Skip to main content

Posts

28Feb2018

❇ తెరహు(అబ్రాము తండ్రి) తన కుటుంబముతోబాటు కల్దీయుల 'ఊరు' అను పట్టణమును పెట్టి, 'కనాను'కు ప్రయాణం చేయాలని అనుకున్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును, కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. ఐతే వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి,అక్కడ ఉండిపోవాలని నిర్ణయించు కొన్నారు. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో మరణించాడు. అప్పుడు యెహోవా అబ్రాముతో౼“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు..." అబ్రాము తన భార్య శారయిని, లోతుని, హారానులో వారు గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని 'కనాను' దేశానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు (ఆది 11:31,32; 12:1-5)❇ ■ దేవుడు అబ్రామును 'హారాను' పట్టణంకు రాక ముందే అనగా కల్దీయుల దేశంలోని 'ఊరు' అను పట్టణములో ఉండగానే పిలిచాడు(అపో 7:2). తన తండ్రియైన తెరహు ఇంటి పెద్దగా ఉండగా అబ్రాము, అతనితో పాటు కానానుకు ప్రయాణం అయ్యాడు (హెబ్రీ 11:8). 'కానాను' అనే పేరు గల ప్రదేశానికి వెళ్ళమని కూడా దేవుడు చెప్పలేదు. ఎప్పుడైనా దేవుడు పూర్తి వ...

26Feb2018

❇ పౌలు బర్నబాతో౼“ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అన్నాడు. అప్పుడు 'మార్కు' అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. (అపో 15:36-41)❇ ■ "బర్నబా" భక్తిపరుడునూ,ఆదరణ చూపటంలో ఆసక్తిపరుడుగా కనిపిస్తాడు (అపో 4:36,37). ఒకప్పుడు క్రూరుడైన సౌలు(పౌలుగా) మారాక ప్రతి ఒక్కరూ అతన్ని నమ్మక, భయపడి దూరంగా ఉన్నప్పుడు,బర్నబానే అతణ్ణి ఆదరించి అపొస్తలులకు పరిచయం చేశాడు(అపో 9:27). ఆదరించే అతని స్వభావాన్ని బట్టి "బర్నబా" అని అపొస్తలులే అతనికి పేరు పెట్టారు.పౌలు దేవుణ్ని ఎంతో శ్రద్ధగా వెంబడించే వానిగా ఉన్నాడు(zealous for GOD) . క్రీస్తును ఎంత బలంగా ద్వేషించాడో, దేవుడు అతనికి కనపర్చుకొన్న తర్వాత అంతే ప్రేమతో, భయభక్తులతో క్రీస్తును సేవించాడు. క్రీస్తును ధరించుకోవడం కొరకు, తన పట్ల దే...

23Feb2018

❇ యబ్బేజు తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలు ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు౼“దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.(1దిన 4:9,10) ❇ ■ 'యబ్బేజు' అనే పేరు(వేదన) అతనికి తన ప్రమేయమేమి లేకుండానే వచ్చింది. మన ప్రమేయమేమి లేకుండా మన జీవితంలోకి వచ్చినవి దేవుని అనాదికాల ప్రణాళికల నెరవేర్పుకు దేవుని చేత పంపబడినవే..అవి అలాగే ఉండటం సరైనదే! వాటిని ఆయన తన సంకల్పాల నెరవేర్పుకు అవి ఉండవాల్సి ఉన్నది. ఉదాహరణకు మన రూపం,శరీర ఆకృతి, జనన-సమయాలు,మన తల్లిదండ్రులు, జీవనశైలి, సామాజిక-ఆర్ధిక పరిస్థితులు, అభిరుచులు (భావోద్రేకాలు), పుట్టుకతోనే వచ్చే కొన్ని సమర్ధతలు-అసమర్ధతలు మె||నవి. అంతేకాకుండా మన జీవితాల్లో అకస్మాత్తుగా సంభవించి, మనల్ని బలహీనులుగా మార్చిన చేదైన సంఘటనలు. ఇలా కొన్ని మనం కోరుకోకుండానే మనకు ద...

