Skip to main content

28 June 2017

యేసు అప్పగిపబడబోవు రాత్రి...
పేతురు- "ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్లడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను!

యేసు అతనితో- "నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే ఈ రాత్రి కోడి కూస్తుందని నీకు చెప్తున్నాను"


ఆయన ఈ మాట ఎలా చెప్పగలిగాడు? 
ప్రధాన యాజకుని ఇంటి ముందర, పేతురు ఆయన ఎవరో తెలియదని 3 సార్లు అబద్దమాడటం (భవిష్యత్తును) ముందుగానే చూశాడు.
అంతేకాదు..శిష్యులంతా ఆయన్ను వదిలేసి వెళ్తారని, పేతురు ఒక్కడే, ప్రాణ ముప్పు ఉన్నా తనను వెంబడిస్తాడని కూడా ఆయన ముందుగానే చూశాడు.

తన ప్రభువుకు ఏమవుతుందో అన్న ఆందోళన, మరో ప్రక్క ప్రాణభయం-- ఐనా దాగుతూ పేతురు ఆయన వెంబడే నడుచాడు. కోడి కూసేలోపే ప్రభువు చెప్పినట్లు 3 సార్లు అబద్దమాడాడు.

తక్కిన శిష్యులెవరూ ఆయనెవరో తెలియదని అబద్దమాడలేదు, అంటే పేతురు కంటే విశ్వాసంలో బలమైనవారని అర్ధమా?కాదు. పేతురు చూపిన ప్రేమకు దరిదాపుల్లో కూడాలేరని దానర్ధం. ఆ రాత్రి పడిపోయిన పేతురును అందరూ చూశారు, కాని దేవునికై పరితపించే ప్రేమ గల పేతురుని దేవుడు చూశాడు.తర్వాత రోజుల్లో దేవునిచే గొప్పగా వాడబడబోయ్యో పేతురుకి ఈ విధంగా విరగొట్టబడటం ఎంతో అవసరం.

దెబ్బతిన్న విశ్వాసికి సలహా ఇస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం..నేను ఎప్పుడైనా ఇటువంటి మార్గాన నడిచానా?నడిస్తే నిలిచానా? సమాధానం లేదు ఐతే, మౌనంగా ఉండి, అతని జీవితం నుండి నేర్చుకోవటమే ఉత్తమమైన విషయం.

విశ్వాసిలోని బలహీనతల్ని సరిచేసుకుంటూనే వారి ప్రేమను, విశ్వాసాన్ని దేవుడు మరువడు. వైఫల్యం జరిగిందంటేనే, దేవుని కోసం ముందు నిలబడ్డాడని దానర్ధం. ఒకవేళ అది ప్రేమామయుడైన దేవుని చేతుల్లో ఆ వ్యక్తి మలచబడే సమయమెమో! కొన్ని రోజుల ఆ సంఘటన తర్వాత, మరి శ్రేష్టమైన జీవితంలోకి దేవుడు అతన్ని నడిపించ వచ్చునేమో! 

చివరి క్షణం వరకు మనకు నిరీక్షణ ఉంది. మన జీవితం ముగిసిన తర్వాతే కదా దేవుడు తీర్పుతీర్చుతాడు!కాబట్టి తొందరపడి తీర్పు తీర్చకూడదు. నీ ఆలోచనలోని ఆ వ్యక్తి, దేవుని ఆలోచనల్లోకి ఆ వ్యక్తి ఒకరు కాకపోవచ్చు. సంఘటనలను చూడొద్దు! ఉద్దేశ్యలను, హృదయాన్ని దైవ మనస్సుతో చూడాలి.

"నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు" అని ప్రభువు పేతురుతో ముందుగానే చెప్పాడు(లూకా 22:32)
మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు పేతురుతో-"నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?... నా గొర్రెపిల్లలను (సంఘాన్ని) మేపు" అని అప్పగించాడు(యోహాను 21:15).

"నీవు దేవునితో నడిచే వ్యక్తివైతే దేవుని వలె ప్రవర్తించు"

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...