Skip to main content

3 June 2017

-- భక్తిపరుడైన దావీదు రాజు, ఊరియా అనే సైనికుని భార్యతో వ్యభిచారం చేసి, అతనిని చంపించి, అతని భార్యని పెండ్లి చేసుకున్నాడు. ఇలాంటి తప్పుడు పని దేవుని భయంలేని వాళ్ళు కూడా చేసివుండరు.

కాని దేవుడు దావీదును గూర్చి ఇలా అన్నాడు.
"దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తను బ్రతికిన కాలమంతా దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకొంటూ, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేనికీ అవిధేయుడు కాలేదు" (1రాజులు 15:4)

తర్వాత అతని సంతతి నుండి వచ్చిన అనేక మంది రాజులతో కేవలం దావీదును బట్టి వారి రాజ్యాన్ని కాపాడుతున్నానని దేవుడు చెప్పాడు.(2రాజులు 19:34)

-- పేతురు మూడున్నర సంవత్సరాలు యేసుతో ఉండి, దేవుని మాటలు చాలా విన్నాడు, అద్భుత కార్యాలూ చూశాడు. కాని ప్రభువు సిలువకు అప్పగించుకొన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్దమాడాడు.

క్రీస్తు మరణం నుండి లేచిన తర్వాత, అలాంటి పేతురుకు దేవుని సంఘం బాధ్యతను అప్పగించాడు. ఒకప్పుడు అబద్దమాడిన పేతురు ద్వారా, దేవునిఆత్మతో అబద్దమాడిన వ్యక్తులకు (అననీయ,సప్పీరాలకు) దేవుడు తీర్పుతీర్చాడు.

ఈ సంఘటనలు ఏమి తెలియజేస్తున్నాయి? ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని అతని బలహీనతలను బట్టి మాత్రమే దేవుడు లెక్కగట్టడు. బలహీనతల విషయంలో వారు దేవుని సన్నిధిలో పడిన పశ్చతాపం, పొందిన ఆవేదన అంతా ఇంతా కాదు. అంతేకాదు, అవి కాకుండా అతని జీవితం ఎంతో ఉంది. ఈ తప్పులు కాకుండా పై ఇద్దరి జీవితాలను గమనించండి. వారు దేవునితో నడిచిన నడక, వారు చేసిన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు.

మనుష్యులు వెలి చూపులను బట్టి తీర్పు తీర్చుతారు. మానవ బలహీనత, తప్పులనే భూతద్దంలో చూస్తాము, కాని మంచిని గాలికి వదిలేస్తాము.అందుకే ప్రభువు చెప్పాడు, మంచివాడు ఒక్కడే! ఆయన దేవుడు మాత్రమే. కానీ దేవుని రూపంలో మల్చబడే విశ్వాసులు, దేవుని చూపుతో వ్యక్తులను, పరిస్థితులను చూస్తారు. ఎందుకంటే తమ జీవితాల్లో వారు ఆ కృపను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉం

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...