19Feb2018

మనం భాధలు, దుఃఖాలు, శ్రమలు, అన్యాయాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ క్రింది రెండు సత్యాలను బట్టి ధైర్యంగా వాటిని ఎదుర్కొవచ్చు. 1. దేవునికి తెలిసే ఈ విషయాలు నా జీవితంలోకి వచ్చాయి. ఆయన నన్ను దగ్గర నుండి (అనగా నాలో నుండే నన్ను) ఎరిగివున్నాడు. 2. దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడు. పై సత్యాలు నేను దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నానని తెలియజేస్తుంటాయి. యేసు౼"రెండు పిచ్చుకలు పది పైసలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. మీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క ఉంది. అందుచేత నిర్భయంగా ఉండండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ" (మత్తయి10:29-31) పేతురు౼"ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు. గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి". 1 Peter 5:7 *** దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ***

20Feb2018

❇ ఒకసారి యేసు దేవాలయంలోకి ఉన్నప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను అందరి మధ్య నిలబెట్టారు. వారు ఆయనతో౼“బోధకా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. ఆయన తల ఎత్తి చూసి౼“మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది... ❇ ■ ఈ సన్నివేశాన్ని ఇలా ఊహించవచ్చు! ఒకవైపు ధర్మశాస్త్రం! మరోవైపు క్రీస్తు! మధ్యలో పాపం చేసిన నరుడు! ఎదురుగా అపవాదియైన సాతాను! సాతాను యొక్క నేరారోపణ నిజమైనదే! ఆ...

14Feb2018

❇ పేతురు౼"కాబట్టి కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలో లాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి! మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే౼'నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి' అని వ్రాసి ఉంది" (1పేతురు 1:13-16) ❇ ■ మొదటి ఆదాముతో మనం కోల్పోయినది తిరిగి ఇవ్వడానికే కడపటి ఆదాముయైన క్రీస్తు వచ్చాడని మనకు తెల్సు(1కొరింథి 15:22)! 'కోల్పోయినది' అనగానే వెంటనే మన మనస్సులో మెదిలే మొదటి ఆలోచన౼'పరలోక రాజ్యం'. అవును! అది నిజమే! కానీ ఆదాము కోల్పోయింది అదొక్కటే కాదు. మనిషిపై దేవుని యేలుబడి పోయి, పాపం యెలుబడి క్రిందకు వెళ్ళాడు(అప్పగించ బడ్డాడు). కనుకనే క్రీస్తు మన వలె రక్తమాంసాలు గల నరుడుగా పుట్టి ఈ లోకానికి , సంపూర్ణంగా దేవుని యెలుబడికి తనను తాను జీవితాంతం అప్పగించుకొన్నాడు. పాపం చెయ్యడానికి లాగే బలం..దాని ఆకర్షణ-ప్రేరణ-శోధన క్రీస్తుపై కూడా పనిచేశాయి. ఆయ...

12Feb2018

"దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ-మగవీ, ఆడవీ ఓడలో ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు" (ఆది 7:16) ■ దేవుడు నోవహు ముందు కొన్ని సవాలుకరమైన విషయాలు ఉంచాడు. కొన్ని ప్రశ్నలు నోవహు మదిలో మెదిలి ఎదో ఒక క్షణాన ఆ పని విరమించుకోవచ్చు. "ఈ పని నా సామర్థ్యానికి మించింది.నేను చెయ్యగలనా? నేను ఎప్పుడూ ఓడను కట్టలేదు. నాకు సహాయం ఎవరున్నారు?మొదటికే నాతో ఎవ్వరూ ఏకీభవించరు. ఐనా వర్షం కురుస్తుందా? సకల జీవరాసులు జాతలుజాతలుగా రాగలవా?జంతువులు, ఒకదానిని ఒకటి చంపుకొని తింటాయి..అవి ఏలా ఒకే చోట ఇన్ని నెలలు ఉండగలవు?" ● అవన్నీ చూపునకు అసాధ్యాలు, మునుపెన్నడూ విననివి. ఇవేమీ అతని పనిని ఆపలేకపోయాయి. కారణం! నోవహు అతని సామర్ధ్యం వైపుగాని, ప్రకృతి సహజ నియమాలను గాని చూడలేదు. కానీ వీటన్నిటి పైనున్న దేవుని బలాన్ని మాత్రమే చూశాడు. సృష్టికర్తయైన దేవుని బలసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేదు. దేవుడు తను చెప్పిన మాట తాను నెరవేర్చుకోగల సమర్థుడు. నోవహు దేవుణ్ని విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుని పని మన జీవితంలో జరగాలంటే లోకం వైపు చూడక, దాని అభిప్రాయాలను లక్ష్యపె...

