Skip to main content

13 June 2017

"యోహానుచేత బాప్తిస్మం పొందడానికి యేసు గలలీ ప్రదేశంనుంచి అతని దగ్గరికి యొర్దానుకు వచ్చాడు. యేసు బాప్తిస్మము పొంది, ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. ఆయన పరిశుద్ధాత్మపూర్ణుడై(నింపబడిన వాడై), ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు" 

■ అప్పట్నుండి ఆయన సేవా జీవితం ఆరంభమైంది. క్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఆయన కోరుకున్న సేవను కొనసాగించలేము. శిష్యులు దేవుని ఆత్మచే నింపబడినప్పుడే (దేవుని సంఘాన్ని) శ్రేష్టమైన సేవను చేశారు.ఆత్మ దేవుడు వచ్చి వారిని నింపే వరకు వేచి ఉండమని ప్రభువు చేత ఆజ్ఞను పొందారు.

■ దీనిని బట్టి పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అర్ధం చేసుకోగలము. క్రీస్తు..పరలోక తండ్రిని ఆయన శరీరం ద్వారా బయలుపర్చాడు. పునరుద్దానుడయ్యాక పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఆశీనుడయ్యాడు. ఇప్పుడు క్రీస్తును బయలుపర్చడానికి 'పరిశుద్ధాత్ముడు' దిగి వచ్చాడు. క్రీస్తును ఎదుటి వారికి కనపర్చాలంటే ఆయన ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది.

■ అపొస్తలులు ఆత్మ నడుపగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఆయన ఆత్మకే బాగా తెలుసు మారుమనస్సు కోసం దేవునిచేత సిద్ధంచేయ్యబడి,ఎదురుచూస్తున్న వారెవరో. పౌలు భోధించినప్పుడు ఆత్మ నేర్పు మాటలతో, దృష్టాంతాలతో భోధించాడు. ఆయన ఆత్మతో నడిపింపబడే వారే ఆయనచే వాడబడుతున్నవారు(ఆయన వారు).

■ పాత నిబంధన రాతి పలకలపై వ్రాయబడి(ధర్మశాస్త్రము) మోషేచేత ఇవ్వబడింది. క్రొత్త నిబంధన క్రీస్తురక్తంచే ముద్రింపబడి(పరిశుద్ధాత్ముడు) దేవునిచేత పంపబడ్డాడు. కాబట్టి మనమిప్పుడు ధర్మశాస్త్రము కాడినుండి క్రీస్తు కృపలోనికి, ఆయన ఆత్మ ద్వారా ప్రవేశించాము.

■ దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో భోధించవచ్చు లేక జ్ఞానంతో భోధించవచ్చు.

౼ జ్ఞానంతో భోధించే వారు తలలుపండి, అతిసయిస్తూ, నిర్జీవమైన భోధకులుగా ఉంటారు. అలాంటి వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నవారు కారు, కనుకనే పాపంలో ఉన్నవారికి, పోరాడుతున్నవారికి ఎలాంటి సహాయకులుగా ఉండలేరు.(మన మధ్యలో అలాంటి వారు ఉన్నారు).

౼ దేవుని ఆత్మచేత భోదించేవారు, వ్యక్తిగతంగా దేవునిచే తాకబడేవారు. తమ జీవితాల్లో ప్రభువును చూస్తూ,అనుభవాల ద్వారా భోధించువారు. వారు దైవ లక్షణాలను ఆపేక్షిస్తూ దేవుని ఆత్మచే వ్యక్తిగతంగా మలచబడేవారు. అప్పుడు చేసే సేవ, ఇతరులకు సహాయపడే, దైవ చిత్రానుసరమైన శక్తివంతమైన సేవ.

◆ Be a SPIRIT filled practical Christian & Preacher ◆

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...