❇ రోగుల విషయంలో యేసు చేసిన అద్భుతాలు చూసిన చాలామంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట వెళ్ళారు. అప్పుడాయన 5 రొట్టెలను, 2 చేపలను సుమారు 5000 మందికి పైగా ఉన్న జనసమూహానికి పంచిపెట్టాడు. కనుక వారందరూ తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడు తున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు...
తరువాతి రోజు జన సమూహం ఆయనను వెత్తుకుంటూ సముద్రం అవతలి తీరానికి వచ్చారు. యేసు౼“కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు,రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు..నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు.. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.."
ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు౼“ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.
ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. అప్పుడు యేసు తనతో ఉన్న 12 మంది శిష్యులతో౼“మీరు కూడా వెళ్ళాలను కుంటున్నారా?” అని అడిగాడు ❇
■ ఆయన వెంబడి వెతుక్కుంటూ వెళ్లిన జనసమూహంలో అనేకులు తన వారు కాదని యేసుకు బాగా తెల్సు!(నేడు అనేకులు ఉప్పొంగుతున్నట్లు)తన వెంబడి వస్తున్న గొప్ప జన సమూహన్ని చూసి యేసు ఎప్పుడూ సంతోషపడలేదు. పైగా అనేక సార్లు గుంపును వడగట్టాడు(filter చేశాడు). ఎందుకంటే వారు ఆయనను వెంబడిస్తుంది భూసంభందమైన విషయాల కోసం మాత్రమే గనుక!(ఆత్మలో తీవ్రత(wholeheartedness) లేకుండా వెంబడించే శిష్యులను సైతం ఆయన జల్లెడ పట్టాడు. లూకా 14:25-27). ఎవరైతే భూసంభధిత విషయాల కోసం మాత్రమే(/ప్రథమంగా) వెంబడిస్తున్నారో వారికి ఆత్మీయ సంగతులు మింగుడుపడవు కనుక అలాంటి వారు జీవమైవున్న ఆత్మ సంభంధమైన మాటలను విడిచిపెట్టేస్తారు. తమలాంటి భోధకుల కోసం వెతుకులాడతారు. అలాంటి వారికోసం అప్పటికే సాతాను సిద్ధపర్చిన భోధకుల వెనుక అనేకులు వెళ్తూ, తమ నాశనానికి వెళ్లే దారిలో వారు ప్రయాణం చేస్తారు. అట్టి భోధకులు వాక్యంలో ఉన్న క్రీస్తును కాక, వేరొక క్రీస్తును బోధిస్తారు(2కొరిధి 11:3,4). ఎరను చూపి ఆత్మలను దొంగిలించే వేటగాళ్ళలా సాతాను చేతిలో వాడబడతారు.వీరి వెనుక పొయ్యేవారు అనేకులు!
■ ఆశ్చర్యం! ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. యేసు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు.ఇంకా వారికి వెనుక తీయడానికి స్వేచ్ఛ ఉంది.తనతో ఉన్న వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయం, బెరుకు ఏమాత్రం ఆయనలో కనిపించవు! పరలోక తండ్రిచే పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినవారిగా, క్రీస్తును స్వంత రక్షకునిగా (పాపవిమోచకునిగా) అంగీకరిస్తూ, ఈ చెడిపోయిన లోకపోకడ నుండి వేరుపడటం మీద మన పునాది(విశ్వాసం) లేకపోయినట్లయితే పైన చెప్పిన గుంపులో మనం ఉంటాము.ఒకవేళ మనం దేవుని ఆలయానికి క్రమంగా వెళ్ళొచ్చు, యేసే నా దేవుడు అని చెప్పోచ్చు,దేవుని నుండి అద్భుతాలు పొందొచ్చు, పరిచర్యలో పాలుపంచుకొవచ్చు, ఐనా మనం క్రీస్తు వారంగా ఉండము. నీవు క్రీస్తు వాడవైతే క్రీస్తు (పైనున్న) పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు.నీ మనస్సు క్రీస్తుతో కూడా ఉంటే నీ ఆత్మను గూర్చిన విషయాలపై ప్రథమంగా దృష్టించు!ఆయన భూమిపై ఉన్నప్పుడు అలాగే జీవించాడు.