09Feb2018

❇ దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా! నీవు పుస్తకపు చుట్ట తీసుకొని, ఆ మొదటి రోజునుంచి ఈ రోజువరకు నేను చెప్పిన మాటలన్నీ వ్రాయి. నేను వారిమీదికి రప్పించాలనుకొన్న విపత్తు అంతటి విషయం యూదా ప్రజ విని ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవనుంచి మళ్ళితే నేను వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమిస్తాను!” అప్పుడు యిర్మీయా లేఖకుడైన బారూకును పిలిపించాడు. యెహోవా తనతో పలికిన మాటలన్నీ యిర్మీయా చెప్పి బారూకు చేత ఆ చుట్టబడే గ్రంథంలో వ్రాయించాడు. అప్పుడు యిర్మీయా బారూకుతో౼“యెహోవా ఆలయానికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. గనుక నీవు వెళ్ళి, ఈ చుట్టిన కాగితంలో నీచేత నేను వ్రాయించిన యెహోవా మాటలను ప్రజలకు చదివి వినిపించు. ఉపవాస దినాన నీవు వెళ్ళాలి. యూదా పట్టణాలనుంచి వచ్చే ప్రజలందరికీ ఈ మాటలు వినిపించు! ఒకవేళ వాళ్ళ విన్నపం యెహోవా సన్నిధానానికి చేరవచ్చు! ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళవచ్చునేమో. నిజంగా ఈ ప్రజకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటించిన కోపం, ఆగ్రహం ఇంతంత కాదు.” ❇ ■ యాజకుడైన పషూరు, అధికారుల ఆజ్ఞ మేరకు ఆలయంలోకి యిర్మీయాకు ప్రవేశం లేదు!ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమకు మేలు చేసే దేవుని వాక్యాలను మోసుకొచ్చే దైవజనుడిని బుద్ధి...

05Feb2018

❇ పౌలు౼"ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి" (అపో 17:27,28) ❇ ■ నీ కంటూ భూమిపై ఏ ఉనికి లేనప్పుడు, నీవేవరో నీకు జ్ఞప్తిలేని సమయానికి, ఏ బంధుత్వాలు నిన్ను అలుముకోనప్పుడు,ఈ లోకానికి౼చివరికి నీ కన్న తల్లిదండ్రులు సైతం నీవేవరో తెలియనప్పుడు,నీవు పుట్టక మునుపే నిన్ను స్పష్టంగా తెలుసుకొని ఉన్న వాడు దేవుడే. ఆయనే నీ ఉనికికి కారణం, ఆయన ఆలోచనలే నీకు రూపాన్ని ఇచ్చాయి. నీ పుట్టుక ఆయన ఎంపిక! ఆయన నిర్ణయించిన స్థలంలో నీవు ఇప్పుడు ఉన్నావు. నీ పట్ల దేవుని ఆలోచనలు (ప్రణాళికలు) ఈ భూమికి పునాదులు వేయకముందే నిర్ణయింపడ్డాయి. నిన్ను కలుసుకోవడానికి ఆయన ఒక దినం నీ కోసం నియమించాడు. నీ మనస్సు నీ సృష్టికర్తను వెతకక ముందే, ఆయనే మొదట నిన్ను వెతికి, నీకు ప్రత్యక్షమైనాడు. నీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, స్నేహితులు, బంధుమిత్రులు ఒక్కరొకరిగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు గానీ శాశ్వతంగా నిలిచిపోయే భంధం దేవునిదే! నీవు దేవుని సొత్తు! ■ సర్వశక్తిగల దేవుడు నీ మేలు గూర్చి ఆలోచించడం ఎంత గొప్ప సంగతీ! నీ ప్రతి బలహీనతలు, బలాలు, భావోద్వేగాలు, యిష్టాలు, అయిష...

02Feb2018

❇ ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ప్రభువు౼“పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతో, చెడుతనంతో నిండి ఉంది... ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు౼“బోధకుడా! ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు” అని ఆయనతో అన్నాడు (లూకా 11:37-54) ❇ ■ మనల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే వారి ఆత్మీయ స్థితి గూర్చి ఇలా ఘాటుగా మాట్లాడగలమా? దేవుని వాక్యంలోని దేవుడు, సశరీరునిగా వారి మధ్యలోకి వస్తే ధర్మశాస్త్ర భోధకులు, మత నిష్ఠగల వారు ఆయన్ను తిరస్కరించారు (ద్వేషించారు). దీనిని బట్టి ఏమి అర్ధమౌతుంది? వారికి వ్రాయబడిన వాక్యం తెల్సు! కానీ వాక్యంలోని సజీవునిగా ఉన్న దేవుణ్ని వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు, మనం ఊహించుకొని క్రీస్తుకు చాలా తేడా ఉంటుంది. క్రీస్తు సమాధానధిపతి కనుక చాలా మృదువుగా,సున్నితంగా అందరితో మాట్లాడుతూ, అందరి మనన్నలు పొందుతాడని అనుకోవద్దు! అలావుంటే వారు ఆయనకు అసలు సిలువ వేస...

