Skip to main content

21 June 2017

సిలువ తీర్పు కోసం యేసు సిద్ధంగా ఉన్న సమయంలో..
పిలాతు యేసుతో--"నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు.
అందుకు యేసు--"ఆ అధికారం పైనుంచి(దేవుని నుంచి) నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు" అని జవాబిచ్చాడు.(యోహాను 19:10,11)


 విశ్వాసి జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏమీ జరుగదు. ప్రాముఖ్యంగా దేవుణ్ని హత్తుకొని జీవించే విశ్వాసి జీవితంలో, ఏమైన (చేదైన)సంఘటన జరిగిందంటే ఖశ్చితంగా దేవుడే అనుమతించాడని నమ్మాలి.(లూకా 11:49-51)

 నీతిమంతుడు అనేకుల చేత ద్వేషించబడతాడు(రుజువు క్రీస్తే). ఆయన్ను పోలి నడిచేవారికి శ్రమలు వస్తాయని ప్రభువు చెప్పాడు. పాపంతో రాజీపడిన క్రైస్తవునికి..లోకం, సాతాను స్నేహితులే!(యాకోబు 4:4).అలాంటి వారితో అపవాదికి ఎలాంటి సమస్య ఉండదు. కాని బలమైన విశ్వాసి సాతానుని సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టుగా ఉంటాడు. కాబట్టి శోధనల ద్వారా విశ్వాసిని జల్లించాలని అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి సంబంధులను(మత సంబంధులను, లోకస్థులను) ప్రేరేపిస్తూ శ్రమలకు, హింసలకు గురిచేయలని చూస్తాడు.

 విశ్వాసి నిబ్బరంగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, దానికి దేవుని అనుమతి అవసరం. ఆయన భరించదగిన శ్రమనే అనుమతిస్తాడు. శ్రమగుండా వెళ్లే విశ్వాసిని చూసి అపవాది సంబంధులు వారి నోటికి దొరికినందుకు, విజయం సాధించినట్లు సంతోషిస్తారు. కాని దేవుని అధికారాన్ని చూసిన విశ్వాసి నిబ్బరంగా ఉంటాడు(క్రీస్తు వలె).దేవుడు మనకు ప్రతి మంచి ఈవులను పంపుతాడు(శ్రమ కూడా), ఎందుకంటే ఆయన మంచి తండ్రి.

 సమస్తం పై గల దేవుని అధికారాన్ని అర్ధం చేసుకున్న విశ్వాసి ఎన్నడూ కదల్చబడడు. ఎవ్వరి మీదా సణగడు, ఎవ్వరిని ద్వేషించడు. అతన్ని ద్వేషించువారు(వారికి తెలియకుండానే) దేవుని చిత్తాలను మోసికొచ్చి, తనకు దగ్గర చేసేవారేనని గ్రహిస్తాడు.

 "క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా?" (రోమా 8:32).
చివరికి మరణానికి అప్పగించబడి, చేరువలో ఉన్నా, మనం గ్రహించాల్సిన మాట.."నేను ఆయన ప్రేమచేత భద్రం చేయబడి ఉన్నాను".

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...