Skip to main content

4 June 2017


గొడ్రాలైన హన్నా, ఆమె సవతి సూటిపోటి మాటలవల్ల ఎంతో దుఃఖపడి దేవుని మందిరానికి వెళ్లి ఒక మ్రొక్కుబడి చేసుకుంది.
"సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా! నన్ను జ్ఞాపకం చేసుకో! నాకొక కుమారుని కలుగజేస్తే, వాడ్ని జీవితాంతం నీ సేవకై విడిచి పెడ్తాను" అంది. దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించి, ఒక మగబిడ్డను అనుగ్రహించాడు. ఆమె దేవుణ్ణి ఎంతో స్తుతించింది.
ఈ సంఘటన వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యలను ఆలోచిద్దాం!
దేవుడు ఒక దైవికమైన వ్యక్తిని భూమి పైకి పంపాలని ఉద్దేశించాడు. ఆ వ్యక్తి గూర్చి ఎన్నో ఆలోచనలు దేవునికి ఉన్నాయి. కాబట్టి ఎంతో ప్రార్ధనాపూర్వకంగా ఆ బిడ్డను పంపాలనుకున్నాడు. హన్నాను శ్రమలాగుండా తీసుకెళ్తూ, అత్యాశక్తితో ప్రార్ధించేటట్లు నడిపించాడు.
"ఈ బిడ్డ నీ వాడే ప్రభూ!" అని దేవునికి ప్రతిష్టించే వరకు ఆ బిడ్డను పొందుకోలేకపోయింది. అంతేకాదు ప్రతిష్ఠితుడైన వానిలో ప్రార్ధనాపూర్వకంగా, దైవికంగా పెంచేటట్లు(దైవికమైన పునాది వేయునట్లు) దైవభయం గల ఆ స్త్రీకే అనుగ్రహించాడు (1సమూ 1:28,2:26). ఆయనదైన సమయంలో ఆ ప్రణాళికలను ఆ బిడ్డకు తెలియజేశాడు.
తర్వాత రోజుల్లో ఆ వ్యక్తి రాజులను నియమించే గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. అతను సమూయేలుగా పిలువబడ్డాడు. హన్నా సమూయేలుతో గడిపిన సమయం చాలా తక్కువ, కాని అతడు దేవునితో గడిపిన సమయమే(జీవితమే) ఎక్కువ. హన్నా కోరుకుంటే కాదు, కాని దేవుడు కోరుకొనే ఈ వ్యక్తిని సిద్ధం చేశాడని మనకు అర్ధమౌవుతుంది.
-- సమూయేలు గూర్చే కాదు, మనల్ని గూర్చి కూడా ఇలాగే దేవుడు గొప్ప ఉద్దేశ్యాలను కలిగి ఉన్నాడు.మన పుట్టుక తల్లిదండ్రులు ఎంపిక కాదు, కాని దేవునిదే!
-- మన బిడ్డల్ని దేవుని కోసం పెంచడం కాదు కాని దేవుని సొత్తును, నమ్మకంగా ఆయన ప్రణాళికల కోసం సిద్ధం చేయడమే!
-- పరిస్థితులను మనుష్యుల దృష్టితో చూడవచ్చు, దేవుని దృష్టితో చూడవచ్చు. దేవుని చూపుతో చూస్తే పరిస్థితులు(దేవుని వాక్యం కూడా) చాలా విభిన్నంగా కన్పిస్తాయి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...