Skip to main content

28Jan2018

❇ కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత కొర్నేలీ దగ్గరికి వచ్చి౼“కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.
అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు.
అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇

■కొర్నేలి౼మంచిమనస్సున్న భక్తిపరుడుగా ఉన్నప్పటికీని, అతను రక్షింపబడిన వాడు కాదని బైబిల్ చెప్తుంది(అపో 11:14). అనగా కొర్నేలి జీవితకాలమంతా ప్రార్ధనలు క్రమంగా చేసుకుంటూ..ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటూ..ఆ మంచి పనులు పరలోకంలో దేవునికి జ్ఞాపకార్ధంగా చేరినప్పటికీ..అవేవి అతన్ని రక్షింపలేకపోయ్యాయి.ఏ వ్యక్తి తన మంచి పనులను బట్టి దేవుని రాజ్యం చేరుకోలేడని బైబిల్ ఖండితంగా చెప్తుంది. 'ఆదాము' అనే ఒక్కడే మనిషి నుండి వచ్చిన మనల్నింతా దేవుడు మార్గం తప్పి నశించుపొయ్యే పాపాత్ములుగా దేవుని చూస్తున్నాడు. అంటే మనుష్యులందరి చేత గొప్ప పాపాత్మునిగా పిలవబడే వానికీ, అలాగే మంచివానిగా పిలువబడే కొర్నేలిలాంటి వానికీ, మరణాంతం ఒకే చోటునే(నరకానికే) దేవుడు నియమిస్తాడు. ఏ భేదం లేకుండా అందరూ దారి తప్పిన వారే! ఒక్కడే క్రీస్తు మనుష్యులందరి కోసం చనిపోతే ఇక చిన్న పాపి, పెద్ద పాపి అనే భేదం ఎక్కడుంది? ఒకరి మీద మరొకరు అతిశయించడానికి ఆస్కారమేది? కనుక ఎవరిని చూసి నేను వారికంటే బాగానే ఉన్నానని అతిశయ పడకూడదు.
■ తన బాహ్యజీవితం బాగానే ఉందని కొర్నేలి సంతృప్తిపడలేదు గాని అంతరంగంలో తాను పాపినని గ్రహించి దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు మనుష్యుల దగ్గరకు క్రీస్తు రక్షణ సువార్తను చేరవేసి పరిశుద్ధాత్ముని ద్వారా సత్యాన్ని గూర్చిన సాక్ష్యమును పలుకుతాడు. యదార్థవంతులూ, సత్యానికి లోబడే ప్రతి ఒక్కరూ, తన వ్యక్తిగత పాప జీవితాన్ని మరుగు చేసుకొక, రక్షకుడైన క్రీస్తు అవసరతను గుర్తెరిగి ఆయన్ను ఆశ్రయిస్తారు (కొర్నేలి యదార్థవంతుడు). కానీ మత పెద్దలైతే తమ వద్దకు వచ్చిన దేవుని రక్షణను పామరుడైన పేతురును చూస్తూ బుద్ధిపూర్వకంగా తిరస్కరించారు(అపో4:13). శాసించగలిగే స్థానంలో ఉన్న శతాధిపతియైన కొర్నేలి, పేతురులాంటి సామాన్యుడి (జాలరి) నుండి దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడి దీనుడయ్యాడు.

■ సహజంగా మనం చేసే తప్పు ఏమిటంటే రక్షణ పొందిన దినాల్లో మన స్థితిని గుర్తిస్తాం కానీ దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు,"దేవుని పనిని జరిగించడానికి దేవునికి నా సహాయం అవసరం,అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు" అన్నట్లు ప్రవర్తిస్తాము.అలా అని బయటకు చెప్పం కానీ అలానే ప్రవర్తిస్తాము. మనకు మనం గొప్పవారిగా కనిపిస్తాం, మిగితావారంతా అల్పులుగా కనిపిస్తారు. క్రీస్తు మన జీవితంలో ఉన్న దాన్ని బట్టి, ఏమైనా మంచి మనలో నుండి వస్తుంది అంటే మట్టి ఘటాల్లో దేవుడు నింపిన మహిమేనని గుర్తెరగాలి.'రక్షణకు ముందు మనం(క్రీస్తు లేకుండా) ఎలా దేవుని ముందు వట్టివారమో, రక్షణ పొందిన తర్వాత కూడా క్రీస్తు లేకపోతే వ్యర్థులమే' అన్నది దృఢంగా తెలుసుకోవాలి. క్రీస్తులో తప్ప ఇక మనకు అతిశయించడానికి కారణమేది!? నిజంగా దేవునిలో మనం లోతుగా దేవునిలో ఎదుగుతున్నట్లైతే మన నిజస్థితిని మనం గుర్తించి దీనులమౌతాము. (1తిమోతి 1:15)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...