Skip to main content

12Feb2018


"దేవుడు నోవహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ-మగవీ, ఆడవీ ఓడలో ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు" (ఆది 7:16)

■ దేవుడు నోవహు ముందు కొన్ని సవాలుకరమైన విషయాలు ఉంచాడు. కొన్ని ప్రశ్నలు నోవహు మదిలో మెదిలి ఎదో ఒక క్షణాన ఆ పని విరమించుకోవచ్చు.
"ఈ పని నా సామర్థ్యానికి మించింది.నేను చెయ్యగలనా? నేను ఎప్పుడూ ఓడను కట్టలేదు. నాకు సహాయం ఎవరున్నారు?మొదటికే నాతో ఎవ్వరూ ఏకీభవించరు. ఐనా వర్షం కురుస్తుందా? సకల జీవరాసులు జాతలుజాతలుగా రాగలవా?జంతువులు, ఒకదానిని ఒకటి చంపుకొని తింటాయి..అవి ఏలా ఒకే చోట ఇన్ని నెలలు ఉండగలవు?"
● అవన్నీ చూపునకు అసాధ్యాలు, మునుపెన్నడూ విననివి. ఇవేమీ అతని పనిని ఆపలేకపోయాయి. కారణం! నోవహు అతని సామర్ధ్యం వైపుగాని, ప్రకృతి సహజ నియమాలను గాని చూడలేదు. కానీ వీటన్నిటి పైనున్న దేవుని బలాన్ని మాత్రమే చూశాడు. సృష్టికర్తయైన దేవుని బలసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేదు. దేవుడు తను చెప్పిన మాట తాను నెరవేర్చుకోగల సమర్థుడు. నోవహు దేవుణ్ని విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుని పని మన జీవితంలో జరగాలంటే లోకం వైపు చూడక, దాని అభిప్రాయాలను లక్ష్యపెట్టక, దేవునిపై చెరగని విశ్వాసం నిలిపితే చాలు!విశ్వాసం..తాను నమ్ముతున్న దానికి తగినట్లుగా తన పనిని కొనసాగిస్తుంది.

■ "తమ దేవుణ్ణి తెలుసుకొన్నవారు బలం పుంజుకొని గొప్ప క్రియలు చేస్తారు" (దానియేలు 11:32).

దేవుడు నోవహుతో 'ఓడ కట్టమని' మొట్టమొదటి సారిగా మాట్లాడ్డాడని మీరు అనుకుంటున్నారా? లేదు. దేవునితో అతని నడక అప్పటికే మొదలై చాలా రోజులు అవుతుంది(ఆది 6:9). దేవుణ్ని తెలుసుకోవడం అంటే బైబిల్ చదవడం కాదు..అలా చదివినప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం తలలోకి మాత్రమే చేరుతుంది. ఆ వాక్యంలో దేవుడు మన వ్యక్తిగత జీవితంలో కూడా పని చేయాలి. ఆ వాక్యాలు సత్యాలని మన జీవితం ద్వారా రూఢి చేసుకోవాలి. ఆయన్ను దగ్గర నుండి తెలుసుకోవాలి. విశ్వాసంతో దేవునితో నడుస్తున్న కొలది, మన పట్ల దేవుని నమ్మకత్వం పెరుగుతూ వెళ్తుంది. కొద్దివాటిలో నమ్మకం గల వానికి, గొప్పవాటిలో పాలువుంటుంది(1 సమూ 17:34). అప్పటికే నోవహు స్వల్పమైన విషయాల్లో నమ్మకాన్ని కనబరచాడు. కనుక గొప్ప విశ్వాసంతో దేవునితో ధైర్యంగా నడిస్తూ, లోకంపై నేరస్థాపన చేశాడు. ఇవన్నీ విశ్వాసంలో మెట్లు. ఒక దానిని ఎక్కిన తర్వాత మరొకటి తరువాత స్థానానికి తీసుకెళ్తాయి.

■ నోవహు ఆ ఓడను సుమారు 120 యేండ్లు నిర్మించాడు. నిర్మిస్తున్న సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి పరిశుద్ధ దేవుని మార్గాన్ని ప్రకటించాడు(2పేతు 2:5). అతనితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఆ పనిని కొనసాగించాడు(1పేతు 3:20). చివరికి అతని కుటుంబం తప్ప ఎవ్వరూ ప్రవేశించలేదు. ఓడసిద్ధపరచి, నీతిని ప్రకటించడం మాత్రమే మన పని! విశ్వసించి ప్రవేశిస్తారో లేదో అది మనుష్యుని స్వేచ్ఛ నిర్ణయం! దాని గూర్చిన లెక్కను ప్రకటించు వానిని దేవుడు అడగడు(అకా 18:6, యెహె 33:7-9). నోవహు ఓడను సిద్ధపరచి,దాని తలుపు తెరిచివుంచాడు. ఒకానొక రోజున జీవరాశులు జాతలుజాతలుగా ఓడ వైపు ప్రయాణం చేశాయి.వాటికి ఆజ్ఞ ఇచ్చింది దేవుడే!ఆయన మాటను లెక్కచేయని, దేవుని సేవకుని కేకలను-దైవస్వరంగా గుర్తు పట్టలేని వారిపై దేవుడు ఒక దినాన నేరస్థాపన చేస్తాడు. సాక్షాత్తు దేవుడే ఆ ఓడ తలుపును మూసాడు.ఇక కృప కాలం ముగిసిపోతుంది. సమయం ఉండగానే విశ్వాసముంచి 'రక్షకుడైన యేసు' అనే ఓడలో ప్రవేశించి, దేవుని సంఘంలో చేరాలి. అక్కడ క్రూరత్వానికి తావులేదు. సకల జంతువులు ప్రేమతో మెలిగాయి.దేవుడు ఆదిలో నియమించిన సాధుత్వమే(క్రీస్తు స్వభావమే) వాటిని యేలాయి. దేవునికి సమస్తం సాధ్యమే! రండి! నోవహు వలె విశ్వాసంలో ఎదుగుదాం!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...