Skip to main content

24 May 2017

పౌలు-"నేను ఏ స్థితిలో ఉన్నా ఆస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకొన్నాను." (ఫిలిప్పీ 4: 11)

లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.ధనవంతుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు(పరదైసుకు) తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. 


అబ్రాహాము బ్రతికి ఉన్న రోజుల్లో గొప్ప ధనవంతుడు.లాజరు దరిద్రుడు. వీరిద్దర్నీ ఒకచోట చేర్చింది వారికి దేవునిపై ఉన్న విశ్వాసం.

లాజరు కడు బీదరికంలో, జబ్బులతో ఉన్నా ఎన్నడూ దేవుని తిట్టలేదు, ఎవ్వరితో తన స్థితిని పోల్చుకోలేదు. చివరికి దిక్కులేని చావును పొందినప్పటికీ, తన అంతిమ స్థితి దేవుని చెంతేనని విశ్వాసం కలిగి జీవించాడు.దేవుడు ఉంచిన ప్రతి పరిస్థితితుల్లో నమ్మకంగా దేవుణ్ణి సేవించాడు.

అబ్రాహాం తన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుని ముందు ధనాన్ని గడ్డిపరకతో సమానంగా ఎంచాడు. జరగటానికి ఎలాంటి అవకాశాలు లేని వాటిని దేవుడు వాగ్దానం చేస్తే, నిస్సందేహంగా నమ్మి, వాటికోసం ఎదురుచూశాడు. అతను ఎంతో ఇష్టపడినవారిని దూరంచేసి దేవుడు పరీక్షించాడు. అయినా తన మొదట స్థానం దేవునిదే! అని పనుల ద్వారా రుజువు చేసాడు. అన్నిటి కంటే, అందరి కంటే దేవుణ్ణే అమితంగా ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నా, శాశ్వితమైన (పర)లోకం మీదే దృష్టి పెట్టాడు.

ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవించారు.వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశం కోసం వెతుకుతుండే వాళ్ళని అనిపిస్తుంది.వారు కోరినది ఈ లోకం కంటే శ్రేష్ఠమైన దేశం అంటే పరలోక దేశం.
"తాను వారి దేవుణ్ణనిపించుకోవడానికి దేవుడు కూడా ఏమీ సిగ్గుపడట్లేదు" (హెబ్రీ11:16)
"కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి.కానీ కనిపించనివే శాశ్వతమైనవి" (2కోరింథీ4:18)

దేవుడు మనల్ని ఉంచిన స్థితిలో నుండే ఆయన్ను నమ్మకంగా సేవించాలని కోరుతున్నాడు. ఇప్పుడు నీవున్న స్థితి దేవుని వల్ల కలిగినదే..ఒకవేళ భవిష్యత్ లో ఈ స్థితి తారుమారైనా మారని దేవుడు మనతో ఉంటాడు కనుక పైన చెప్పిన భక్తుల వలే ఈ యాత్రా జీవితంలో దేవుణ్ణి నమ్మకంగా సేవిద్దాం!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...