Skip to main content

Posts

05Feb2018

❇ పౌలు౼"ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి" (అపో 17:27,28) ❇ ■ నీ కంటూ భూమిపై ఏ ఉనికి లేనప్పుడు, నీవేవరో నీకు జ్ఞప్తిలేని సమయానికి, ఏ బంధుత్వాలు నిన్ను అలుముకోనప్పుడు,ఈ లోకానికి౼చివరికి నీ కన్న తల్లిదండ్రులు సైతం నీవేవరో తెలియనప్పుడు,నీవు పుట్టక మునుపే నిన్ను స్పష్టంగా తెలుసుకొని ఉన్న వాడు దేవుడే. ఆయనే నీ ఉనికికి కారణం, ఆయన ఆలోచనలే నీకు రూపాన్ని ఇచ్చాయి. నీ పుట్టుక ఆయన ఎంపిక! ఆయన నిర్ణయించిన స్థలంలో నీవు ఇప్పుడు ఉన్నావు. నీ పట్ల దేవుని ఆలోచనలు (ప్రణాళికలు) ఈ భూమికి పునాదులు వేయకముందే నిర్ణయింపడ్డాయి. నిన్ను కలుసుకోవడానికి ఆయన ఒక దినం నీ కోసం నియమించాడు. నీ మనస్సు నీ సృష్టికర్తను వెతకక ముందే, ఆయనే మొదట నిన్ను వెతికి, నీకు ప్రత్యక్షమైనాడు. నీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులు, బంధుమిత్రులు ఒక్కరొకరిగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు గానీ శాశ్వతంగా నిలిచిపోయే భంధం దేవునిదే! నీవు దేవుని సొత్తు! ■ సర్వశక్తిగల దేవుడు నీ మేలు గూర్చి ఆలోచించడం ఎంత గొప్ప సంగతీ! నీ ప్రతి బలహీనతలు, బలాలు, భావోద్వేగాలు, యిష్టాలు, అయిష...

02Feb2018

❇ ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ప్రభువు౼“పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది... ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు౼“బోధకుడా! ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు (లూకా 11:37-54) ❇ ■ మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే వారి ఆత్మీయ స్థితి గూర్చి ఇలా ఘాటుగా మాట్లాడగలమా? దేవుని వాక్యంలోని దేవుడు, సశరీరునిగా వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్ర భోధకులు, మత నిష్ఠగల వారు ఆయన్ను తిరస్కరించారు (ద్వేషించారు). దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది? వారికి వ్రాయబడిన వాక్యం తెల్సు! కానీ వాక్యంలోని సజీవునిగా ఉన్న దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు, మనం ఊహించుకొని క్రీస్తుకు చాలా తేడా ఉంటుంది. క్రీస్తు సమాధానధిపతి కనుక చాలా మృదువుగా,సున్నితంగా అందరితో మాట్లాడుతూ, అందరి మనన్నలు పొందుతాడని అనుకోవద్దు! అలావుంటే వారు ఆయనకు అసలు సిలువ వేస...

31Jan2018

(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు.....) ❇ అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. యేసు పేతురుతో౼“కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.(యోహా 18:10-12) ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడై ఉన్నాడు.(యోహా 1:1) ❇ ◆ ఆ దేవుని వాక్కు(bible) శరీరం ధరించుకొని యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. వాక్కుయైన(bible) క్రీస్తును అవమానించి, శిక్ష విధించడానికి తీసుకవెళ్తుంటే, పేతురు కత్తితో పోరాడి యేసును కాపాడాలనుకున్నాడు. ఆ వాక్కే పేతురుతో చెప్పింది౼“కత్తిని దాని ఒరలో పెట్టు.నా తండ్రే నాకు ఈ శ్రమను పంపాడు". ఆ తర్వాత ఆ వాక్కు పిలాతు(government) ముందు నిలుచుంది. పిలాతు(government) ౼"నీకు తెల్సా నిన్ను విడిపించే శక్తి నాకుందని".ఐతే ఆ వాక్కు౼"ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప, నా మీద నీకు ఏ అధికారం ఉండదు"(నేను మీకు ఏం చెప్తున్నానో అర్ధమైయిందా?) నేడు bible పక్షాన యుద్ధం చేద్దాం...

