Skip to main content

14Feb2018


❇ పేతురు౼"కాబట్టి కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలో లాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి! మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే౼'నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి' అని వ్రాసి ఉంది"
(1పేతురు 1:13-16) ❇


■ మొదటి ఆదాముతో మనం కోల్పోయినది తిరిగి ఇవ్వడానికే కడపటి ఆదాముయైన క్రీస్తు వచ్చాడని మనకు తెల్సు(1కొరింథి 15:22)! 'కోల్పోయినది' అనగానే వెంటనే మన మనస్సులో మెదిలే మొదటి ఆలోచన౼'పరలోక రాజ్యం'. అవును! అది నిజమే! కానీ ఆదాము కోల్పోయింది అదొక్కటే కాదు. మనిషిపై దేవుని యేలుబడి పోయి, పాపం యెలుబడి క్రిందకు వెళ్ళాడు(అప్పగించ బడ్డాడు). కనుకనే క్రీస్తు మన వలె రక్తమాంసాలు గల నరుడుగా పుట్టి ఈ లోకానికి , సంపూర్ణంగా దేవుని యెలుబడికి తనను తాను జీవితాంతం అప్పగించుకొన్నాడు. పాపం చెయ్యడానికి లాగే బలం..దాని ఆకర్షణ-ప్రేరణ-శోధన క్రీస్తుపై కూడా పనిచేశాయి. ఆయన ఆలోచనల్లో గాని, క్రియల్లో గాని ఎక్కడా తప్పిపోక(స్వంత ఇష్టం చేయక), జయించిన వానిగా తండ్రికి ఇష్టుడైన ఏకైక నరుని (perfect human being)గా దేవునిచే సాక్ష్యం పొందాడు. కాబట్టే నేడు మానవాళిని పాపపు బలం నుండి విడిపించే రక్షకునిగా, వారికి మాదిరిగా, సహాయకునిగా క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు యేసులో ఉన్న వారికి గొప్ప నిరీక్షణ ఉంది..! అదేమిటంటే..క్రీస్తు పునరుద్దణుడైన తర్వాత ఆయన పొందిన మహిమ దేహంను పోలిన దేహాలను ఒక రోజు మనం పొందబోతున్నాము. అది ఏదెనులో ఆదాముకు ఇవ్వబడిన దేహంలాంటి కాదు గాని, దేవుడు ఆదాముకు జీవవృక్షాన్ని తినప్పుడు ఇవ్వదల్చుకున్న శరీరం.ఆ దేహంలో పాపం ఉండదు-శోధన ఉండదు-అపవిత్రతకు ఏమాత్రం చోటు ఉండదు. దేవుని చేత క్రొత్తగా ఇవ్వబడిన శరీరం. దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచి, దేవునితో నిత్యకాలాల్లో సహవాసం చేయగల పరమ పవిత్రమైన దేహాన్ని (సరిగ్గా దేవుని చేత లేపబడిన క్రీస్తు దేహాన్ని పోలిన దేహాలను) ధరించుకోబోతున్నాము.

■ మనం గతించిపోవు ఈ దేహాల్లో ఉన్నప్పుడే పరిశుద్ధుడైన దేవుణ్ని ఎదుర్కోవడానికి, పరిశుద్ధ దేహాల కొరకు ఎదురుచూస్తున్నాము. ఒకడు ఒక జాబ్ కోసం ఎదురు చూస్తుంటే దానిని పొందే దిశగా సిద్ధపడతాడు కదా!అలాగే పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నిలవడం కొరకు, (పరిశుద్ధ)మహిమ దేహాల కొరకు ఎదురుచూసే ప్రతీ క్రైస్తవుడు కూడా ఈ లోకంలో నుండే పరిశుద్ధత కొరకు సిద్ధపడాలి! ఇకను పాతకాలంలో నెరవేర్చుకున్న దురాశ కోరికలను, సకల అపవిత్ర నుండి తొలగి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలచిన దేవుని వలె సకల ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండునట్లు సిద్ధపడాలని పై వాక్యాలలో పేతురు చెప్తున్నాడు. పాత స్వభావం క్రీస్తుతో కూడా చనిపోయింది. ఇప్పుడు నీవు నూతన వ్యక్తివి! ఇకను మునుపటి పాపవు యెలుబడికి ఈ శరీరాన్ని అప్పగించుకోక.. నీవు రక్షకునిగా ఎంచుకున్న క్రీస్తు రక్షణను నీవు భూమి మీద ఉండగానే అనుభవించాలి(పాపవిమోచకునిగా నీవు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి). ఎవరిని బట్టి ఆ కృపను పొందబోవుతున్నామో మనం ఆయన్ను పోలి నడుచుకోవాలని వాక్యం చెప్తుంది(1యోహా 2:6). మనం భూమిపైనే ఉన్నప్పుడు ఈ పాపం యొక్క బలం నుండి క్రీస్తు విమోచిస్తాడని నమ్మకపోతే, ఆయన దేవుని ఉగ్రత నుండి నన్ను ఒక రోజు తప్పించి, తన మహిమను చేర్చగల సమర్థుడని ఏలా నమ్మగలవు?

