Skip to main content

03Jan2018

 ప్రవక్తయైన ఎలీషా మళ్ళీ గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడు దేశంలో కరవు ఉంది. ప్రవక్తల గుంపు ఎలీషా ముందు కూర్చుని ఉన్నప్పుడు అతడు తన పరిచారకుడితో౼“పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఈ ప్రవక్తల గుంపుకు వంటకం చెయ్యి” అన్నాడు.

వారిలో ఒకడు కూరాకులను ఏరుకోవడానికి పొలాలకు వెళ్ళాడు. పిచ్చి(చేదు) ద్రాక్ష తీగె కనిపించగా ఆ ఆకులు ఎలాంటివో తెలియక, దాని ఆకులను అతడి ఒడినిండా సేకరించి, వచ్చి వంటకం వండుతున్న కుండలో తరిగి పోశాడు. ఆ వంటకం తినడానికి అక్కడివారికి వడ్డించారు.
వారు తింటూ ఉంటే “దైవజనుడా! కుండలో విషం ఉన్నది”అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.

ఎలీషా౼“పిండి కొంచెం తెండి!” అన్నాడు. అతడా పిండి కుండలో వేసి౼“వంటకం వడ్డించు. వారు తినవచ్చు” అన్నాడు. ఆ తరువాత కుండలో హానికరమైనది ఏదీ వారికి కనబడలేదు. (2రాజులు 4:38-41) 

■ ఆ చెట్టు గుణమేంటో తెలియక, చేదు ఆకులను మంచి కూర ఆకులుగా భావించి వంట వండారు. వారు తినేంత వరకూ..దాని చేదును గుర్తించలేక పోయ్యారు. అది పొరపాటున జరిగిన పని! పొరపాట్లు అనేవి నిజం(లేక సత్యం) తెలియక, సరైనదేనని యెంచి చేసే పనులు.(మనందరి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు అనుభవాలుగా ఉండి ఉంటాయి). ఐతే మన జీవితాల్లో జరిగే ఇలాంటి పొరపాట్లు కొన్నిసార్లు చేదైన అనుభవాలకు దారి తీస్తాయి. అనేకులు ప్రాణాలను తీసుకొనేంతగా క్రుంగుదలకు నడిపిస్తాయి.కొన్ని చెడ్డ ఆకులే కూరంతటిని చెడగొట్టినట్లుగా, ఒక చేదైన అనుభవం మిగితా జీవితానంతా హరించేటట్లు (ప్రాణాలను తీసుకొనేంతగా) క్రుంగుదలకు నడిపిస్తాయి. 'ఇక నా జీవితాన్ని బాగుచెయ్యటం ఎవ్వరికీ సాధ్యపడదు!ఇక చావే నాకు దిక్కు' అనే నిరీక్షణ లేని ఆలోచనల్లోకి వెళ్తారు.
■ దైవజనుడైన ఎలీషా విషంలా మారిన ఆ కూర కుండలో పిండిని కలుపగా దానిలోని చేదంతా పోయి బాగయ్యింది. అంతకు ముందు అదే కుండలో నుండి చేదు విషం తీయబడింది కానీ ఇప్పుడు మేలైన భోజనం తియ్యబడింది.నిజానికి ఆ పిండిలో ఏమి లేదు గాని అద్భుతాన్ని జరిగించిన శక్తిమంతుడు దేవుడే! దేవుడు అత్యంత స్వల్పమైన విషయాలతో మన కడుగడ్డు సమస్యలకు సమాధానం ఇవ్వగల సమర్థుడు! దేవునికి సమస్తం సాధ్యమే!విషంలా ఉన్న ఆహారాన్ని తిని శిష్యులు ప్రాణభయంతో కేకలు వేసి దైవజనుడైన ఎలీషాకు చెప్పారు. కానీ ఎలీషాలో ఏ మాత్రం ఆందోళన కనిపించదు. ఎలీషా ఎల్లప్పుడూ దేవునితో సంభంధంలో ఉన్నవాడు గనుక ఏ సమస్య గూర్చి చింతించక దేవుని సామర్ధ్యాన్ని నమ్మి నిమ్మళంగా-నిశ్చింతగా ఉన్నాడు. ఇది దేవునిపై మన నమ్మకాన్ని(విశ్వాసాన్ని) తెలియజేస్తుంది. బయట నుండి తేబడిన పదార్ధం (పిండి) లోపల చెడిపోయిన దాన్నంతటిని బాగుచేసినట్లే, చెడిపోయిన జీవితాల్లోకి దేవుడు ప్రవేశించినప్పుడు మార్పుపొంది మేలైన క్రొత్త వ్యక్తులంగా మారిపోతాము.(మీ కళ్ళ ముందు దేవుణ్ని నమ్మి, క్రొత్త వ్యక్తులుగా మారిపోయిన వారిని మీ భంధువుల్లో, స్నేహితుల్లో ఇప్పటికే అనేకమందిని చూసేవుంటారు)
౼కనుక ఎన్నడూ నీ నిరీక్షణ కోల్పోవద్దు!నీ కళ్ళకు అసాధ్యంగా కనిపించినవి.. దేవునికి అతిస్వల్ప విషయాలు! నీవు నమ్మితే ఇప్పటికి చెడిపోయినట్లుగా కనిపిస్తున్న ఇదే జీవితం నుండి దేవునిచే మార్చబడిన శక్తివంతమైన జీవితంలోకి నీవు అడుగుపెట్టగలవు! నామకార్థ భక్తిని వదిలి నిజమైన క్రీస్తు భక్తిలోకి అడుగు పెట్టడానికి ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకో!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...