❇ దేవుడు దావీదుతో౼"నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు! నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను. నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నా మందిరం మీదా నా రాజ్యం మీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది" అని అన్నాడు.
దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇
■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహవాసంపై చూపలేకపోయ్యాడు. మనుష్యులందరితో సమాధానం ఉంది కానీ తన దేవునితో సమాధానం లేదు! లోకరిత్యా అత్యంత జ్ఞానవంతుడు చివరికి భక్తి నుండి తొలగిపొయ్యాడు. మానవరీత్యా చెప్పుకుంటే క్రీస్తుకు బట్టి భూసంభందమైన సమాధానం (మనుష్యుల వైపు నుండి) మనుష్యులతో లేదు. ఆయన్ను ద్వేషించువారు అనేకులు! చివరికి ప్రాణాన్ని సైతం తీసివేయ్యాలని వెంటాడే శత్రువులు ఆయనకు ఉన్నారు. కానీ ప్రవచనానుసారం ఆయనకు "సమాధానాధిపతి" అని పేరు!(యెషయా 9:6).
■ "ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పబడినట్లుగా, క్రీస్తు రాజ్యం భూసంభందమైనది కాదని మనకు తెల్సు! (యోహాను 18:36).అలాగే ఆయన సమాధానం భూసంభంధమైనది కాదు.
౼ ప్రభువు మత్తయి 10:22 లో చెప్పిన ప్రకారం మనం(క్రీస్తు శిష్యులు) అనేక మందిచేత ద్వేషించబడతాము. మనల్ని శ్రమ పెట్టే శత్రువులు తయారవుతారు(2 తిమో 3:12).లోకంలో మనకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది, అనేక శ్రమలు అనుభవించాకే దేవుని రాజ్యంలో చేరాలని వాక్యం చెప్తుంది. మరి మనుష్యులతో సమాధానం ఎలా దొరుకుతుంది?
సిలువపై క్రీస్తు ఉన్నప్పుడు అందరూ కోపంతో, పగతో ఆయనపై రగిలిపోతున్నప్పటికీ, ఆయన వారి పట్ల క్షమాపణతో, దేవుని ప్రేమతో నింపబడినట్లుగా సమాధానాన్ని వెంటాడాడు. దానికి కారణం ఆయనకు దేవునితో సమాధానం ఉన్నది గనుక! దేవునితో సమాధానం- ఒకనికి మనుషులను భరించడం, సహించడం, క్షమించడం నేర్పుతుంది.ఎందుకంటే దేవుడు మన (నా) విస్తార దోషాలను క్షమించాడు అనేదే ఆ క్షమాపణకు మూలాధారం.కనుక ఇలాంటి దైవమానవ సమాధానాన్ని- సమాధానాధిపతియైన క్రీస్తు మూలంగానే మానవాళి పొందుకుంటుంది.(నేడు ఆ సమాధాన పర్చే క్రీస్తు-పరిచర్యను దేవుడు మనకు ఇచ్చాడు. 2 కొరింథి 5:18-20).
మనుష్యులంతా ఒక వ్యక్తిని 'మంచి వాడ'ని పొగిడినా దేవుడు అలా చెప్పకపోతే ఆ సాక్ష్యం ఎందుకూ పనికి రాదు. దేవుని సమాధానాన్ని విడిచి పెట్టి ఇహలోక సమాధానం కోసం ఆత్ర పడొద్దు(సొలొమోను వలె)! ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు, అపొస్తలులు లోకసంబంధులైన మనుషుల చేత రకరకాల చెడ్డ పేర్లతో పిలువబడ్డారు. కానీ అవన్నీ దేవుని ముందు కొట్టివేయబడ్డాయి. నీవు ఎవరి ముందు బ్రతుకుతున్నావో వారి ఆ సాక్ష్యన్ని ఘనంగా ఎంచుతావు(1రాజు 17:1).
దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇
■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహవాసంపై చూపలేకపోయ్యాడు. మనుష్యులందరితో సమాధానం ఉంది కానీ తన దేవునితో సమాధానం లేదు! లోకరిత్యా అత్యంత జ్ఞానవంతుడు చివరికి భక్తి నుండి తొలగిపొయ్యాడు. మానవరీత్యా చెప్పుకుంటే క్రీస్తుకు బట్టి భూసంభందమైన సమాధానం (మనుష్యుల వైపు నుండి) మనుష్యులతో లేదు. ఆయన్ను ద్వేషించువారు అనేకులు! చివరికి ప్రాణాన్ని సైతం తీసివేయ్యాలని వెంటాడే శత్రువులు ఆయనకు ఉన్నారు. కానీ ప్రవచనానుసారం ఆయనకు "సమాధానాధిపతి" అని పేరు!(యెషయా 9:6).
■ "ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పబడినట్లుగా, క్రీస్తు రాజ్యం భూసంభందమైనది కాదని మనకు తెల్సు! (యోహాను 18:36).అలాగే ఆయన సమాధానం భూసంభంధమైనది కాదు.
౼ ప్రభువు మత్తయి 10:22 లో చెప్పిన ప్రకారం మనం(క్రీస్తు శిష్యులు) అనేక మందిచేత ద్వేషించబడతాము. మనల్ని శ్రమ పెట్టే శత్రువులు తయారవుతారు(2 తిమో 3:12).లోకంలో మనకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది, అనేక శ్రమలు అనుభవించాకే దేవుని రాజ్యంలో చేరాలని వాక్యం చెప్తుంది. మరి మనుష్యులతో సమాధానం ఎలా దొరుకుతుంది?
సిలువపై క్రీస్తు ఉన్నప్పుడు అందరూ కోపంతో, పగతో ఆయనపై రగిలిపోతున్నప్పటికీ, ఆయన వారి పట్ల క్షమాపణతో, దేవుని ప్రేమతో నింపబడినట్లుగా సమాధానాన్ని వెంటాడాడు. దానికి కారణం ఆయనకు దేవునితో సమాధానం ఉన్నది గనుక! దేవునితో సమాధానం- ఒకనికి మనుషులను భరించడం, సహించడం, క్షమించడం నేర్పుతుంది.ఎందుకంటే దేవుడు మన (నా) విస్తార దోషాలను క్షమించాడు అనేదే ఆ క్షమాపణకు మూలాధారం.కనుక ఇలాంటి దైవమానవ సమాధానాన్ని- సమాధానాధిపతియైన క్రీస్తు మూలంగానే మానవాళి పొందుకుంటుంది.(నేడు ఆ సమాధాన పర్చే క్రీస్తు-పరిచర్యను దేవుడు మనకు ఇచ్చాడు. 2 కొరింథి 5:18-20).
మనుష్యులంతా ఒక వ్యక్తిని 'మంచి వాడ'ని పొగిడినా దేవుడు అలా చెప్పకపోతే ఆ సాక్ష్యం ఎందుకూ పనికి రాదు. దేవుని సమాధానాన్ని విడిచి పెట్టి ఇహలోక సమాధానం కోసం ఆత్ర పడొద్దు(సొలొమోను వలె)! ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు, అపొస్తలులు లోకసంబంధులైన మనుషుల చేత రకరకాల చెడ్డ పేర్లతో పిలువబడ్డారు. కానీ అవన్నీ దేవుని ముందు కొట్టివేయబడ్డాయి. నీవు ఎవరి ముందు బ్రతుకుతున్నావో వారి ఆ సాక్ష్యన్ని ఘనంగా ఎంచుతావు(1రాజు 17:1).
Comments
Post a Comment