Skip to main content

09Feb2018


❇ దేవుడు యిర్మీయాతో౼"యిర్మీయా! నీవు పుస్తకపు చుట్ట తీసుకొని, ఆ మొదటి రోజునుంచి ఈ రోజువరకు నేను చెప్పిన మాటలన్నీ వ్రాయి. నేను వారిమీదికి రప్పించాలనుకొన్న విపత్తు అంతటి విషయం యూదా ప్రజ విని ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవనుంచి మళ్ళితే నేను వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమిస్తాను!”
అప్పుడు యిర్మీయా లేఖకుడైన బారూకును పిలిపించాడు. యెహోవా తనతో పలికిన మాటలన్నీ యిర్మీయా చెప్పి బారూకు చేత ఆ చుట్టబడే గ్రంథంలో వ్రాయించాడు.
అప్పుడు యిర్మీయా బారూకుతో౼“యెహోవా ఆలయానికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. గనుక నీవు వెళ్ళి, ఈ చుట్టిన కాగితంలో నీచేత నేను వ్రాయించిన యెహోవా మాటలను ప్రజలకు చదివి వినిపించు. ఉపవాస దినాన నీవు వెళ్ళాలి. యూదా పట్టణాలనుంచి వచ్చే ప్రజలందరికీ ఈ మాటలు వినిపించు! ఒకవేళ వాళ్ళ విన్నపం యెహోవా సన్నిధానానికి చేరవచ్చు! ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళవచ్చునేమో. నిజంగా ఈ ప్రజకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటించిన కోపం, ఆగ్రహం ఇంతంత కాదు.” ❇

■ యాజకుడైన పషూరు, అధికారుల ఆజ్ఞ మేరకు ఆలయంలోకి యిర్మీయాకు ప్రవేశం లేదు!ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమకు మేలు చేసే దేవుని వాక్యాలను మోసుకొచ్చే దైవజనుడిని బుద్ధిపూర్వకంగా తిరస్కరించారు.కానీ బలులు, ఉపవాస ప్రార్ధనలు, యధాతధంగా జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు వారిపై కోపంతో ఉన్నాడు.దాన్ని వ్యక్తపరిచే ప్రవచన వాక్యాన్ని ఏ మాత్రం వారు అంగీకరించే స్థితిలో లేరు. వీరు దేవునిపైనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు గనుక ఆయన ముద్రను ధరించిన సేవకుని ఎలా అంగీకరించగలరు? పరలోకమందున్న దేవుడు స్వేచ్ఛగా మాట్లాడే యిర్మీయాకు భూమిపై ఉన్న దేవాలయంలో ప్రవేశం లేదు!అంటే౼అక్కడ దేవుని యేలుబడి లేదనే దానార్ధం! ఇది భక్తిపరులకు అన్నికాలల్లో సహజంగా జరిగే విషయమే(మత్త 21:23, అపో 5:17,18).

"ఇల్లు కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే, ముఖ్యమైన మూలరాయి అయింది.
ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది"
(కీర్త 118: 22,23).
■ ఐనా యిర్మీయా తన ప్రజలను అమితంగా ప్రేమించాడు. దేవుడు తనతో చెప్పి వ్రాయించిన సమయానికి, బారూకు ప్రజల ముందు చదివినప్పటి సమయానికి కొన్ని నెలల వ్యత్యాసం ఉంది(36:1,9). బారూకు ప్రజల ఉపవాస సమయం కోసం వేచి చూశాడు. ఆ సమయంలో దేవుడు చెప్పే మాటలకు వీళ్ళు చెవి ఇస్తారేమోనని వారి ఆశ! దేవుని వాక్యాన్ని బంధించడం అసాధ్యం!(అకా 2:24) ఆకాశమందు గాని, భూమిపై గాని,ఏ శక్తి దేవుని వాక్యాన్ని అవరోధంగా నిలువలేదు.పంపబడిన వాక్యంపై అధికారం మేము చెయ్యగలము(యోహా 19:10), దాని నోరు మూయించగలము అన్నట్లుగా కనిపిస్తుంది. గానీ ప్రతి ఒక్కరూ అనంత కాలల్లో అదే వాక్య అధికారం క్రింద జీవించవల్సివుంటుంది(ఎఫె 1:20). దేవుడు యిర్మీయా ద్వారా దేవుని వాక్యాన్ని పంపాడు. అతన్ని వెలివేశారు, హింసించారు. పత్రిక వ్రాయించి బారూకూ ద్వారా పంపాడు. దానిని అగ్నిలో కాల్చివేశారు(36:22).దేవుడు యిర్మీయా ద్వారా మరొక్కమారు అదే గ్రంధాన్ని తిరిగి వ్రాయించాడు(మొదటి పత్రికలోని వాక్యాల కంటే అధనంగా మరి కొన్ని తీర్పు వాక్యాలను వ్రాయించాడు. 36:32).

■ రక్తమాంసాలు గల ఓ మనిషీ! అనంతుడైన దేవునితో ఎంత వరకు పోరాటం చేయగలవు? నీ బలము ఎందాక నిలుస్తుంది! దేవుని ఆత్మ నిరంతరం మనుష్యులతో వాదించడు! ఆయన మౌనం ఆయన మాట్లాడటం కన్నా ప్రమాదకరం! నిత్యజీవానికి నడిపే మాటలను ఇంకా ఎన్నాళ్ళు ఎదిరిస్తావు?
అపవిత్రలో ఆనందించే నీవు..నీ గూర్చి నీవేమనుకుంటున్నావో కంటే, నీ గూర్చి నీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకొని కప్పుకోక, తలవంచి ఆయన వైపు తిరుగుమని ప్రభువు పేరిట బ్రతిమాలుతున్నాను...మారుమనస్సుకు ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేయకు! నామకార్థ భక్తిని వదిలి పెట్టి, నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించు!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...