Skip to main content

4 July 2017

ఒకరోజు చిన్నవాడైన యాకోబు వంట వండుతున్నాడు. పెద్దవాడైన ఏశావు అప్పుడే వేటకు వెళ్ళి చాలా అలసిపోయి వచ్చాడు.

ఏశావు యాకోబుతో- “నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు" అన్నాడు . 

యాకోబు- "నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని నాకు అమ్మివేయి, అప్పుడు ఇస్తాను"


ఏశావు- “ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను. జన్మహక్కు నాకెందుకూ?”

యాకోబు- “ఐతే! మొదట నాకు ప్రమాణం చెయ్యి”. 

ఏశావు యాకోబుకు ప్రమాణం చేసి తన జన్మహక్కు అతనికి అమ్మివేశాడు.
అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు" (ఆది 25:29-34)


ఈ సంఘటనను ఏశావు చాలా చులకనగా తీసుకున్నాడు. కాని దేవుడు అలా తీసుకోలేదు. దైవ గ్రంథంలో ఆత్మీయ భ్రష్టత్వానికి సూచనగా వ్రాయించాడు. జ్యేష్ఠత్వం(మొదటి వానిగా పుట్టడం) మనం కోరుకుంటే కలిగేది కాదు, అది దేవుడు నియమించేది.
ఆ కాలమందు జ్యేష్ఠత్వానికి ఎంతో విలువ ఉండేది. దేవుని కృపకు గుర్తుగా క్రొత్త నిబంధనలో పోల్చబడింది.

" దేవుని కృప నుండి, మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్తపడండి...లైంగిక అవినీతిని సాగించేవారు కానీ, ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేనివాడు/భక్తిహీనుడు కానీ, మీలో లేకుండా జాగ్రత్తపడండి. 

తర్వాత రోజుల్లో ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని అతనికి దక్కింది తిరస్కారమే! అతనికి ఏమీ లభించలేదు."(హెబ్రీ 12:15-17)

దేవుడు ఇచ్చే అవకాశాలను, కృపను అల్పకాల సుఖాల కోసం కాలదన్నుకున్నట్లేతే, మనం ఆ కృప(దైవ అనుగ్రహం) నుండి తొలగిపోయ్యె అవకాశాలు ఉన్నాయని పరిశుద్ధగ్రంథం చెప్తుంది. దేవుణ్ని, ఆయన కృపను ఆలోచనాయుక్తంగా, బుద్ధిపూర్వకమైన తిరస్కరణ చెయ్యొదు. అల్పకాల భోగాలు గతించిపోతాయి కాని, దేవుని మార్గాలే నిలచి ఉంటాయి. దానిలో నిలచిన వారే రక్షించబడతారు. ఆ కృపకు, వాగ్దానాలకు వారసులౌతారు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...