Skip to main content

17 July 2017

 "ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు.ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు"(నిర్గమ 2:11) 
 దేవుడు ఎన్నుకొన్న మోషేలో ఆవేశం, కోపం అనే బలహీనతలు కనిపిస్తున్నాయి. అతను దేవుని స్వరూప్యంలోకి మారటం అంటే వీటి స్థానంలోకి దీర్ఘశాంతం, సాత్వికం ధరించుకోవడం. మోషే దైర్యంగా దేవుని కోసం నిలబడటం ఇప్పటికే నేర్చుకున్నాడు (దైర్యం అతని స్వభావం సిద్ధంగానే ఉన్న లక్షణం). ఇప్పుడతడు దేవునిపై ఆధారపడుతూ నిమ్మళంగా ఉండే క్రీస్తు రూపంలోకి మారాల్సివుంది.
 కొందరు తమ దైర్యంబట్టి అతిశయిస్తూ, అలా లేని వారిపట్ల చిన్న చూపు చూస్తారు.ఇప్పుడు అవసరమైనది విరువబడిన అనుభవం. బలవంతుడను అనుకున్నవాడు బలహీనుడుగా ఎంచుకోవాల్సివుంది. అప్పటి వరకు దేవుడు మోషేని వాడుకోలేకపొయ్యాడు.

 దేవుడు-“యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారి ఎదుట నేను నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాను"(యిర్మీయా 1:17) 

 యిర్మీయా మృదు స్వభావి. యిర్మీయా విషయంలో దేవుని స్వరూప్యంలోకి మారటం అంటే భయాన్ని వీడి, దైర్యంగా దేవుని కొరకు నిలబడగా, వచ్చే ప్రతి శ్రమకు భయపడకుండా నిలబడటం.
 కొంతమంది తమ సాక్ష్యం చెడిపోతుందనో, కొన్ని అవకాశాలు (వనరులు) కోల్పోతామనో, భయం చేతనో, నష్టం, హాని జరుగుతుందనో, నాకెందుకనో, మౌనమౌతారు. అలాంటి వారు దీనులు, సాత్వికులు కారు. మోసపోవొద్దు!మనుష్యులు అలా పిలవచ్చేమో గాని దేవుడు పిలువడు. నీ మౌనం దేవుని బట్టి మరియు 'నేను' అనే పాత స్వభావం శిలువ వేయడాన్ని బట్టి రావాలి. దేవుడు కోపపడే చోట మౌనం వహించినా అది పాపమే అవుతుంది. ఇలాంటి స్వభావం గల వారు దేవుణ్ని బట్టి మాట్లాడటం, గద్దించడం నేర్చుకోవాల్సివుంది. అవసరమైతే దేవుని నిమిత్తం అప్పటివరకు ఉన్న సాక్షాన్ని సైతం వదులు కోవడానికి సిద్ధంగా ఉండాలి.
 పైన చేప్పిన రెండు రకాలైన వ్యక్తులు, దేవుని పనికి అవసరమైన వారే. తమకు బలం అనుకున్న బలహీనతలను బట్టి అతిశయించక, క్రీస్తు శరీరంలోని విభిన్న అవయవాలమని గుర్తెరిగి, ఒకరి వ్యక్తిత్వాలనొకరు గౌరవిస్తూ, మార్పు చెందాల్సిన వాటి విషయమై దేవుని సన్నిధిలో ఆపేక్షించబద్ధులమై ఉన్నాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...