30Jan2018

యేసు౼"నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు" (మత్త 5:11,12). పరిమిత జ్ఞానం కలిగిన మనిషి, అనంతుడైన దేవుని ఆలోచనలను సంపూర్ణంగా ఎన్నడూ అర్ధం చేసుకోలేడు. దేవుడు విశ్వాసి జీవితంలో శ్రమలను, అవమానాలను తప్పించకుండా ఎందుకు అనుమాతిస్తున్నట్లు? శ్రమ వెనుక దేవుని ప్రణాళిక:-- ◆ శ్రమ విశ్వాసిని పరీక్షిస్తుంది: పేతురు శ్రమ రానంత వరకూ 'నీ కోసం ప్రాణం పెడతా' నని అన్నాడు. శ్రమ ద్వారా పరీక్ష కలిగినప్పుడు తన స్థితి తాను గ్రహించగలిగాడు.(లూకా 22:33, 62) ◆శ్రమ విధేయతను నేర్పిస్తుంది: క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు.(హెబ్రీ 5:8) ◆శ్రమ ఓర్పును, దేవుని పై విశ్వాసాన్ని పుట్టిస్తుంది: శ్రమల గుండా వెళ్తున్న థేస్సలోక సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు.(2థేస్స 1:4) ◆శ్రమ దేవుణ్ని అనుకోవడం నేర్పుతుంది: అరణ్యంలో సౌలు నుండి ద...

28Jan2018

❇ కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత కొర్నేలీ దగ్గరికి వచ్చి౼“కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇ ■కొర్నేలి౼మంచిమనస్సున్న భక్తిపరుడుగా ఉన్నప్పటికీని, అతను రక్షింపబడిన వాడు కాదని బైబిల్ చెప్తుంది(అపో 11:14). అనగా కొర్నేలి జీవితకాలమంతా ప్రార్ధనలు క్రమంగా చేసుకుంటూ..ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటూ..ఆ మంచి పనులు పరలోకంలో దేవునికి జ్ఞాపకార్ధంగా చేరినప్పటికీ..అవేవి అతన్ని రక్షింపలేకపోయ్యాయి.ఏ వ్యక్తి తన మంచి పనులను బట్టి దేవుని రాజ్యం చేరుకోలేడని బైబిల్ ఖండితంగా చెప్తుంది. 'ఆదాము' అనే ఒక్కడే మనిషి నుండి వచ్చిన మనల్నింతా దేవుడు మార్గం తప్పి నశించుపొయ్...

25Jan2018

❇ హేరోదు రాజు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ తెచ్చుకున్నాడు. బాప్తిసమిచ్చే యోహాను రాజుతో౼“నీ సోదరుని భార్యను ఉంచుకోవడం అన్యాయం”అంటూ వచ్చాడు. గనుక యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు బాగా తెల్సు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహానుకు భయపడేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.తన పుట్టిన రోజునాడు హేరోదు తన రాజ్యంలోని అధికారులను,గలిలయలోని గొప్పవారిని పిలిచి విందు చేశాడు.ఆ సమయంలో హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో౼“నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. ఆమె తన తల్లిచేత ప్రేరేపించబడినదై౼“బాప్తిసమిచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి” అని అడిగింది.రాజు చాలా దుఃఖం పడ్డాడు కాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయి, ఆ ప్రకారమే జరిగించాడు. ❇ ■ 'ప్రవక్త'౼దేవుని వాక్కును ...

23Jan2018

❇ భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు ఆయన చూశాడు. ఈ భూమి మీద మనుష్యులను చేసినందుకు దేవుడు విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది (ఆది 6:5,6).❇ ■ నోవహు రోజులకు భూమిపై నరులు చెడుతనం బహుగా విస్తరించింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన్ను దుఃఖపెట్టే భక్తిహీనులైన తరం ఒకటి విస్తృతంగా ప్రబలింది. ప్రజలు భక్తిహీనులై భూమిమీద వారి జీవితాలను చెడుతనంతో చెరిపి వేసుకొన్నారు(యూదా 1:14,15). కయీను దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక దేవుని గూర్చి ఆలోచనలు అతనిలో గానీ, అతని సంతానంలో గాని ఉన్న దాఖలు కనిపించవు. కయీను మొదటి నుండి ఏ మాత్రం దైవభయం లేని వాడిగా ఉంటూ, ఇహలోక విషయాల్లో ఆసక్తి పరునిగా కనిపిస్తాడు. అతని సంతతివాడైన లెమెకు దైవభయం లేకుండా (కయీను వలె) ఒకడ్ని హత్య చేసి, తన భార్యలకు గొప్పగా చెప్పుకున్నాడు. బహు భార్యత్వం మొదట ఆరంభమైనది ఈ వంశంలోనే! అంతేకాకుండా క్రొత్త విషయాలను కనుగొని, జీవిన విధానాన్ని సరళీకృతం చేసుకొనే (రాగి, ఇనుమును ఉపయోగించడం, సంగీత వాయిద్యలను వాడటం, గుడారాల్లో నివసించడం) స...

