Skip to main content

30Jan2018

యేసు౼"నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు" (మత్త 5:11,12).

పరిమిత జ్ఞానం కలిగిన మనిషి, అనంతుడైన దేవుని ఆలోచనలను సంపూర్ణంగా ఎన్నడూ అర్ధం చేసుకోలేడు. దేవుడు విశ్వాసి జీవితంలో శ్రమలను, అవమానాలను తప్పించకుండా ఎందుకు అనుమాతిస్తున్నట్లు?
శ్రమ వెనుక దేవుని ప్రణాళిక:--
◆ శ్రమ విశ్వాసిని పరీక్షిస్తుంది: పేతురు శ్రమ రానంత వరకూ 'నీ కోసం ప్రాణం పెడతా' నని అన్నాడు. శ్రమ ద్వారా పరీక్ష కలిగినప్పుడు తన స్థితి తాను గ్రహించగలిగాడు.(లూకా 22:33, 62)
◆శ్రమ విధేయతను నేర్పిస్తుంది: క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు.(హెబ్రీ 5:8)
◆శ్రమ ఓర్పును, దేవుని పై విశ్వాసాన్ని పుట్టిస్తుంది: శ్రమల గుండా వెళ్తున్న థేస్సలోక సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు.(2థేస్స 1:4)
◆శ్రమ దేవుణ్ని అనుకోవడం నేర్పుతుంది: అరణ్యంలో సౌలు నుండి దూరంగా పారిపోతూ ఉన్న దావీదుకు దేవుడే ఆశ్రయ దుర్గంలా దేవుడు కనిపించాడు. (కీర్త 18:2)
◆శ్రమ ఆత్మీయ పాఠాలను నేర్పుతుంది: కరువు వచ్చిందని కానానుకు వదిలి ఐగుప్తుకు వెళ్లిన అబ్రహంకు దేవుడు ఆత్మీయ పాఠాలను నేర్పాడు, కనుక తర్వాత బంజరు భూమిలో కూడా పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని చూశాడు.
(ఆది 12:10, 13:10-12)
◆శ్రమ దేవుని బలాన్ని తెలుసుకునేట్లు చేస్తుంది: ముందు సముద్రం, వెనుక శ్రతువులతో బాంబేలెత్తిన ఇశ్రాయేలీయులు ఉరకనే నిల్చొని దేవుని శక్తిని చూశారు.(నిర్గమ 14:13)
◆శ్రమ దేవునికి మహిమ తెస్తుంది: షడ్రకు, మేషాకు, అబేడ్నోగుల దేవుడే దేవుడని రాజు దేవుణ్ని మహిమ పర్చాడు.(దానియేలు 3:28)
◆శ్రమ రక్షణకు మార్గాలు తెరుస్తుంది: కొరడా దెబ్బలు తిని, చేరసాలలోని పౌలు, సీలల ద్వారా అదే రాత్రి చేరసాల నాయకుని ఇంటి వారందరికి రక్షణను సిద్ధం చేశాడు.(అకా 16:24,33)
౼ శ్రమల్లో మన కొరకు దేవుడు దాచివుంచిన ఆధ్యాత్మిక మేలును గ్రహిస్తే, శ్రమ పర్చిన వారు మనకు దేవుని మేలుల పాత్రను మోసుకొచ్చే దేవుని పనిముట్లు లాగే కనిపిస్తారు.శ్రమను సహించిన మనకు దేవుడు నిర్ణయించిన నిత్యజీవానికి తగిన వారినిగా యెంచిన దేవుని తీర్పు సరైనదేనని రుజువు చేస్తుంది(2థేస్స 1:5,8). సాతాను తలపెట్టే ప్రతి కీడును కూడా దేవుడు తన బిడ్డలకు ఆత్మీయ మేలులుగా మార్చుతాడు.దేవుని నిమిత్తం ఎవరైనా శ్రమ పడితే ఆనందించమని దేవుని వాక్యము చెప్తుంది.దానికి ప్రతిఫలం దేవుని చేతిలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.పౌలు అపోస్తులందరిలో ఎక్కువ శ్రమలను అనుభవించిన వ్యక్తి కనుకనే నేటికీ అనేకులకు మాదిరిగా ఉండి దీవెనగా ఉన్నాడు.శ్రమల ద్వారా దేవునిపై నీకున్న ప్రేమను నిరూపించుకోవడానికి భూమిపైనే చక్కటి అవకాశం, పరలోకంలో శ్రమలు,త్యాగాలు ఉండవు.
(మనమెందుకు శ్రమ పరచే వారితో పోరాడకూడదు..తర్వాత ధ్యానల్లో)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...