దేవుని శిక్షకు సిద్ధంగా ఉన్నారు(హోషేయా 5:9,11).
➡ కాబట్టి దేవుడు ఇశ్రాయేలను,యూదాను,ఎఫ్రాయిమ ును మరియు బెన్యామీనుకు గాయం చేసి, తానే మరలా బాగు చేసి, వారిని పాపం నుండి వారిని మరల్చాలని కోరుకున్నాడు. కాని ఎఫ్రాయిము, మనుష్యులను ఆశ్రయించి ఆ శ్రమ నుండి బయటకి రావాలని ఆశించారే కాని దేవుని దగ్గర కు మరలిన వారు కాదు.
ఆ సమయంలో హోషేయ ఇస్తున్న పిలుపు ఇది-"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం..ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం".
✔దేవుడు-"నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు" (హోషేయా 4:6), జ్ఞానము అంటే అక్షరం కాదు(దానికోసమైన ప్రాకులటకు వెళ్లొద్దు). ఆయన ఆత్మ ద్వారానే దైవ జ్ఞానం తెలియజేయబడుతుంది.మనం తీసుకొంటున్న ఆత్మీయ ఆహారం మనకు బలంగా మారాలి, లేదంటే పరిసయ్యుల జీవితంలా మారిపోతుంది.
⏺ "దేవుని గూర్చిన జ్ఞానము మనకు తెలిసినప్పుడు, మన గురించి మనకు సరిగ్గా తెలుస్తుంది"





ఆ సమయంలో హోషేయ ఇస్తున్న పిలుపు ఇది-"రండి, మనం దేవుని వైపు మళ్ళీ తిరుగుదాం..ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకొందాం".


Comments
Post a Comment