19Jan2018

❇ దేవుడు దావీదుతో౼"నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు! నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను. నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నా మందిరం మీదా నా రాజ్యం మీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది" అని అన్నాడు. దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇ ■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహ...

18Jan2018

❇ రెండు సంవత్సరాల తరువాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది.కనుక అతడు ఐగుప్తుదేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడం ఎవరి వల్ల కాలేదు.అప్పుడు రాజుకు పానపాత్ర అందించేవాడు యోసేపును గూర్చి రాజుతో చెప్పాడు. అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలో నుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. ఫరో యోసేపుతో౼“నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు. యోసేపు౼“అది నా చేత అయ్యేది కాదు. దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు ❇ ■ చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఇచ్చే విడుదల కోసం చాలా సంవత్సరాల నుండి కనిపెట్టసాగాడు. దేవుడు చేసిన వాగ్ధానంకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నా, వాగ్ధానంకు ఆధారమైన వాణ్ణే యేసేపు దృష్టించాడు. దేవుడు తన కోసం ఏం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో అతను గుర్తెరుగలేదు. ఆ చివరి రోజు చెరసాలలో అతని ప్రార్ధన(Revelation) నిజంగా గొప్పద...

10Jan2018

❇ యేసు తాను పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగిందని గ్రహించి ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు.  ఆ గ్రామం వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయణ్ని స్వీకరించలేదు. శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి౼“ప్రభూ! ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు. ఆయన వారి వైపు తిరిగి వారిని గద్దించాడు౼"మీరు ఎలాంటి ఆత్మ గల వారో మీకు తెలియదు. ఎందుకంటే మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించడానికే వచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదు" అన్నాడు. అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు. ❇ ■ పాత నిబంధనల కాలంలో ఏలీయా 'దేవుని మనిషి' అని రుజువుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మనుష్యులను దహించి వేశాయి(2 రాజు 1:10),  మోషే మీద తిరుగుబాటు చేసిన కోరాహును-వానితో ఉన్న వారిని భూమి చీల్చబడి, వారిని మ్రింగివేసింది (సంఖ్యా 16:32). అందుకే కాబోలు యాకోబు, యోహానులు క్రీస్తును తిరస్కరించిన వారిపై అగ్నిని కురిపించి ఆయనే క్రీస్తు...

08Jan2018

❇  దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించు! 'ఓ యూదా ప్రజలారా! దేవుని మాట ఆలకించండి! దేవుణ్ని ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం గుండా వచ్చే ప్రజలారా ఈ వర్తమానం వినండి... సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు. మీ జీవన విధానాన్ని మార్చుకోండి. అప్పుడే నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను. మోసపు మాటలను నమ్ముకొని "ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం!" అనొద్దు...! అయితే మీరు పనికిమాలిన మోసపు మాటలు నమ్ముతున్నారు. మీరు దొంగతనం, హత్య, వ్యభిచారం చేస్తూ, ప్రమాణం చేసి అబద్ధం చెపుతూ, విగ్రహాలకు ధూపం వేస్తూ, మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, మీరీ పాపాలు చేసి..నా పేరున్న ఈ ఆలయానికి వచ్చి, నా ఎదుట నిలబడి, 'అపాయంనుంచి తప్పించుకొన్నాం' అంటారేం? మీరు విడుదల పొందినది ఈ అసహ్య కార్యాలను చేయడానికేనా? నా పేరున్న ఈ ఆలయం మీ దృష్టికి దొంగల గుహగా అయిందా?నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!'"(యిర్మీయా7:1-11)  ❇ ■ మన జీవితం పట్ల దేవుని అభిప్రాయం ఎలావుందో, ఆసక్తిపరులమై మనస్సు పెట్టి తెలుసుకోనంత వరకు మనం పాపప...

