మతాధికారులు యేసు మీద నేరం మోపాలని వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన ఒక స్త్రీని ఆయన దగ్గరకి తీసుకొని వచ్చారు. వాళ్లు-"మన చట్టం ప్రకారం ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావ్?!"
యేసు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు.వారు పట్టు విడవకుండా అడుగుతూనే ఉన్నారు.అప్పుడు యేసు-"మీలో ఏ పాపం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు!" అన్నాడు.
ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరగా అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ?నిన్నెవ్వరూ శిక్షించలేదా?” అని అడిగాడు.
యేసు ఆమెను "అమ్మా!" అని పిలిచాడు.ఒకవేళ ఆమెకు పిల్లలు ఉన్నట్లయితే ఆ సమయంలో అలా ఆమెను పిలిచుండేవారు కాదేమో!.ఈ మాటతో దేవుడు పాపాత్ముల పట్ల ఆయన (ప్రేమా) వైఖరిని తెలిజేస్తున్నాడు. పాపం చేసి, ఏ మాత్రం అర్హత లేని మనకు క్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ చూడండి! ఇది దేవుని కృప. ఆయన మంచితనం.(విశ్వాసి ఈ కృపను ఎన్నడూ మరువకూడదు)
దేవుడు ఎల్లప్పుడూ బలహీనులై, కృంగిన వారి పక్షాన నిలబడతాడు. భూమి మీద నడిచిన అత్యంత నీతిమంతుడు(పరిశుద్ధుడు), పాపిని ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. వారి పనులను ఏ మాత్రం చూడకుండానే, ఎవ్వరి పోలికన వారున్నారో దానిని బట్టి ప్రేమిస్తున్నాడు. (ఆయన పిల్లలు ఆయనని పోలి నడవాలని ఆజ్ఞ ఇస్తున్నాడు)
ఐతే ఆయన (సువార్తను)ఇక్కడితో ముగించలేదు. అనేకమంది మంది సువార్తికులు(క్రైస్తవులు) ఇక్కడతో ముగించేస్తారు.
యేసు ఆమెతో-"వెళ్ళు! ఇక నుండి పాపం చెయ్యకు!" అన్నాడు.
దేవుని గొప్ప కనికరంతో సువార్త అయిపోలేదు కాని, పాపం నుండి మరలాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు.(నీవు ప్రకటించే సువార్తలో ఈ సంపూర్ణత ఉందా?). నేడు విశ్వాసులూ ఈ కృప వరకే చూసి ఆనందిస్తున్నారు. కాని మిగితా సత్యాన్ని నిర్లక్యం చేస్తున్నారు. పౌలు&అపొస్తలలు తమ పత్రికలలో ఈ విషయాన్ని ఎన్నో సార్లు హెచ్చరించారు. సిలువ కృప పాపం చెయ్యడానికి లైసెన్స్ కాదు. పాపం నుండి మరలాలని నీకు చెప్పే సంకేతం. పాపం యెక్క తీవ్రత! పాపంపై దేవుని ఉగ్రత అని మరవకూడదు. సిలువ పాప క్షమాపణ కోసమేనా?లేక పాప విమోచన(విడుదల) కోసం కూడానా?తిరిగి పాపపు కాడి క్రింద చిక్కుకుంటే సిలువకు అర్థమేంటి?
దినదినం దేవుణ్ణి చూస్తూ, క్రీస్తుయేసు లోని కృప ద్వారా బలం పొందుకుంటూ విజయం పొందే క్రైస్తవుడు సిలువ కార్యం తన జీవితంలో వ్యర్థం కాలేదని తెలియజేస్తాడు.
యేసు వంగి వ్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు.వారు పట్టు విడవకుండా అడుగుతూనే ఉన్నారు.అప్పుడు యేసు-"మీలో ఏ పాపం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు!" అన్నాడు.
ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరగా అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. యేసు తలెత్తి చూస్తూ, “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ?నిన్నెవ్వరూ శిక్షించలేదా?” అని అడిగాడు.
యేసు ఆమెను "అమ్మా!" అని పిలిచాడు.ఒకవేళ ఆమెకు పిల్లలు ఉన్నట్లయితే ఆ సమయంలో అలా ఆమెను పిలిచుండేవారు కాదేమో!.ఈ మాటతో దేవుడు పాపాత్ముల పట్ల ఆయన (ప్రేమా) వైఖరిని తెలిజేస్తున్నాడు. పాపం చేసి, ఏ మాత్రం అర్హత లేని మనకు క్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ చూడండి! ఇది దేవుని కృప. ఆయన మంచితనం.(విశ్వాసి ఈ కృపను ఎన్నడూ మరువకూడదు)
దేవుడు ఎల్లప్పుడూ బలహీనులై, కృంగిన వారి పక్షాన నిలబడతాడు. భూమి మీద నడిచిన అత్యంత నీతిమంతుడు(పరిశుద్ధుడు), పాపిని ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. వారి పనులను ఏ మాత్రం చూడకుండానే, ఎవ్వరి పోలికన వారున్నారో దానిని బట్టి ప్రేమిస్తున్నాడు. (ఆయన పిల్లలు ఆయనని పోలి నడవాలని ఆజ్ఞ ఇస్తున్నాడు)
ఐతే ఆయన (సువార్తను)ఇక్కడితో ముగించలేదు. అనేకమంది మంది సువార్తికులు(క్రైస్తవులు) ఇక్కడతో ముగించేస్తారు.
యేసు ఆమెతో-"వెళ్ళు! ఇక నుండి పాపం చెయ్యకు!" అన్నాడు.
దేవుని గొప్ప కనికరంతో సువార్త అయిపోలేదు కాని, పాపం నుండి మరలాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు.(నీవు ప్రకటించే సువార్తలో ఈ సంపూర్ణత ఉందా?). నేడు విశ్వాసులూ ఈ కృప వరకే చూసి ఆనందిస్తున్నారు. కాని మిగితా సత్యాన్ని నిర్లక్యం చేస్తున్నారు. పౌలు&అపొస్తలలు తమ పత్రికలలో ఈ విషయాన్ని ఎన్నో సార్లు హెచ్చరించారు. సిలువ కృప పాపం చెయ్యడానికి లైసెన్స్ కాదు. పాపం నుండి మరలాలని నీకు చెప్పే సంకేతం. పాపం యెక్క తీవ్రత! పాపంపై దేవుని ఉగ్రత అని మరవకూడదు. సిలువ పాప క్షమాపణ కోసమేనా?లేక పాప విమోచన(విడుదల) కోసం కూడానా?తిరిగి పాపపు కాడి క్రింద చిక్కుకుంటే సిలువకు అర్థమేంటి?
దినదినం దేవుణ్ణి చూస్తూ, క్రీస్తుయేసు లోని కృప ద్వారా బలం పొందుకుంటూ విజయం పొందే క్రైస్తవుడు సిలువ కార్యం తన జీవితంలో వ్యర్థం కాలేదని తెలియజేస్తాడు.
Comments
Post a Comment