దేవుని మాటను బట్టి, ఆయనిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ లోకానికి వెఱ్ఱివారిగా కనబడతారు.
దేవుని మాటను బట్టి
★ ఓడను కట్టిన నోవహు
★ గమ్యం తెలియకనే ప్రయాణం చేసిన అబ్రాహాము,
★ఇశ్రాయేలీయులను యెఱ్ఱసముద్రం వైపు నడిపిన మోషే
★300 మందితో గొప్ప సైన్యం మీద యుద్దానికి వెళ్లిన గిద్యోను
★విగ్రహానికి మొక్కని షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు
★ స్తుతిగానాలతో యుద్దానికి వెళ్లిన యెహోషాపాతు
★ జీవనోపాధిని వదిలేసి, క్రీస్తును వెంబడించిన శిష్యులు
★ శిలువ సాక్షిగా మారిన పౌలు ఇలాంటి వారే.
● విశ్వాసంగల వారు దేవుని ఉనికిని స్పష్టంగా చూడగలరు. ఆయన మాటకు తల వంచి విధేయులౌతారు. లోకం దీన్ని గ్రహించలేదు. కాబట్టే వీరు లోకానికి వెఱ్ఱివారిగా కనబడతారు.
దానితో పాటుగా ఆయన చేత ఏర్పాటుచేయబడిన వారు ఇలాంటి వారు.
◆ దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి, లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
◆ బలవంతుల్ని సిగ్గు పరచడానికి, లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
-- గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచుల్నీ, మనుషులు తిరస్కరించిన వారినీ, ఎన్నిక లేనివారినీ దేవుడు ఎన్నుకున్నాడు" (1కోరింధీ 1:28,29)
ఈ విధంగా వారు మరి యెక్కువ మూర్ఖులుగా కనిపిస్తారు. మునుపు బుద్ధిహీనులు, మూర్ఖులు, నీచులు, తెలివితక్కువ వారుగా ఉన్న వారిలో ఒక్క రోజులో(ఒక్కసారిగా) మార్పు జరగదు. దినదినం జరిగే రూపాంతరం అందరూ కనిపెట్టలేరు గనుక దైవత్వం బుద్ధిహీనుల శరీరంలో నివాసిస్తుందని వారు గుర్తించలేరు. లోకసంబంధులు, బలహీనతలనే కళ్ళ ముందు ప్రాధాన్యంగా నిలుపుకునే బలహీనులైన విశ్వాసులు, ఇట్టి వారిని త్రోసిపుచ్చుతారు. కాని ఇలాంటి వారి ద్వారానే దేవుడు తన ఉద్దేశాలను సఫలపరుస్తాడు.
ఆ విధంగానే నాటి మత గుంపు దేవుణ్ని, ఆయన నిజ సేవకులను గుర్తించలేకపోయింది(మార్కు 3:22, అపో 4:13).
రక్షకుని గుర్తులను(ప్రవచనాల నెరవేర్పు) కనిపెట్టలేనంతగా గ్రుడ్డివారయ్యారు. యధార్థతలేని వారి కళ్ళకు దేవుడు గ్రుడ్డితనాన్ని ఈ విధంగా కలుగజేస్తాడు(రోమా1:26,28). వారి సమస్య విశ్వాసంతో నడిచే విశ్వాసితో కాదు, గాని దేవునితో, ఆయన సంబంధంతోనే!
దేవుని మాటను బట్టి
★ ఓడను కట్టిన నోవహు
★ గమ్యం తెలియకనే ప్రయాణం చేసిన అబ్రాహాము,
★ఇశ్రాయేలీయులను యెఱ్ఱసముద్రం వైపు నడిపిన మోషే
★300 మందితో గొప్ప సైన్యం మీద యుద్దానికి వెళ్లిన గిద్యోను
★విగ్రహానికి మొక్కని షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు
★ స్తుతిగానాలతో యుద్దానికి వెళ్లిన యెహోషాపాతు
★ జీవనోపాధిని వదిలేసి, క్రీస్తును వెంబడించిన శిష్యులు
★ శిలువ సాక్షిగా మారిన పౌలు ఇలాంటి వారే.
● విశ్వాసంగల వారు దేవుని ఉనికిని స్పష్టంగా చూడగలరు. ఆయన మాటకు తల వంచి విధేయులౌతారు. లోకం దీన్ని గ్రహించలేదు. కాబట్టే వీరు లోకానికి వెఱ్ఱివారిగా కనబడతారు.
దానితో పాటుగా ఆయన చేత ఏర్పాటుచేయబడిన వారు ఇలాంటి వారు.
◆ దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి, లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
◆ బలవంతుల్ని సిగ్గు పరచడానికి, లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
-- గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచుల్నీ, మనుషులు తిరస్కరించిన వారినీ, ఎన్నిక లేనివారినీ దేవుడు ఎన్నుకున్నాడు" (1కోరింధీ 1:28,29)
ఈ విధంగా వారు మరి యెక్కువ మూర్ఖులుగా కనిపిస్తారు. మునుపు బుద్ధిహీనులు, మూర్ఖులు, నీచులు, తెలివితక్కువ వారుగా ఉన్న వారిలో ఒక్క రోజులో(ఒక్కసారిగా) మార్పు జరగదు. దినదినం జరిగే రూపాంతరం అందరూ కనిపెట్టలేరు గనుక దైవత్వం బుద్ధిహీనుల శరీరంలో నివాసిస్తుందని వారు గుర్తించలేరు. లోకసంబంధులు, బలహీనతలనే కళ్ళ ముందు ప్రాధాన్యంగా నిలుపుకునే బలహీనులైన విశ్వాసులు, ఇట్టి వారిని త్రోసిపుచ్చుతారు. కాని ఇలాంటి వారి ద్వారానే దేవుడు తన ఉద్దేశాలను సఫలపరుస్తాడు.
ఆ విధంగానే నాటి మత గుంపు దేవుణ్ని, ఆయన నిజ సేవకులను గుర్తించలేకపోయింది(మార్కు 3:22, అపో 4:13).
రక్షకుని గుర్తులను(ప్రవచనాల నెరవేర్పు) కనిపెట్టలేనంతగా గ్రుడ్డివారయ్యారు. యధార్థతలేని వారి కళ్ళకు దేవుడు గ్రుడ్డితనాన్ని ఈ విధంగా కలుగజేస్తాడు(రోమా1:26,28).
Comments
Post a Comment