31Jan2018

(నిన్నటి ధ్యానానికి కొనసాగింపు.....) ❇ అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. యేసు పేతురుతో౼“కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు.(యోహా 18:10-12) ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడై ఉన్నాడు.(యోహా 1:1) ❇ ◆ ఆ దేవుని వాక్కు(bible) శరీరం ధరించుకొని యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. వాక్కుయైన(bible) క్రీస్తును అవమానించి, శిక్ష విధించడానికి తీసుకవెళ్తుంటే, పేతురు కత్తితో పోరాడి యేసును కాపాడాలనుకున్నాడు. ఆ వాక్కే పేతురుతో చెప్పింది౼“కత్తిని దాని ఒరలో పెట్టు.నా తండ్రే నాకు ఈ శ్రమను పంపాడు". ఆ తర్వాత ఆ వాక్కు పిలాతు(government) ముందు నిలుచుంది. పిలాతు(government) ౼"నీకు తెల్సా నిన్ను విడిపించే శక్తి నాకుందని".ఐతే ఆ వాక్కు౼"ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప, నా మీద నీకు ఏ అధికారం ఉండదు"(నేను మీకు ఏం చెప్తున్నానో అర్ధమైయిందా?) నేడు bible పక్షాన యుద్ధం చేద్దాం...

30Jan2018

యేసు౼"నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు" (మత్త 5:11,12). పరిమిత జ్ఞానం కలిగిన మనిషి, అనంతుడైన దేవుని ఆలోచనలను సంపూర్ణంగా ఎన్నడూ అర్ధం చేసుకోలేడు. దేవుడు విశ్వాసి జీవితంలో శ్రమలను, అవమానాలను తప్పించకుండా ఎందుకు అనుమాతిస్తున్నట్లు? శ్రమ వెనుక దేవుని ప్రణాళిక:-- ◆ శ్రమ విశ్వాసిని పరీక్షిస్తుంది: పేతురు శ్రమ రానంత వరకూ 'నీ కోసం ప్రాణం పెడతా' నని అన్నాడు. శ్రమ ద్వారా పరీక్ష కలిగినప్పుడు తన స్థితి తాను గ్రహించగలిగాడు.(లూకా 22:33, 62) ◆శ్రమ విధేయతను నేర్పిస్తుంది: క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు.(హెబ్రీ 5:8) ◆శ్రమ ఓర్పును, దేవుని పై విశ్వాసాన్ని పుట్టిస్తుంది: శ్రమల గుండా వెళ్తున్న థేస్సలోక సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు.(2థేస్స 1:4) ◆శ్రమ దేవుణ్ని అనుకోవడం నేర్పుతుంది: అరణ్యంలో సౌలు నుండి ద...

28Jan2018

❇ కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత కొర్నేలీ దగ్గరికి వచ్చి౼“కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి౼“ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత౼“నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.❇ ■కొర్నేలి౼మంచిమనస్సున్న భక్తిపరుడుగా ఉన్నప్పటికీని, అతను రక్షింపబడిన వాడు కాదని బైబిల్ చెప్తుంది(అపో 11:14). అనగా కొర్నేలి జీవితకాలమంతా ప్రార్ధనలు క్రమంగా చేసుకుంటూ..ఇతరులకు మేలు చేసేవానిగా ఉంటూ..ఆ మంచి పనులు పరలోకంలో దేవునికి జ్ఞాపకార్ధంగా చేరినప్పటికీ..అవేవి అతన్ని రక్షింపలేకపోయ్యాయి.ఏ వ్యక్తి తన మంచి పనులను బట్టి దేవుని రాజ్యం చేరుకోలేడని బైబిల్ ఖండితంగా చెప్తుంది. 'ఆదాము' అనే ఒక్కడే మనిషి నుండి వచ్చిన మనల్నింతా దేవుడు మార్గం తప్పి నశించుపొయ్...

