Skip to main content

12 July 2017

దేవునికి అవిధేయుడైన యోనా చేప కడుపులో నుండి ఇలా ప్రార్థన చేశాడు- "నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను.. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది!"

దేవుని కృప వల్ల బయటకి వచ్చి, దేవుని మాట ప్రకారం నినెవే వెళ్ళాడు. నినెవే ప్రజలను దేవుని వాక్కును బట్టి హెచ్చరించగా, పాపాత్ములైన నినెవే పట్టణస్తులు పశ్చాత్తాపడి, మారుమనస్సు పొందారు.దేవుడు నగరాన్ని రక్షించటం పట్ల యోనాకు కోపం వచ్చింది.యోనా యెహోవా పట్ల చిరాకుతో ఇలా అన్నాడు:
“ఇది జరుగుతుందని నాకు తెలుసు! ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు.నీవు కరుణ చూపిస్తావని, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! కావున యెహోవా, నన్ను చంపివేయుమని నేను నిన్ను వేడుకుంటున్నాను!"

దేవునికి ఇంత దగ్గరగా ఉండి(దైవ జ్ఞానం కలిగి ఉండి), కొన్ని రోజుల క్రితం బుద్ధిపూర్వకంగా అవిధేయుడైన యోనా దేవుని కరుణ కోసం వేడుకుంటే, దేవుడు మన్నించి బ్రతికించాడు. కాని దేవుని వెలిగింపులేని నినెవే ప్రజలకు దేవుడు కరుణ చూపిస్తే ఓర్వలేకపొయ్యాడు. దేవుని చేత క్షమించబడి ఇతరులను క్షమించలేని వారికి యోనా గుర్తుగా ఉన్నాడు. దేవుని మనస్సులేని దేవుని పరిచర్య వల్ల ఏమి ప్రయోజనం. అదంతా శూన్యమే కదా!

ఏ పాపం చేయని యేసయ్య, పాపం చేసిన వారందరి పట్ల కృప చూపుతున్నాడు(రోమా 11:32).కాని పాపం చేసి, క్షమాపణ పొందుకున్న మనం ఎదుటివారి దోషాలను లెక్కించే పనిలో నిమగ్నమౌతున్నాము.(కొందరికి ఇదే పెద్ద పరిచర్య. క్రీస్తు పరిచర్య అంతా పరిసయ్యులను, శాస్త్రులను విమర్శిస్తూ, గద్దిస్తూ ఉండలేదు. పరిచర్య ఇంకా చాలా ఉంది. నిందిస్తూ, విమర్శించడమే పరిచర్య ఐతే, ఆ పరిచర్యలో సాతాను చాలా బిజీగా ఉన్నాడు. నువ్వు వాడితో జతకట్టాల్సిన అవసరం లేదు). కృప తొలగిపోతుంది. క్రీస్తు ఏమి చేసినా అందులో కృప ఉంటుంది(చివరికి గద్దింపుతో సహా).

మనం క్షమాపణ పొందుకున్నాం. కనుక మనం ఖచ్చితంగా ఎదుటివారికి ఇవ్వాల్సివుంటుంది. లేదంటే క్షమాపణ తీసివేయబడతుంది(మత్తయి 18:23-35).
క్షమించపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు(పరలోక ప్రార్థన). అలాంటి అర్పణను/ఆరాధనను ఆయన అంగీకరించడు(మత్తయి 5:24).మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. మన ముందొక మాదిరి ఉంది. మనం ప్రేమించినా,కృప చూపినా, బుద్దిచెప్పినా, గద్దించినా, శిక్షించినా..నశించువారిని/అవిధేయులను దేవుని కృపలోనికి తేవడమే మన ఉద్దేశ్యం అయి ఉండాల్సివుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...