Skip to main content

Posts

04Sep2017

✔ దేవుణ్ని తెలుసుకోవడం అంటే వాక్యాలను, దాని మూలాలను (information), వివిధమైన పుస్తకాలను (refer చేసి) చదివి తెలుసుకోవడం కాదు. అదే నిజమైతే..చదువుకోని వారు,(ఈ లోక) జ్ఞానం లేని వారి విషయంలో దేవుడు అన్యాయస్తుడుగా ఉంటాడు. దేవుణ్ని తెలుసుకునే విధానం ఖచ్చితంగా జ్ఞాని౼అజ్ఞాని, చదువుకున్నా౼చదువు లేకున్నా, బీద౼ధనిక తేడా లేకుండా దేవుని తెల్సుకోగలిగేలా ఉండే విధానాన్నే దేవుడు ఎంచుకుంటాడు అనేది సుస్పష్టం. అది ఎలాగంటే..మన జీవితాల్లో ఆయన స్వభావాన్ని, ఆయన ప్రమేయాన్ని దగ్గర నుండి అనుభవాల గుండా తెలుసుకోవడం. ◆ మారు మూల పల్లెటూరులోని, ఏమాత్రం చదువులేని, బైబిల్లో వాక్యాలేమీ చదవలేని ఒక ముసలివాడైన వ్యక్తి దేవుణ్ని తెల్సుకొని ఉండి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకి దేవుణ్ని ఒక వ్యక్తిలాగా ప్రేమించడం మాత్రమే తెల్సు. దేవుణ్ని కన్న తండ్రిలాగా భావించడం తెల్సు. విన్న కొద్ది మాటలు విశ్వాసముంచి నమ్మకంగా దేవుణ్ని సేవించడం మాత్రమే వారికి తెల్సు. ఇలాంటి వారికి అత్యంత చేరువలో దేవుడు ఉంటాడు అనడంలో సందేహం లేదు. ◆ మరొక వ్యక్తి బైబిల్ యూనివర్సిటీలో పండితుడై, అక్కడ ఉన్నవారందరిలో జ్ఞానవతుడై ఉండొచ్చు కానీ దేవుణ్ని వ్యక్తిగతంగా తెల్...

02Sep2017

❇ ఇశ్రాయేలు జాతి ఐగుప్తుకు సుమారు 400 సం|| బానిసలుగా ఉన్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే. అనేక అద్భుతాలు (విపత్తుల) ద్వారా ఐగుప్తును దేవుడు మొత్తి, తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా పలుకగా,ఫరో తన మనస్సును కఠిన పర్చుకున్నాడు కాని విడువలేదు.చివరి విపత్తుకు ముందు ఫరో మళ్లీ మోషేను పిలిపించి౼"మీరు వెళ్లి దేవుణ్ణి ఆరాధించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి" అన్నాడు. మోషే౼"మా దేవునికి బలి అర్పించడానికి, ఆరాధించడానికి మాకు పశువులు కావాలి. కాబట్టి అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు రావాలి. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి మేము విడిచిపెట్టము" అన్నాడు. ❇ ✔ పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న మనకు ఆత్మీయ వర్ణనగా చూపబడతాయి. వారి బానిసత్వం నేడు సాతాను వేసిన (పాపపు బానిసత్వ) సంకేళ్ళకు, శరీర కోర్కెలకు గుర్తుగా ఉన్నాయి. మనలోని ప్రతి ఒక్కరం వివిధ రకాల పాపాలకు బానిసలుగా ఉన్నాము. ఇప్పటికీ వాటిలోని కొన్ని విషయాల ముందు మనం శక్తిహీనులుగా ఉన్నాము. ✔ బయట ప్రజలు నీ గ...

