
అయితే అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకొని, కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
పేతురు-"అననీయా, నీ భూమి ఖరీదులో కొంత దాచుకొని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! నీవు మనుషులతో కాదు దేవుని తోనే అబద్ధమాడితివి"
అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు.



అహరోను కుమారులు(లేవి 10:1), ఏలి కుమారులు(1సమూ 2:22), ఉజ్జా(2సమూ 6:7), ఉజ్జియా(2దిన 26:19), ఇస్కరియోతు యూదా(మత్తయి 26:24) జీవితాలు.
వీరంతా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి దగ్గరగా ఉన్న మనుష్యులే కాని అవిధేయులు. కాబట్టే వారందరూ దేవుడు శిక్షలోకి వెళ్లారు.




Comments
Post a Comment