దేవుడు అసహ్యించుకొనే ప్రతి పాపాన్ని తీవ్రంగా యెంచు!
◆ యేసు౼“నీవు కూడా వెళ్ళాలనుకుంటున్నావా?”
తరువాతి రోజు జన సమూహం ఆయనను వెత్తుకుంటూ సముద్రం అవతలి తీరానికి వచ్చారు. యేసు౼“కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు,రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు..నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు.. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.."
ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు౼“ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.
ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. అప్పుడు యేసు తనతో ఉన్న 12 మంది శిష్యులతో౼“మీరు కూడా వెళ్ళాలను కుంటున్నారా?” అని అడిగాడు ❇
■ ఆయన వెంబడి వెతుక్కుంటూ వెళ్లిన జనసమూహంలో అనేకులు తన వారు కాదని యేసుకు బాగా తెల్సు!(నేడు అనేకులు ఉప్పొంగుతున్నట్లు)తన వెంబడి వస్తున్న గొప్ప జన సమూహన్ని చూసి యేసు ఎప్పుడూ సంతోషపడలేదు. పైగా అనేక సార్లు గుంపును వడగట్టాడు(filter చేశాడు). ఎందుకంటే వారు ఆయనను వెంబడిస్తుంది భూసంభందమైన విషయాల కోసం మాత్రమే గనుక!(ఆత్మలో తీవ్రత(wholeheartedness) లేకుండా వెంబడించే శిష్యులను సైతం ఆయన జల్లెడ పట్టాడు. లూకా 14:25-27). ఎవరైతే భూసంభధిత విషయాల కోసం మాత్రమే(/ప్రథమంగా) వెంబడిస్తున్నారో వారికి ఆత్మీయ సంగతులు మింగుడుపడవు కనుక అలాంటి వారు జీవమైవున్న ఆత్మ సంభంధమైన మాటలను విడిచిపెట్టేస్తారు. తమలాంటి భోధకుల కోసం వెతుకులాడతారు. అలాంటి వారికోసం అప్పటికే సాతాను సిద్ధపర్చిన భోధకుల వెనుక అనేకులు వెళ్తూ, తమ నాశనానికి వెళ్లే దారిలో వారు ప్రయాణం చేస్తారు. అట్టి భోధకులు వాక్యంలో ఉన్న క్రీస్తును కాక, వేరొక క్రీస్తును బోధిస్తారు(2కొరిధి 11:3,4). ఎరను చూపి ఆత్మలను దొంగిలించే వేటగాళ్ళలా సాతాను చేతిలో వాడబడతారు.వీరి వెనుక పొయ్యేవారు అనేకులు!
■ ఆశ్చర్యం! ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. యేసు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు.ఇంకా వారికి వెనుక తీయడానికి స్వేచ్ఛ ఉంది.తనతో ఉన్న వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయం, బెరుకు ఏమాత్రం ఆయనలో కనిపించవు! పరలోక తండ్రిచే పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినవారిగా, క్రీస్తును స్వంత రక్షకునిగా (పాపవిమోచకునిగా) అంగీకరిస్తూ, ఈ చెడిపోయిన లోకపోకడ నుండి వేరుపడటం మీద మన పునాది(విశ్వాసం) లేకపోయినట్లయితే పైన చెప్పిన గుంపులో మనం ఉంటాము.ఒకవేళ మనం దేవుని ఆలయానికి క్రమంగా వెళ్ళొచ్చు, యేసే నా దేవుడు అని చెప్పోచ్చు,దేవుని నుండి అద్భుతాలు పొందొచ్చు, పరిచర్యలో పాలుపంచుకొవచ్చు, ఐనా మనం క్రీస్తు వారంగా ఉండము. నీవు క్రీస్తు వాడవైతే క్రీస్తు (పైనున్న) పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు.నీ మనస్సు క్రీస్తుతో కూడా ఉంటే నీ ఆత్మను గూర్చిన విషయాలపై ప్రథమంగా దృష్టించు!ఆయన భూమిపై ఉన్నప్పుడు అలాగే జీవించాడు.
దేవుడు అసహ్యించుకొనే ప్రతి పాపాన్ని తీవ్రంగా యెంచు!
◆ యేసు౼“నీవు కూడా వెళ్ళాలనుకుంటున్నావా?”
Comments
Post a Comment