Skip to main content

22 May 2016

“వెంటనే ఆ కన్యకలందరూ నిద్రలేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.తెలివిలేని కన్యలు ‘మా నూనె అంతా అయిపోయింది! మా దీపాలు ఆరిపోతూ ఉన్నాయి!’.....అంతట తలుపు మూయబడింది.ఈ మాటలతో యేసు తన శిష్యులను హెచ్చరించాడు.(మత్తయి 25:8,11)
సాతాను ఆది నుండి దొంగ,(దేవునిపై ఉన్న విశ్వాసాన్ని,దేవునిలో నిలిచివుండటాన్ని) దోచుకొనువాడై ఉన్నాడు. విశ్వాసిని తిరిగి లోకంలోకి తీసుకు వెళ్ళాలనే వాడి ప్రయత్నాలు. వాడు తిన్నని మార్గాలను చెరుపువాడు.విశ్వాసే వాడి ప్రథమ గురి.
లోకంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? లోకంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు(యాకోబు 4:4).
విశ్వాసి మరళా లోకస్నేహనికి తిరిగినప్పుడు, దేవుని ఆత్మ దుఃఖపడతాడు. విశ్వాసం సన్నగిల్లుతుంది. దేవుని క్రియలు పోతాయి. లోకం ఏలుతుంది. క్రియలులేని విశ్వాసం వ్యర్థం కాదా!
"దేవుని ఆత్మను ఆర్పకండి"(1థెస్స 5:19).
అలా కఠిన పర్చుకొన్నప్పుడు విశ్వాసి విశ్వసభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు .
ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు, దైవ సందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళుపడిపోతే, వాళ్లు తిరిగి మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. (హెబ్రీ6:4-8)
బైబిల్ ఈ స్థితిని గుర్చి హెచ్చరిస్తుంది.(యూదా1:12,హెబ్రీ 3:15, మత్తయి18:32-34).కొన్నిసార్లు మనం ఆ స్థితిలో ఉన్నాం, అని గుర్తించలేకుండా కూడా ఉండొచ్చు.(న్యాయ16:20). కాబట్టే పౌలు చివరి దినాల్లో- "విశ్వాసము కాపాడుకొంటిని"(2తిమోతి 4:7) అని చెప్పాడు.
యేసు-
"ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగెలాగా పారవేయబడి ఎండిపోతాడు. అలాంటి తీగెలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి."(యోహాను15:6)
"ఆ రోజు గానీ, గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.!!" (మత్తయి 25:13)
విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు క్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకొంటూ, విశ్వాసంలో, కృపలో నిలిచివుందాం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...