Skip to main content

08Jan2018

 దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించు!
'ఓ యూదా ప్రజలారా! దేవుని మాట ఆలకించండి! దేవుణ్ని ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం గుండా వచ్చే ప్రజలారా ఈ వర్తమానం వినండి... సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు. మీ జీవన విధానాన్ని మార్చుకోండి. అప్పుడే నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను. మోసపు మాటలను నమ్ముకొని "ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం!" అనొద్దు...!
అయితే మీరు పనికిమాలిన మోసపు మాటలు నమ్ముతున్నారు. మీరు దొంగతనం, హత్య, వ్యభిచారం చేస్తూ, ప్రమాణం చేసి అబద్ధం చెపుతూ, విగ్రహాలకు ధూపం వేస్తూ, మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, మీరీ పాపాలు చేసి..నా పేరున్న ఈ ఆలయానికి వచ్చి, నా ఎదుట నిలబడి, 'అపాయంనుంచి తప్పించుకొన్నాం' అంటారేం? మీరు విడుదల పొందినది ఈ అసహ్య కార్యాలను చేయడానికేనా? నా పేరున్న ఈ ఆలయం మీ దృష్టికి దొంగల గుహగా అయిందా?నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!'"(యిర్మీయా7:1-11) 

■ మన జీవితం పట్ల దేవుని అభిప్రాయం ఎలావుందో, ఆసక్తిపరులమై మనస్సు పెట్టి తెలుసుకోనంత వరకు మనం పాపపు భ్రమలోనే బ్రతుకుతాము. ఇక్కడ వీరి విషయంలో దేవుడు అసంతృప్తిగా ఉన్నాడు. వారి వ్యక్తిగత జీవితాలకు అవసరమయ్యే ప్రవచనాత్మకమైన మాట వారి హృదయాలను తాకుతుంది(మత్త 3:7). మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్తమే దేవుని వాక్కని దృఢంగా నమ్ముతున్నారు, కానీ ప్రస్తుతం దేవుడు వారి జీవితాలకిచ్చిన(అవసరమైన) ప్రవచనాత్మకమైన మాట మాత్రం మనిషిదే(యిర్మీయాదే) గానీ దేవునిది కాదనేది వారి అభిప్రాయం!నాడు ఆ ప్రజల చేసిన తప్పిదమే, ప్రతి తరంలో జరుగుతుంది. దైవికమైన వాక్కును, దైవికమైన వ్యక్తులను తిరస్కరించే వారి సంతానం వారత్వపు సంతతిగా ప్రతి తరంలోనూ ఉన్నారు. ఎవరైతే దైవిక ప్రజలను తిరస్కరిస్తారో వారు బయటికి దేవుని వాక్కును అంగీకరిస్తున్న వారిగా కనిపిస్తున్నా, వారి రహస్యంగా జీవితాల్లో ఆయన వాక్కును తిరస్కరిస్తున్నవారే అనేది స్పష్టము!

■ నిష్కల్మషమైన-నిర్మలమైన ధర్మశాస్త్రపు వాక్కులు, పితరులు కట్టిన ఆలయం-దాని చారిత్రాత్మక గొప్పతనం,వారి జాతే వారికి అతిశయాలుగా మిగిలిపోయాయి ఆచారాలుగా బలులు, మ్రొక్కుబడిగా పండుగలు ఆచరిస్తూ..తమ పాపపు జీవితం ఏ మాత్రం విడవకుండా(దైవ భయం లేకుండా), దేవుని ఆలయానికి వస్తున్నారు. తన సహవాసానికి, మహిమకు పిలుచుకున్న దేవునికి తగినట్లుగా జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడలేదు. వాక్యంలో ఉన్న విలువైన విషయాలను బుద్ధిపూర్వకంగా వదిలి వేస్తూ, మతసంబంధమైన భక్తికి తిరిగారు. శ్రేష్టమైన దేవుని వాక్కులు తమతో ఉన్నాయని,దేవుని సన్నిధి తమతో ఉందని, ఇక ఎన్నటికీ తాము కదల్చబడమనే భ్రమలో వారున్నారు. ఆలయం భక్తిహీనులంతా కలుసుకునే దొంగల గుహలాగా మారిపోయింది(అపో 17:5, లూకా 19:46). తుదకు వారు దేవున్నుండి పొందుకున్న ఆ హెచ్చరిక ప్రకారం సురక్షితం అనుకున్న ప్రదేశం నుండి చెరపట్ట బడ్డారు, ఆలయం బబులోను చేత పడగొట్టబడింది(యిర్మీ 52)

■ ఈ క్రొత్తనిభంధనలో దేవుని ఆలయం మన దేహాలే! పాపపు బానిసత్వం నుండి క్రీస్తు మనల్ని విమోచించాడు.అర్హత లేని మనల్ని తన పరిశుద్ధ సహవాసంలోకి, మహిమలోకి పిలిచిన దేవునికి తగినట్లుగా మనం జీవించాలని కోరుతున్నాడు(1 థెస్స 2:11). తండ్రియైన దేవుడు మన కొరకు క్రీస్తులో కృపను సిద్ధం చేసి, ఆయనలో నిలిచి ఫలించాలని ఆదేశిస్తున్నాడు. ఆయన ఆత్మను మనలో జీవింప జేయటం ద్వారా, ఈ మంటి ఘటాలను దేవుని మహిమతో నింపాడు. ఐతే ఒకడు దేవుని పరిశుద్ధత నుండి మరలి, ఒకప్పుడు ఏ పాపాలను ద్వేషించి రక్షకుణ్ని ఆశ్రయించామో అదే క్రియలను మరలా రహస్యంగా తిరిగి(మతాసక్తి గల వారుగా మిగిలి), క్రీస్తు నుండి వేరుండకోరిన వారిగా ఉంటూ,'నేను సురక్షితం, నేను సురక్షితం' అనుకున్నట్లైతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే(ప్రకటన 3:16)! దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ని పాడుజేస్తాడు. నీ భక్తి పాపం నుండి, లోకం నుండి నిన్ను వేరు చేస్తుందా? దేవుని పవిత్రత వైపు నడిపిస్తుందా? మన అవయవాలను దుర్నీతికి కాక నీతిసాధనాలుగా దేవునికి అప్పగించుకొందాం! (రోమా 6:12,13).

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...