Skip to main content

22 June 2017

కరువు సమయంలో యోసేపు అన్నలు కనాను నుండి ఐగుప్తుకు బయలుదేరారు.చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు తమ తమ్ముడైన యోసేపును, గోతిలో పడేసి చంపాలను కొన్నారు. ఐతే దానినుండి బయటకు తీసి ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. ఇప్పుడు అదే ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు, యోసేపు ఇప్పుడు ఎలా ఉంటాడని అనుకొనివుండొచ్చు?
 బానిసల్లో ఒకడిగా దయనీయమైన జీవితం జీవిస్తూ ఉంటాడని జాలిపడి, బాధపడి ఉండొచ్చు.

🔸 కాని దేవుడు యోసేపును ఐగుప్తు సామ్రాజానికి గొప్ప అధికారికంగా చేశాడు. కరువు కాలంలో అందరిని కాపాడే రక్షకునిగా నియమించాడు. అది ఆయన అనాది కాల సంకల్పం.(ఆది 15:13,14)

 సమూయేలు ఏలి కి పరిచారం చేస్తున్న రోజుల్లో, ఏలి సమూయేలు భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించివుండొచ్చు?
 తన కుమారులు, వారి సంతానం యాజకులుగా ఉంటే, వారి దగ్గర పరిచారకులుగా సమూయేలు, అతని సంతానం ఉంటారని ఊహించి ఉండొచ్చు.

🔸కాని దేవుడు సమూయేలుని తర్వాత న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా నియమించాడు. ఇది అతను పుట్టకముందే దేవుడు చేసిన ఎంపిక.

 మనుష్యులు మన గురించి ఎన్నో దయనీయమైన అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాని మనల్ని నిర్మించిన సృష్టికర్తకే తెలుసు, మనం దేని కోసం సృష్టించబడ్డామో! మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా తెలియజేసి, వాటి గుండా నడిపిస్తాడు.

 దేవుడు వాడుకున్న అపొస్తలులు లోకంలో ఇలా ఉన్నారు.
పౌలు-"ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాము, దిగంబరులము; పిడిగుద్దులు తింటున్నాము. నిలువ నీడ లేకుండా ఉన్నాము. సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాము. నిందింపబడినా దీవిస్తున్నాము. హింసింపబడినా ఓర్చు కొనుచున్నాము. దూషింపబడినా బతిమాలుకుంటున్నాము ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఎంచబడ్డాము" (1కోరింథీ 4:12,13)

"నీ కోసం(దేవుని కోసం) దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెలవలె ఉన్నాం" (రోమా 8:36)

కాని దేవుడు వారిని(మనల్ని) రాజులుగాను, యాజకులుగాను చూస్తున్నాడు (1పేతురు 2:9,ప్రకటన 5:10).
💠 మన విలువ దేవునిలో ఉంది, మనుష్యుల ఆలోచనల్లో కాదు💠

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...