04Jan2018

❇ బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు.యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనుంచి బయటికి వచ్చాడు.వెంటనే ఆకాశం తెరచుకొంది.దేవుని ఆత్మ ఒక పావురంలాగా దిగివచ్చి తనమీద వాలడం ఆయన చూశాడు.అప్పుడే ఆకాశంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది౼ “ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఈయనంటే నాకెంతో ఆనందం.” ❇ ■ దేవుడు యేసును బట్టి ఆనందించాడు. అప్పటికి ఆయన ఏ అద్భుతాలు-సూచక కార్యాలను గాని, సేవను గాని ప్రారంభించలేదు. మరి తండ్రి సంతోషం దీనిలో (ఎందుకు)? యేసు జీవితాన్ని బట్టి. వడ్రంగి వృత్తిలో ఉంటూ, తన కుటుంబ బాధ్యతలను కలిగి ఉంటూ, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ నీతిమంతుడై జీవించాడు.అంతే కాని ఆయన త్రియేక దైవత్వంలోని ఒకడని మాత్రం కాదు (హెబ్రీ 5:8, 2:18). క్రీస్తు వలె దేవుణ్ని సంతోష పెట్టిన సంపూర్ణుడు మరొరు లేరు. అంటే స్వచిత్తానికి సిలువ వేసి(ప్రక్కన పెట్టి) దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్న నరుడు లేడు.అనగా క్రీస్తు పరమ తండ్రి తన కోసం నిర్దేశించిన ప్రతి ప్రణాళికల నుండి తొలగిపోక తనను తాను అప్పగించుకొన్నాడు(మొదటి మానవుడు దేవుని మాటను వినక-బుద్ధి పూర్వకంగా తప్పిపోయినది,స్వచిత్తాన్ని కొనసాగించడమే అని గ...

03Jan2018

❇  ప్రవక్తయైన ఎలీషా మళ్ళీ గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడు దేశంలో కరవు ఉంది. ప్రవక్తల గుంపు ఎలీషా ముందు కూర్చుని ఉన్నప్పుడు అతడు తన పరిచారకుడితో౼“పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఈ ప్రవక్తల గుంపుకు వంటకం చెయ్యి” అన్నాడు. వారిలో ఒకడు కూరాకులను ఏరుకోవడానికి పొలాలకు వెళ్ళాడు. పిచ్చి(చేదు) ద్రాక్ష తీగె కనిపించగా ఆ ఆకులు ఎలాంటివో తెలియక, దాని ఆకులను అతడి ఒడినిండా సేకరించి, వచ్చి వంటకం వండుతున్న కుండలో తరిగి పోశాడు. ఆ వంటకం తినడానికి అక్కడివారికి వడ్డించారు. వారు తింటూ ఉంటే “దైవజనుడా! కుండ లో విషం ఉన్నది”అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు. ఎలీషా౼“పిండి కొంచెం తెండి!” అన్నాడు. అతడా పిండి కుండలో వేసి౼“వంటకం వడ్డించు. వారు తినవచ్చు” అన్నాడు. ఆ తరువాత కుండలో హానికరమైనది ఏదీ వారికి కనబడలేదు. (2రాజులు 4:38-41)  ❇ ■ ఆ చెట్టు గుణమేంటో తెలియక, చేదు ఆకులను మంచి కూర ఆకులుగా భావించి వంట వండారు. వారు తినేంత వరకూ..దాని చేదును గుర్తించలేక పోయ్యారు. అది పొరపాటున జరిగిన పని! పొరపాట్లు అనేవి నిజం(లేక సత్యం) తెలియక, సరైనదేనని యెంచి చేసే పనులు.(మనందరి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు అనుభవాలుగ...

29Dec2017

❇ రోగుల విషయంలో యేసు చేసిన అద్భుతాలు చూసిన చాలామంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట వెళ్ళారు. అప్పుడాయన 5 రొట్టెలను, 2 చేపలను సుమారు 5000 మందికి  పైగా ఉన్న జనసమూహానికి పంచిపెట్టాడు. కనుక వారందరూ తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడు తున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు... తరువాతి రోజు జన సమూహం ఆయనను వెత్తుకుంటూ సముద్రం అవతలి తీరానికి వచ్చారు. యేసు౼“కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు,రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు..నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు.. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.." ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు౼“ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. అప్పుడు యేసు తనతో ఉన్న 12 మంది శిష్యులతో౼“మీరు కూడా వెళ్ళాలను కుంటున్నారా?” అని అడిగాడు  ❇ ■ ఆయన వెంబడి వెతుక్కుంటూ వెళ్లిన జనసమూహంలో అనేకులు తన వారు కాద...