01Sep2017

❇ దేవుడు యోహానుకు ఈ లోక అంతంలో జరగబోయ్యే సంగతులను ముందుగానే చూపాడు. వాటిలో ఒక సంఘటన. యోహాను౼"లోక రక్షకుడు అయిదో ముద్రను విప్పినప్పుడు దేవుని సందేశాన్ని బోధించటాన్ని బట్టీ, తమ సాక్ష్యాన్ని బట్టీ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను. వారు పెద్ద స్వరంతో ౼'సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యస్వరూపీ, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?' అని పలికారు. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. 'మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వారి లెక్క మొత్తం పూర్తి అయ్యేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి' అని వారికి చెప్పడం జరిగింది" (ప్రకటన 6:9-11) ❇ ✔ నీతిమంతులు హింసించబడ్డారు, చంపబడ్డారు..ఇప్పటికీ భాధింపబడుతూ, చంపబడుతూ ఉన్నారు. దేవుని భయంలేని దుష్టులకు, వారి పనులకు అడ్డుఅదుపు లేకుండా ఉన్నప్పటికీ, అన్యాయమే గెలుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నప్పటికి, వారి చేతిలోనే సమస్తం ఉన్నదనట్లు మనకు అనిపిస్తున్నప్పుడు.. మన మనస్సుల్లో మెదిలే ప్రశ్నలకు సమాధానం ఇదే!...

31Aug2017

❇ సర్పం(సాతాను) హవ్వను మోసగించగా, హవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని, తనతో పాటు తన భర్తయైన ఆదాముకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరువుబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నామని తెల్సుకొని చెట్లు చాటున దాగారు. దేవుడు ఆదామును౼“నీవు ఎక్కడున్నావు?” అని పిలిచాడు. "చెట్టు చాటున నగ్నంగా ఉన్నాను కనుకనే రాలేకపోతున్నాను.. నీవు నా కిచ్చిన ఈ స్త్రీ వల్లే ఇదంతా జరిగిందని"బదులిచ్చాడు. అప్పుడు దేవుడు మోసగించిన సర్పాన్ని, (దురాశ చేత అవిధేయత చూపిన) మోసపోయిన హవ్వను శపించాడు. తర్వాత ఆదాముతో౼"నీవు 'నీ భార్య మాట విని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము తిన్నావు'..నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు. మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు" ❇ ✔ ఒంటరిగా ఉన్న ఆదాము కోసం సాటియైన సహకారిగా దేవుడే హవ్వను సృష్టించాడు. దేవుడిచ్చిన తోడును ఆదాము ఎంతో ప్రేమించాడు. (దేవుని కంటే )ఎవరి మాట ఎక్కువగా వినేందుకు ఆదాము ఇష్టపడతాడో సాతాను పసిగట్టాడు! ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా మరొకరిని మోసాగించాడు. ఈ విధంగా మానవాళి జీవాన్నంతటిని వాడు దొంగ...

30Aug2017

❇ యేసు పునరుద్దారుడైన తర్వాత శిష్యులకు కనిపించాడు. అప్పుడు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా వాళ్ళతో లేడు. తోమా వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు౼"మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు. 8 రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి౼" మీకు శాంతి కలుగు గాక!" అని చెప్పి..ఆయన తోమాను చూసి౼"నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు. తోమా ఆయనతో౼"నా ప్రభూ, నా దేవా" అన్నాడు. యేసు౼"నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు ❇ ✔ యేసును సిలువ వేసినప్పుడు, సమాధి చేసినప్పుడు తోమా అక్కడ లేడు. కాని ఆయన పక్కలో పొడిచారని మరొకరు చెప్పినప్పుడు చూడకపోయినా నమ్మాడు(యోహా 19:34, 20:25). కా...

29Aug2017

❇ పౌలు౼"ఒకప్పుడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నాలో విశ్వాసం లేకపోవడం వల్ల, తెలియక చేశాను కాబట్టి దేవుడు నాపై కనికరం చూపాడు. పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే! నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16) ❇ ✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో! ✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక...