25Jan2018

❇ హేరోదు రాజు తన తోబుట్టువైన ఫిలిప్పు భార్య హేరోదియ తెచ్చుకున్నాడు. బాప్తిసమిచ్చే యోహాను రాజుతో౼“నీ సోదరుని భార్యను ఉంచుకోవడం అన్యాయం”అంటూ వచ్చాడు. గనుక యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు బాగా తెల్సు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహానుకు భయపడేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.తన పుట్టిన రోజునాడు హేరోదు తన రాజ్యంలోని అధికారులను,గలిలయలోని గొప్పవారిని పిలిచి విందు చేశాడు.ఆ సమయంలో హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో౼“నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు. ఆమె తన తల్లిచేత ప్రేరేపించబడినదై౼“బాప్తిసమిచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి” అని అడిగింది.రాజు చాలా దుఃఖం పడ్డాడు కాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేకపోయి, ఆ ప్రకారమే జరిగించాడు. ❇ ■ 'ప్రవక్త'౼దేవుని వాక్కును ...

23Jan2018

❇ భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు దేవుడు చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు ఆయన చూశాడు. ఈ భూమి మీద మనుష్యులను చేసినందుకు దేవుడు విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది (ఆది 6:5,6).❇ ■ నోవహు రోజులకు భూమిపై నరులు చెడుతనం బహుగా విస్తరించింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, ఆయన్ను దుఃఖపెట్టే భక్తిహీనులైన తరం ఒకటి విస్తృతంగా ప్రబలింది. ప్రజలు భక్తిహీనులై భూమిమీద వారి జీవితాలను చెడుతనంతో చెరిపి వేసుకొన్నారు(యూదా 1:14,15). కయీను దేవుని సన్నిధి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక దేవుని గూర్చి ఆలోచనలు అతనిలో గానీ, అతని సంతానంలో గాని ఉన్న దాఖలు కనిపించవు. కయీను మొదటి నుండి ఏ మాత్రం దైవభయం లేని వాడిగా ఉంటూ, ఇహలోక విషయాల్లో ఆసక్తి పరునిగా కనిపిస్తాడు. అతని సంతతివాడైన లెమెకు దైవభయం లేకుండా (కయీను వలె) ఒకడ్ని హత్య చేసి, తన భార్యలకు గొప్పగా చెప్పుకున్నాడు. బహు భార్యత్వం మొదట ఆరంభమైనది ఈ వంశంలోనే! అంతేకాకుండా క్రొత్త విషయాలను కనుగొని, జీవిన విధానాన్ని సరళీకృతం చేసుకొనే (రాగి, ఇనుమును ఉపయోగించడం, సంగీత వాయిద్యలను వాడటం, గుడారాల్లో నివసించడం) స...

19Jan2018

❇ దేవుడు దావీదుతో౼"నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడే నాకు మందిరం కట్టిస్తాడు! నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను. నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నా మందిరం మీదా నా రాజ్యం మీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది" అని అన్నాడు. దేవదూత మరియతో౼"నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు 'యేసు' అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు❇ ■ దేవుడు దావీదుతో అతని కుమారుడైన సొలొమోను గూర్చి పలుకుతున్న మాటలు..అవి మర్మగర్భితంగా రాబోయే క్రీస్తును గూర్చి, ఆయన పరిపాలన గురించిన ప్రవచన వాక్యాలు. సొలొమోను భూసంభంధమైన జ్ఞానంతో, సమాధానంతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మనుష్యులతో సహవాస సంభంధం మీద చూపిన శ్రద్ధ దేవుని సహ...

18Jan2018

❇ రెండు సంవత్సరాల తరువాత ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది.కనుక అతడు ఐగుప్తుదేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడం ఎవరి వల్ల కాలేదు.అప్పుడు రాజుకు పానపాత్ర అందించేవాడు యోసేపును గూర్చి రాజుతో చెప్పాడు. అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలో నుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. ఫరో యోసేపుతో౼“నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు. యోసేపు౼“అది నా చేత అయ్యేది కాదు. దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు ❇ ■ చెరసాలలో ఉన్న యోసేపు దేవుడు ఇచ్చే విడుదల కోసం చాలా సంవత్సరాల నుండి కనిపెట్టసాగాడు. దేవుడు చేసిన వాగ్ధానంకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నా, వాగ్ధానంకు ఆధారమైన వాణ్ణే యేసేపు దృష్టించాడు. దేవుడు తన కోసం ఏం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడో అతను గుర్తెరుగలేదు. ఆ చివరి రోజు చెరసాలలో అతని ప్రార్ధన(Revelation) నిజంగా గొప్పద...