28Dec2017

❇  యెరూషలేములో "సుమెయోను" అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు, 'ఇశ్రాయేలుకు ఆదరణ కలిగేదెప్పుడా' అని రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు రక్షకుణ్ని చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి మరియ-యోసేపులు చంటి బిడ్డయైన యేసును దేవాలయంలోకి తెచ్చారు. ఆ రోజు సుమెయోను ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. అతడు తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ౼ “ప్రభూ, ఇ ప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కళ్ళారా చూశాను.అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ” అన్నాడు. యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.(లూకా 2:25-33)  ❇ ■ సుమెయోను రక్షకుని రాక కోసం ఆసక్తితో కనిపెట్టాడు కనుకనే పరిశుద్ధాత్మ ద్వారా రక్షకున్ని చూశాకే చనిపోతావని దేవుడు అతనికి వాగ్ధానం చేశాడు.ఎవరు ఆసక్తిపరులై దేవుణ్ని వెతకుతారో వారే దేవుని...

26Dec2017

❇ మరియ-యోసేపులు బేత్లెహేములో ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ఆమె తన తొలిచూలు బిడ్డను కని,పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. అయితే ఆ దూత౼“భయపడకండి.! ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు...." వారు త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలన్నీ అందరికీ ప్రకటించారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. (లూకా 2:6-18) ❇ జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ హేరోదు రాజు అంతఃపురంలోకి వెళ్లారు. వారు జ్ఞానులు కనుక అక్కడ ప్రవేశం దొరికింది! అదే అంతఃపురంలో లోకం చేత  హీనంగా చూడబడే చదువులేని గొఱ్ఱెల కాపరులను అక్కడికి అనుమతించగలరా? క్రీస్తు సర...

22Dec2017

❇ సమూయేలు యెష్షయిని, అతని కుమారులను పవిత్ర పరచి, బలి అర్పణలో పాలుపుచ్చుకోమని వారిని ఆహ్వానించాడు.యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసి౼“నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు. అయితే యెహోవా సమూయేలుతో౼“అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. దేవుడు మనిషిలాగా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా హృదయంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు.... యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు! నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు. యెష్షయి౼“అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు”. సమూయేలు౼“అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా! అతడొచ్చే వరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు... యెహోవా సమూయేలుతో౼“లేచి ఇతణ్ణి అభిషేకించు! నేను ఎన్నుకొన్నవాడు ఇతడే!”అని చెప్పాడు. సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు ❇ ■ యెష్షయి దృష్టిలో దావీదు గొఱ్ఱెలక...

21Dec2017

❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది."(కొలస్సి 3:1-3) ❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే"౼ క్రీస్తు మృతి పొందిన తర్వాతే సజీవంగా లేపబడ్డాడు. క్రీస్తు పునరుద్దానుడు అవ్వాలంటే చనిపోవడం తప్పనిసరి!మృతి లేనిది పునరుద్దానం ఉండదు(అపో 3:15).కనుక మనం క్రీస్తుతో బాటు సజీవంగా లేపబడాలంటే మొదట చనిపోవాలి పాత స్వభావం దేవున్ని విడచిపెట్టి ఈ లోకవిషయాల పైనే మనస్సు నిలుపుతుంది. అవే ప్రధానమైనవిగా వెంపర్లడేటట్లు గ్రుడ్డితనం కలుగజేసి, అపవిత్రకు-పాపానికి బానిసలుగా చేసి, ఆత్మను గూర్చిన విషయాలను మర్చిపోయేట్లుగా జీవింప జేసిస్తుంది(2కోరి 4:4). చివరికి ఆ జీవితం దేవుని నిత్యశిక్షకు, ఆయనతో నిత్య ఎడబాటుకు తీసుకెళ్తుంది(ఎఫె 2:3).ఈ స్వభావం ఎప్పుడూ ఆత్మీయ(దైవ) సంగతులను నిర్లక్ష్యం చేసి, భూసంభందమైన వాటి మీదే మనస్సు నిలిపేట్లుగా ఉంచుతుంది. ఏదెనులో దేవుని వి...

19Dec2017

❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు. అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు.... వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇ ■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి. బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తి...