Skip to main content

21Dec2017



❇ "మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది."(కొలస్సి 3:1-3) ❇

"మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే"౼

క్రీస్తు మృతి పొందిన తర్వాతే సజీవంగా లేపబడ్డాడు. క్రీస్తు పునరుద్దానుడు అవ్వాలంటే చనిపోవడం తప్పనిసరి!మృతి లేనిది పునరుద్దానం ఉండదు(అపో 3:15).కనుక మనం క్రీస్తుతో బాటు సజీవంగా లేపబడాలంటే మొదట చనిపోవాలి పాత స్వభావం దేవున్ని విడచిపెట్టి ఈ లోకవిషయాల పైనే మనస్సు నిలుపుతుంది. అవే ప్రధానమైనవిగా వెంపర్లడేటట్లు గ్రుడ్డితనం కలుగజేసి, అపవిత్రకు-పాపానికి బానిసలుగా చేసి, ఆత్మను గూర్చిన విషయాలను మర్చిపోయేట్లుగా జీవింప జేసిస్తుంది(2కోరి 4:4). చివరికి ఆ జీవితం దేవుని నిత్యశిక్షకు, ఆయనతో నిత్య ఎడబాటుకు తీసుకెళ్తుంది(ఎఫె 2:3).ఈ స్వభావం ఎప్పుడూ ఆత్మీయ(దైవ) సంగతులను నిర్లక్ష్యం చేసి, భూసంభందమైన వాటి మీదే మనస్సు నిలిపేట్లుగా ఉంచుతుంది. ఏదెనులో దేవుని విషయంలో చనిపోయిన ఈ స్వభావానికి క్రీస్తుతో పాటు సిలువలో చంపి, క్రీస్తు ఎలాగైతే నూతన జీవంతో పునరుద్ధనుడయ్యాడో, అలాగే మనకూ నూతన జీవాన్ని(New Life) అనుగ్రహించడం దేవుని చిత్తం(2కోరి 5:17)! అంటే ఇప్పటికే ఉన్న మన స్వభావానికి అతుకులు వేయటం వంటిది కాదు గానీ, దేవుని కృపలో క్రొత్త జన్మగా మార్చుతున్నాడు. ('క్రీస్తును నమ్మండి' అని మాత్రమే కాదు 'పాపాలను బట్టి పశ్చాత్తాపడండి' అని మారుమనస్సును ప్రకటించాలి. అపో 2:38). పాపాల విషయంలో పశ్చాత్తాపడకుండా క్రొత్త జన్మ ఉండదు.


"పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి.పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి"౼

పడిపోయిన మన పాత స్వభావం మన మాంసయుక్తమైన మన దేహాల్లో నిలిచి ఉంటుంది. మనం దాని ఏలుబడి నుండి విడుదల చేయబడి, అపవాది అధికారం విషయమై చనిపోయిన వారము(రోమా 6:5). గనుక దేవుడు అనుగ్రహించిన ఈ నూతన స్వభావానికి౼వెనకకు లాగే శక్తి గల శరీర మనస్సుకు మధ్య పోరాటాలు మనలో జరుగుతుంటాయి(గలతి 5:17). శరీరారీత్యా మనం భూమిపైనే ఉన్నా, మనం ఆత్మలో పరలోక సంభంధులంగా(అంటే శరీరం భూమి మీద౼మన తల పరలోకంలో ఉన్నట్లుగా) బ్రతకాలి. 'పాత స్వభావానికి చనిపోయిన వారిగా ఎంచుకోవడం' అనేది దినదినము జరిగే అనుభవం(లూకా 9:23). "నేను" అనే స్వభావానికి ప్రతి రోజూ సిలువకు కొట్టాలి. దేవుని ఆత్మకు లోబడి జీవిస్తామో లేక శరీరం మనస్సు క్రింద జీవిస్తామో అది ఖశ్చితంగా విశ్వాసి తీర్మానమే!దేవుడు బలవంతం చెయ్యడు. క్రీస్తును సజీవునిగా లేపిన ఆత్మే, ఈ నూతన జీవితంలో మనల్ని క్రీస్తుతో కూడా లేపి, మనకు సహాయుడై దేవుని చిత్తం మనలో నెరవేరునట్లుగా చేస్తాడు.

౼ పరిశుద్దాత్ముడు బహు సున్నితమైన వాడు. ఆయనకు లోబర్చుకున్న వారినే బలపరుస్తాడు(ఆత్మపూర్ణులుగా చేస్తాడు. విశ్వాసులందరూ ఆత్మపూర్ణులు కారు అపో 6:3). విశ్వాసి పాపానికి మరలినప్పుడు దుఃఖపడతాడు. ఆయనే నేడు దేవుని చిత్తం మనలో జరిగేట్లుగా భాధ్యత తీసుకుంటాడు. దేవుని చిత్తం౼ 'మొదట తన కుమారుని(క్రీస్తు) సారూప్యంలోకి మార్చడం'(రోమా 8:29), 'రెండవదిగా మన పట్ల ఆయన ఉద్దేశించిన వ్యక్తిగత ప్రణాళికలు నెరవేర్చబడటం (ఎఫెస్సి 2:10) ఇలా ఒక వ్యక్తి పైనున్న(పరలోకంలో ఉన్న) దేవుని ఉద్దేశ్యలను వెదకగలడు. ఇవి భూసంభందమైన విషయాలన్నింటి కంటే శ్రేష్టమైనది. ఇదే విశ్వాసి అంతిమ గురి (హెబ్రీ 12:2) !

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...