Skip to main content

15 June 2017


■ "దేవుని మందసం" ఒక పవిత్రమైన పెట్టె.దేవుని సన్నిధికి సూచనగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది(అందులో దేవుని ఆజ్ఞలు గల పలకలు, మన్నా, అహరోను కర్ర ఉంటాయి).

● మందసం అబీనాదాబు ఇంటినుంచి యెరూషలేములోని రాజనగరికి తీసుకురావాలని దావీదు కోరుకున్నాడు. కనుక వారు దానిని ఒక కొత్త ఎడ్లబండి మీద ఊరేగింపుగా తీసుకొని రావలనుకొన్నారు.

● ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు. దావీదు, ఇస్రాయేల్ వారంతా తమ శక్తి అంతటితో పాటలు పాడుతూ, తంతివాద్యాలనూ కంజరీలనూ తాళాలనూ వాయిస్తూ, బూరలు ఊదుతూ, దేవుని సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు.

● నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపాడు.
దేవుడు ఉజ్జామీద తీవ్రంగా కోపగించి అతన్ని మొత్తాడు. అతడు ఆ మందసం ముందే పడి చనిపోయాడు.ఒక్కసారిగా ఆ సంబరం కాస్తా విషాదంగా మారిపోయింది. 

● అప్పుడు దావీదు దేవునికి భయపడి, దారి ప్రక్కన ఉన్న ఓబేదెదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు.దేవుని మందసం అతని ఇంటిలో అతడి కుటుంబం దగ్గర 3 నెలలు ఉంది. దేవుడు ఓబేదెదోం కుటుంబం వారిని, అతను కలిగివున్న అంతటినీ దీవించాడు.

■ ఒకనికి శాపంగా మారింది, ఒకనికి దీవెన ఎందుకయ్యింది?

అతి పవిత్రమైన ఆ మందసాన్ని లేవీయులు తప్ప వేరొకరు తాకకూడదు. వారే దాన్ని మోయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
◆ దేవుని వాక్య ప్రకారంగా కాకుండా చేసే భక్తి, సేవను బట్టి దేవుడు సంతోషించడు. ఒక రోజు అవి దేవుని పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది. మనుష్యులు(వారు ఎంత భక్తిపరులైనా సరే), వారి అభిప్రాయాలను బట్టి కాక, దేవుని వాక్యంతోనే సరిచూచు కోవాలి. బెరియా సంఘం పౌలు బోధించినప్పుడు అదే చేశారు.
వాక్యానుసారంగా జీవించకుండా, మనంమంతా పెద్ద గుంపుగా కూడి, దేవుణ్ణి స్తుతించినా(ఖర్చు చేసినా) దేవుడు మనపై అసంతృప్తిగా/కోపంగా ఉండొచ్చు. వారి యొద్ద ధర్మశాస్త్రం ఉంది, కాని ఆ విషయంలో వాక్య ప్రకారంగా (దావీదు సైతం) ప్రవర్తించలేదు.
౼ ఓబేదెదోం(కుటుంబంగా) భయభక్తులతో, దేవుని వాక్యనుసారంగా మందసాన్ని చూశాడు. కనుకనే దీవించబడ్డాడు. 

★ దేవుని వాక్యం దగ్గర పెట్టుకొని, మనుష్యుల మాటలకు ఆరాధికులు కాకండి. దేవుని వాక్యంతోనే ప్రతి బోధను పోల్చి చూడవాల్సివుంది. దేవునితో ఉన్నవారు, దేవుని స్వరాన్ని గుర్తుపడతారు.మన అంతిమ గురి దేవుని సంతోషపరచడమే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...