Skip to main content

10 July 2017

యిర్మియా -"యెహోవా దేవా! నేను నీ నామాన్ని భరిస్తున్నాను.
నీ మాటలు నాకు దొరికితే వాటిని తిన్నాను. అవి నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలుగజేశాయి.
రోజంతా యెహోవా వాక్కు నా మీదికి నిందను, హేళనను తెచ్చింది.
 "ఇక ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను" అని నేను అనుకొన్నానా? అది నా హృదయములో అగ్నివలె మండుతూ నా యెముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి యోర్చి విసికి పోయి ఉన్నాను కాని, ప్రకటింపక మానలేదు!" (యిర్మియా 15:16, 20:9)

నేను(శిష్యుడైన యోహాను) పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో --“వెళ్ళు! ఆ దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని చెప్పింది.
 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉన్నది. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగా ఉన్నది.
ఆ దూత- “నీవు చాలా మంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.(ప్రకటన 10:8-11)

 అబద్ద ప్రవక్త..జనులు/విశ్వాసులు ఏమి వినాలని కోరుకుంటారో ఆ మాటలు ప్రకటిస్తారు. అవి చెవులకు ఇంపుగా ఉంటాయి. వారిలో ఉన్న రోగాన్ని దాచి..ఆరోగ్యవతులుగా చూపిస్తారు. తుదకు అవి నిరంతర నాశనానికి నడిపిస్తాయి.
కానీ ప్రవచనాత్మకంగా చెప్పే మాట..జనులకు/విశ్వాసులకు/సంఘానికి ఏమి అవసరమో (దేవుని నుండి పొందిన మాటను) ప్రకటిస్తారు. కాబట్టే ద్వేషించబడతారు. సత్యాన్ని ప్రేమించే వారు, దైవ సంబంధులైన ప్రతి ఒక్కరూ దేవుని వాక్కును హృదయపూర్వకంగా హత్తుకుంటారు(యోహాను 3:19-21).
 రెండు నిబంధనల్లో ప్రవచనాత్మకమైన పరిచర్య, శ్రేష్టమైన పరిచర్య. పౌలు ఈ విధమైన పరిచర్యను ఎంతో ప్రోత్సాహించాడు(1కొరి 14). ప్రవచనాత్మకమైన దేవుని మాట తేనె వంటిది(యెహె 3:3). ఐతే పలుకబడిన ఆ మాటలు దేవుని యెదుట మన నిజస్థితిని తెలియజేస్తాయి. అవి హెచ్చరికలుగానూ, దేవుని గద్దింపులుగానూ, తీర్పులుగానూ ఉంటూ, ప్రకటించువారు ఆవేదనతో ప్రకటిస్తూనే, చేదైన అనుభవాల గుండా వారు వెళ్లారు. దేవుని ప్రవచనాలను ప్రకటించిన ప్రవక్తలు అనేక శ్రమలకు గురి అవ్వుతూనే దేవునికి విధేయులయ్యారు(లూకా 11:51).
ఈ విధమైన పరిచర్య వరాన్ని కోరుకున్న వారు తమను తాము మృతులుగా ఎంచుకోకపోతే దీనిని కొనసాగించలేరు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...