28Aug2017

❇ యాబీనుకు అనే కానానుకు రాజుకు 900 ఇనుప రథాలుండేవి. అతడు 20 సం|| ఇశ్రాయేలీయుల ప్రజలను తీవ్రంగా బాధించాడు, కనుక వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ రోజుల్లో దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు నాయాధిపతిగా ఉండేది. దెబోరా బారాకుతో౼"ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్ళు! నఫ్తాలి జెబూలూను వంశాల నుండి 10,000 మంది వెంటబెట్టుకొని తాబోరు కొండకు వెళ్ళు. యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను, అతని రథాలను, ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతణ్ణి నీ వశం చేస్తాను". ఐతే బారాకు భయపడి దెబోరాతో౼"నువ్వు కూడా నాతో వస్తేనే వెళ్తానని" చెప్పాడు.కాబట్టి దెబోరా అతనితో పాటు యుద్దానికి వెళ్ళింది..దేవుడు యాయేలు అనే ఒక సామాన్య స్త్రీ చేత, గుడారపు మేకుతో యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను చంపించాడు ❇ ✔ మన అల్పవిశ్వాసం వల్ల(మన స్వంత శక్తి, జ్ఞానంలో నుండి అంచనా వేసి) దేవుని శక్తిని చులకన చేసి, దేవుణ్ని అవమానించకూడదు. యుద్ధం దేవునిదైతే బలహీనమైన వాని/వాటి నుండి బలమైన కార్యాలు చెయ్య సమర్ధుడాయన. విశ్వాసం దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. నిజానికి సీసెరాను దేవుడు బారాకుకు అప్పగ...

25Aug2017

■ నెహెమ్యా౼"యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని తలుపులు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము గోడలను తిరిగి కట్టుదాం!" అని ప్రజలతో అన్నాడు. తనకు తోడుగా ఉన్న దేవుని కరుణా హస్తాన్ని గురించి, చక్రవర్తి తనతో చెప్పిన మాటలను వారికి తెలియజేశాడు. -అప్పుడు ప్రజలు౼“మనం నిర్మించడం ఆరంభిద్దాం రండి” అని చెప్పి, ఆ మంచి పని చేయడానికి బలంతో మొదలుపెట్టారు. (నెహెమ్యా 2:17,18) ౼ఒకడు నమ్మకస్థుడై, దేవునికి ప్రధమ స్థానం ఇస్తూ, తన స్వంత పనులకంటే దేవున్ని(కార్యాలను) ఘనంగా ఎంచినవాడై దేవునితో నడుస్తున్నప్పుడు, ఆయన తన హృదయ భారాన్ని అతనితో పంచుకుంటాడు. ౼దేవునితో సంభంధం ఉన్న అలాంటి ఒక్క నాయకుడులో దేవుడు పుట్టించిన ఆలోచన, భారంలేని అనేకులకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది(ఆయన ఉద్దేశ్యాల్లోకి తెస్తుంది). ■ నెహెమ్యా ప్రజల ప్రధానులతో, అధికారులతో౼"శత్రువులకు మీరు భయపడకండి. మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకోండి...దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు"(నెహెమ్యా 4:14,19) ౼నాయకుడు దేవుని బల ప్రభావాలను వ్యక్తిగతంగా తెల్సుకున్నవాడై, ప్రజలను ఎప్పుడూ దేవుని వైపు చూపించే గుర్తు(signpost)లాంటి వా...

24Aug2017

❇ యేసు దారిలో వెళ్తుండగా అధికారి, ధనవంతుడైన యవ్వనుడొకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి౼"మంచి బోధకుడా, పరలోక రాజ్యం వెళ్లాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు. యేసు౼"నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచి వారు కాదు!దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు మరియు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు" అని అతనితో అన్నాడు. అప్పుడతడు౼"వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అని అన్నాడు. యేసు అతన్ని ప్రేమతో చూసి౼"ఇంకా ఒకటి లోటుగా ఉంది. నీవు పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు! అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు!" ఐతే అతడు గొప్ప ఆస్తిపరుడు కనుక యేసు చెప్పిన ఆ మాట వినగానే..చాలా విచారంగా, ముఖం చిన్నబుచ్చుకొని దుఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ❇ ◆మంచి ఉద్దేశ్యం కలిగి ఆశగా పరుగెత్తుకొ...

