Skip to main content

25 May 2017

దేవుడు సీనాయి పర్వతం మీదకు మోషేను పిలిచాడు.మోషే అక్కడ నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.మోషే రావడం ఆలస్యం కావడం ప్రజలు చూచి..
అహరోనుతో- "చూడు! మా ముందర వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అన్నారు.
అప్పుడు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు మరియు ఒక బలిపీఠం నిర్మించాడు."రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ" అని చెప్పాడు.

ఒక్క దైవికమైన నాయకుడు(మోషే) అక్కడ లేకపోవడాన్ని బట్టి అప్పుడు గొప్ప నాశనం జరిగింది. దేవుణ్ణి పోలిన (దేవునితో నడిచే) ఒక్క వ్యక్తి చాలు, గుంపును దైవికంగా నడిపించడానికి.
ప్రజల మెప్పు కోసం కాక(వారికి భయపడక), దేవుణ్ణి సంతోషపెట్టే నాయకత్వమే శ్రేష్ఠమైన నాయకత్వం. ఇలాంటి నాయకత్వాన్ని సహజంగానే ప్రజలు కోరుకొరు. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. తమకు నచ్చినట్లు ప్రవర్తించే నాయకుడ్నే , దేవుణ్ణే (మాట్లాడలేని విగ్రహన్ని) మనుష్యులు కోరుకుంటారు. విశాల మార్గానికి పొయ్యెవారు అనేకులు. దానికి నడిపించే నాయకులంగా మనం ఉండకూడదు.(విశ్వాసుల గూర్చి చెప్తున్నాను)
పౌలు ఎఫెస్సు సంఘం పెద్దలతో-"నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళలాంటి వారు మీమధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు" అన్నాడు(అపో 20:27) . అప్పటి వరకు పౌలు దేవుని సంఘానికి కావలివాడి వలె కాపాడుకొన్నాడు. దేవుణ్ణి ప్రేమించినవాడు శ్రేష్ఠమైన వాక్యంతో, ఆయన మందను చక్కగా మేపుతాడు.(యోహాను 21:15)
ఏలాంటి నాయకునిగా (ఈ ఒకేఒక్క జీవితంలో) నీవు దేవుని ముందు ఉండాలనుకుంటున్నావ్? అనేకులు దేవుని మార్గం నుండి తప్పిపోవడానికి కారణమైన (అహరోను)నాయకత్వం లాగా?మార్గం తప్పి తిరుగుతున్న వారిని సరైన దారిలో నిలిపే మోషే/పౌలు లాగా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...