■ అనగా మనం భూమిపై పాపంలేని శరీరాన్ని కలిగి ఉంటామని చెప్పట్లేదు గాని పాపాన్ని ద్వేషించే దేవుని నూతన స్వభావం కలిగి, క్రీస్తు అనే పరిపూర్ణత దిశగా ప్రయాణించాలని చెప్తున్నాను(హెబ్రీ 12:2). మారుమనస్సు పొందిన విశ్వాసి హృదయం ఒక యుద్ధభూమిని పోలివుంటుంది. పాతకాలపు అపవిత్రతలకు, దేవుని నీతికి మధ్య విశ్వాసి 'స్వేచ్ఛ' అనే తీర్మానం అనేది ఉంటుంది. విశ్వాసి దేన్ని కోరుకుంటాడో..దానిని బట్టి వాని ఆత్మీయ జీవితం పురోగతి ఆధారపడి ఉంటుంది. మనకు సహాయకుడైన పరిశుద్ధాత్మునికి మనల్ని మనం లోబర్చుకుని విశ్వాసి పోరాడాలి. అందుకే దేవుడు సర్వాంగ కవచాన్ని విశ్వాసికి ఇచ్చాడు. క్రీస్తు కూడా దేవుని మార్గాల్లో నిలిచి ఉండడానికి కన్నీటితో, రోదనలతో పాపం విషయమై దేవుని సన్నిధిలో పోరాడాడు(హెబ్రీ 5:7). అది నీతిని ధరించుకోవడానికి ఆయన తృష్ణను తెలియజేస్తుంది. క్రీస్తును పోలి అలా పాపంతో పోరాడుతున్నప్పుడు.. నీవు నీ దేవుని వలె పాపాన్ని ప్రేమించక, నీతి-పరిశుద్ధతకై ప్రాకులాడే వానిగా దేవుని ముందు కనబడతావు.క్రీస్తు అంతా చేసేశాడు..నీది ఏమి లేదు అని సోమరి క్రైస్తవత్వాన్ని బైబిల్ భోధించట్లేదు! 'ఆయన రక్షణ కార్యం' ఆయన మాత్రమే వేయగలిగిన పునాది. తరువాత క్రీస్తు పరిశుద్ధతలోకి రూపాంతరం విశ్వాసి ఎంపికే(ఏదెనులో ఆదాము స్వేచ్ఛను జ్ఞాపకం చేసుకోండి). 'స్వచిత్తానికి' అనుదినం సిలువ వేయకుండా దేవుడు తన క్రియను బలవంతంగా కొనసాగించడు. క్రీస్తు మన పక్షాన సంపూర్ణంగా దైవనీతిని నెరవేర్చి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని,చులకనగా చూడక, మనల్ని తన సహవాసానికి పిలచిన వాని నమ్మకానికి తగినట్లుగా, మంచి పోరాటం పోరాడే యోధులంగా దేవుని ముందు నిలుద్దాం! ఆయన నమ్మదగినవాడు కనుక విశ్వసించిన ప్రతి ఒక్కనికి జయకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...