Skip to main content

20Feb2018


❇ ఒకసారి యేసు దేవాలయంలోకి ఉన్నప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.
వారు ఆయనతో౼“బోధకా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు.
ఆయన తల ఎత్తి చూసి౼“మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది... ❇


■ ఈ సన్నివేశాన్ని ఇలా ఊహించవచ్చు! ఒకవైపు ధర్మశాస్త్రం! మరోవైపు క్రీస్తు! మధ్యలో పాపం చేసిన నరుడు! ఎదురుగా అపవాదియైన సాతాను! సాతాను యొక్క నేరారోపణ నిజమైనదే! ఆ స్త్రీ నిజంగానే పాపం చేసి,నిస్సహాయక రాలిగా నిలిచివుంది.దేవుని నీతిని బట్టి చూస్తే ఖశ్చితంగా ఆమె శిక్షకే అర్హురాలు. సాతాను నేరారోపణకు బలం దేవుని ఆజ్ఞ! దానిని ఆధారం చేసుకొనే అపవాది వ్యక్తులపై నేరం మోపి, శిక్ష విధించాలని డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని బట్టి పాపిని శిక్షించాలా(అప్పుడు ఆయన రక్షకుడు అవ్వడు)? లేదా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాలా(అప్పుడు ఆయన పాపే అవుతాడు)? ఈ సంఘటనలో అపవాది మొదట గురి యేసే! ఆయన్ను చేజిక్కిచుకోవాలనే అపవాది మనుష్యులను ప్రేరేపించాడు.క్రీస్తును పాపంలో పడవేస్తే, లోకానికి రక్షణే ఉండదు(కనుక మనందరి కంటే క్రీస్తు ఎంత బలమైన శోధనల గుండా వెళ్ళివుంటాడో ఊహించవచ్చు!)

■ అప్పటికే ధర్మశాస్త్రం ప్రకారం ఎంతో మంది వ్యభిచారులు తీర్పు తీర్చబడి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. "పాపం లేనివాడే మొదటి రాయి వెయ్యాలి" అనే మాట ధర్మశాస్త్రంలో కూడా ఉన్నట్లయితే మోషే కాలము నుండి క్రీస్తు వరకు కూడా ఏ వ్యభిచారి కూడా శిక్ష పొంది ఉండేవారు కారు(నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు). ధర్మశాస్త్రం మనకొక రక్షకుడు అవసరం అని తెలియ జేస్తుంది. ఖశ్చితమైన కొలబద్ధ ఉపయోగిస్తే పాపిని శిక్షించే హక్కు- పాపం లేని క్రీస్తుకు తప్ప ఈ లోకంలో మరెవరికి లేదు. కానీ భూమిపై అత్యంత నీతిమంతుడైన క్రీస్తు ఆమెను మన్నించాడు. ఇకపై పాపం చెయ్యొదని చెప్పాడు. ఈ విమోచన ఉరకనే రాలేదు గాని ఆ స్త్రీకు రావాల్సిన శిక్షను క్రీస్తు తానే సిలువలో భరించాడు. ఆ స్త్రీ పాపం కోసం మాత్రమే కాదు గాని నా/నీ పాపం యొక్క పూర్తి శిక్షను కూడా ఆయన భరించాడు. లోక పాపము యొక్క ప్రాయశ్చిత్తము కొరకు క్రీస్తు బలి పశువులా వధించబడ్డాడు. మన పాపం వల్ల-ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన ఉగ్రత అనే ఖడ్గం నిర్దోషమైన గొఱ్ఱె పిల్లయైన క్రీస్తుపై పడింది. పాపం లేని క్రీస్తు తన శరీరంలో ఆ శిక్షను భరించడం బట్టి పాపం యొక్క క్రయధనాన్ని సంపూర్తిగా చెల్లించాడు. ధర్మశాస్త్రం ఏమాత్రము పాపిని రక్షించలేదు (పాపం నుండి విడిపించదు) కానీ న్యాయంగా తీర్పు తీర్చుతుంది. క్రీస్తు దాని నీతిని సంపూర్ణంగా నెరవేర్చి, ధర్మశాస్త్రపు కాడి నుండి మనల్ని విడిపించి, కృప చూపి పాపిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు.

★ నిన్ను క్షమించగల రక్షకుడు క్రీస్తు ఒక్కడే అని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి, పాపములు విషయమై పశ్చాత్తాపం పడితే దేవుడు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్యజీవితం ప్రేమామయుడైన దేవునితో, నిరంతర పరిశుద్ధ సహవాసమే! ఈ సత్యంలో నిలిచి, మారుమనస్సు పొంది రక్షణ పొందుతావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...