22Aug2017

దేవుని దృష్టిలో భూమిపై నరులు అందరిని పాపులుగా, నాశనానికి పాత్రులుగా ఎంచబడ్డారని బైబిల్ చెప్తుంది. కొన్ని పాపాలు బయటికి కనిపించేవి, కొన్ని రహస్యంగా జరిగేవి, కొన్ని లోలోపలే అంతరంగంగా జరిగేవి. మనుష్యులకు తెల్సినవి బాహ్యంగా కనిపించేవే! పరిమితుడైన మానవుడు ఎదుటివారి రహస్య, అంతరంగాన్ని చూడలేదు. కాని దేవునికి మాత్రం అంతా సుస్పష్టమే!కాబట్టే దేవుని తీర్పులు, మానవుని అంచనాలను తారుమారు చేస్తాయి. ● పరాయి వాని భార్యను ఆశించి, వాణ్ని చంపి వేసిన వ్యక్తిని ఎవరైన భక్తిపరుడని(దేవుని హృదయం వంటి వాడని) అనగలరా? (దావీదు) ● బయటికి మంచి సాక్ష్యం కలిగి నీతిని పాటిస్తున్న వ్యక్తిని నరక అంచుల్లో ఉన్నాడని ఎవ్వరైనా చెప్పగలరా?(ధనవంతుడైన యవ్వన అధికారి) ● ఐదుగ్గురు భర్తలను మార్చి, ఇంకొకనితో ఉంటున్న స్త్రీని ఆ ఊరి రక్షణ కోసం దేవుడు ఎంచుకున్న సాధనం అని ఎవ్వరైనా గుర్తించగలరా?(సమరయ స్త్రీ) ● లంచగొండి, అన్యాయస్తుడైన అధికారిని..భక్తిపరుడు, దేవునికి విశ్వాసపాత్రుడైన వ్యక్తితో పాలినవాడని చెప్పగలరా?(జక్కయ్య) ● పాపాత్ముడైన ఒక మనిషికి పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎవ్వరైనా అప్పగించగలరా?(పేతురు) ● జీవితకాలం అంతా దో...

21Aug2017

■ దేవుడు ఎంతో ధనవంతుడైన యోబు ఆస్తినంతటిని తీసివేసినా, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులను అనుమతించినా... ౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10) కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు. అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు ౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3) ■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి" ౼అని షూషను కోటలో...

19Aug2017

❇ సిరియా రాజు, ఇశ్రాయేలును వారిని చంపాలని రహస్యంగా మాటు వేసిన ప్రతిసారి, దైవజనుడైన ఎలీషా ముందుగానే తన ఆత్మలో తెల్సుకొని ఆ ప్రదేశానికి వెళ్ళొదని ఇశ్రాయేలు రాజును హెచ్చరించి ప్రమాదం నుండి అనేక సార్లు రక్షించాడు. ● సిరియా రాజు౼"ఇశ్రాయేలు రాజు కోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి" అని తన సేవకులను ప్రశ్నించాడు. ● సేవకుల్లో ఒకడు౼“రాజా!మాలో ఎవ్వరమూ గూఢాచారులం కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు.మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు" ౼ ఎలీషా దోతానులో ఉన్నాడని తెల్సుకొని పట్టుకొని రండని గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు.రాత్రి వేళ వారు నగరాన్ని చుట్టుముట్టారు. ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూసి.. ● సేవకుడు౼“నా యజమాని! మనమేమి చేయగలము?" అని ఎలీషాని చూసి అడిగాడు. ● ఎలీషా౼"భయపడకు, సిరియా సైన్యం కంటె మన కోసం యుద్ధం చేసే సైన్యమే చాలా పెద్దది" అని చెప్పి, ఎలీషా దేవునికి ఇలా ప్రార్థన చేశాడు౼“యెహ...

