Skip to main content

6 May 2017

స్వంత నీతి vs దేవుని నీతి
స్వంత నీతి(శరీర సంబంధమైన మనస్సు):
1.పాపపు పనులను నిర్లక్యం చేసి మంచి పనులను బట్టి ఉప్పోగుతుంది.(లోపలి స్థితిని నిర్లక్యం చేసి, బయటికి కనిపించే సాక్షం మీదే దృష్టి ఉంచుతుంది)
2.ప్రక్కన వారితో పోల్చుకొని, నేను వారికంటే బాగున్నానని గర్విస్తూ(లోలోపలే) చిన్న చూపు చూస్తుంది. భూసంబంధమైన వనరులను(డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు,లోకఙ్ఞానం మరియు లేఖనఙ్ఞానం) దైవ ఆశీర్వాదాలుగా భావిస్తుంది.
3.మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది.దేవుని స్నేహాన్ని(మనస్సుని) నిర్లక్యం చేస్తుంది.
4.దైవజ్ఞానాన్ని బట్టి గర్విస్తుంది. నేర్చుకొనే మనస్సుపోతుంది. ఈలాంటి స్థితి నాది కాదు మరొకరిది అనుకుంటుంది.
5.ఈ విధంగా దేవుని కృప(నుండి తొలగి) నిర్లక్యం చేసి, దైవోగ్రతలోకి ప్రవేశిస్తుంది.
దేవుని నీతి(ఆత్మ సంబంధమైన మనస్సు):
1.నా మంచిపనులు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటిదని గుర్తించి (దేవుని వాక్యాన్ని నమ్మి) తప్పుడు జీవితాన్ని బట్టి దుఃఖించి, దేవుని ముందు నిల్చొని ఆయన కరుణను వేడుకుంటుంది.
2.తనలాంటి వారిని అర్థం చేసుకొని కృప చూపిస్తుంది మరియు వారికి సహాయం చేస్తుంది .
3.మనుషుల దగ్గర మెప్పు కంటే, దేవుని మెప్పు కోరుకుంటుంది. ఈ లోకం చేత ద్వేషించబడ్తుంది.
4.దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొంటుంది. దైవ స్వరాన్ని గుర్తిస్తుంది, నేర్చుకుంటుంది (వయస్సు , తెలివితేటలూ, స్థితిగతులను పట్టించుకోదు). దైవచూపు తో మనుష్యులను, పరిస్థితులను చూస్తుంది .
5.క్రీస్తు(సిలువ బలియాగం)లో విశ్వాసముంచి, విమోచకుణ్ణి ఆశ్రయించి, కృపలో ప్రవేశించి(నిలిచివుండి) దేవుని నీతిని పొందుకుంటుంది. రక్షణలో ప్రవేశిస్తుంది.
(రోమా 3:20-28)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...