17Aug2017

'పరలోకానికి వెళ్లాలంటే మనం ఏమి చెయ్యాలి?' అనే అంతుచిక్కని ఆ ప్రశ్నకు సమాధానం కోసం నీకొదేము అనే బోధకుడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చాడు. యేసు జవాబు చెబుతూ౼“ఇది సత్యం! క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు. నీకొదేము౼“మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు. యేసు-"మనిషి (శరీరంతో) భౌతికంగా జన్మిస్తాడు.అది శరీర జన్మ. ఆత్మలో కూడా జన్మించడం ఉంటుంది. అది ఆత్మీయ జన్మ. పరలోకంలో ప్రవేశించేది ఆత్మే గనుక నేను ఆత్మ గురించి చెప్తున్నాను. గాలి వీచినప్పుడు శబ్ధం మాత్రమే వినబడుతుంది, కాని కంటికి కనిపించదు(దాని ప్రభావం మనకు తెలుస్తుంది). ఆత్మలో క్రొత్తగా పుట్టడం కూడా అలాగే ఉంటుంది.అలా జరిగిందనే రుజువులు మనలో కనబడతాయి" “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము అడిగాడు. యేసు౼"పాపక్షమాపణ కొరకై లోకరక్షకుడు సిలువపై ఎత్తబడతాడు. ఆయనలో విశ్వాసముంచిన ప్రతివారు రక్షించబడతారు. అందుకే దేవుడు ఆయన్ను లోకానికి అనుగ్రహించాడు. మన పట్ల తన ప్రేమను దేవుడు ఇలా రుజువు చేసుకున్నాడు. సత్యా...

15Aug2017

యేసు-"ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ"(లూకా 22:53). క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు.. ◆ ఆ దారిని పొయ్యేవారు- "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో..నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు. ◆ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు-"వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!" ◆ సైనికులు-"నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు. ◆ వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ- "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు. ✔ యేసు లోక పాపాన్ని మోసుకొనే దేవుని గొఱ్ఱెపిల్ల వలె శిలువలో వధించబడటం దేవుని అనాది కాల ప్రణాళిక!(ఆయన నేరస్తులలో ఒకని వలె ఎంచబడతాడు! యెషయా 53:12). యేసుకు ఈ విషయం బాగా తెలుసు, సిలువ మరణమే దేవుని చిత్తమని! ఆదిలో నుండి సాతానుని ప్రయత్నం..దేవుని మాట పట్ల అవిశ్వాసం చూప...

14Aug2017

❇ ● ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. ● తమ స్థానం నిలుపుకోని, అధికారాలను వదిలిన దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. ● అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు (యూదా 5-7) ❇ పైన మూడు ఉదాహరణల్లో చెప్పబడిన వారంతా మొదట దేవుని కృపలో నిలచినవారే! దేవునిచే నిలుపబడి కాపాడబడి, కృపను పొంది, తమ స్వేచ్చాపూర్వకంగా దేవున్నుండి వెరైన వారిగా ఉన్నారు. దేవుడు ఎన్నడూ, ఎవ్వరి స్వేచ్చనూ హరించడు (విశ్వాసుల సైతం). ✔ దేవుడు ఇశ్రాయేలీయులతో-"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను"(నిర్గ 6:8) ౼ వాగ్దానం ఐతే నిలిచి ఉంది, అది స్వతంత్రించుకోవాలంటే విశ్వాసంలో నిలిచివుండాలి.కాబట్...

11Aug2017

❇ యిర్మియా ద్వారా దేవుడు పలికిన మాటలు. "మీరు నా మాట వినలేదు...నన్ను విసికించి, మీకు మీరే హాని కొనితెచ్చుకొన్నారు..ఈ దేశమంతా పాడైపోతుంది! శిథిలాలవుతుంది. ఈ జనాలు బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు సేవ చేస్తారు"(యిర్మియా 25:7-11) అప్పుడు అధికారులు రాజుతో ఇలా చెప్పారు౼“ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు” అన్నారు.(యిర్మియా 38:4) ౼ కానీ యిర్మీయా ఇశ్రాయేలు కోసం విలపించాడు. "దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది. నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది. భయమేస్తూ ఉంది. నా జనులు బాధపడివుండటం వల్ల నేను బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను. నా తల బావిగా, నా కండ్లు కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను"(యిర్మియా 8:18,21, 9:1) ౼ యేసు యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం ఏడ్చి౼"ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ ...