❇ సర్పం(సాతాను) హవ్వను మోసగించగా, హవ్వ దేవుడు తినవద్దన్న పండు తిని, తనతో పాటు తన భర్తయైన ఆదాముకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరువుబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నామని తెల్సుకొని చెట్లు చాటున దాగారు.
దేవుడు ఆదామును౼“నీవు ఎక్కడున్నావు?” అని పిలిచాడు.
"చెట్టు చాటున నగ్నంగా ఉన్నాను కనుకనే రాలేకపోతున్నాను.. నీవు నా కిచ్చిన ఈ స్త్రీ వల్లే ఇదంతా జరిగిందని"బదులిచ్చాడు.
అప్పుడు దేవుడు మోసగించిన సర్పాన్ని, (దురాశ చేత అవిధేయత చూపిన) మోసపోయిన హవ్వను శపించాడు.
తర్వాత ఆదాముతో౼"నీవు 'నీ భార్య మాట విని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము తిన్నావు'..నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు. మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు" ❇
✔ ఒంటరిగా ఉన్న ఆదాము కోసం సాటియైన సహకారిగా దేవుడే హవ్వను సృష్టించాడు. దేవుడిచ్చిన తోడును ఆదాము ఎంతో ప్రేమించాడు. (దేవుని కంటే )ఎవరి మాట ఎక్కువగా వినేందుకు ఆదాము ఇష్టపడతాడో సాతాను పసిగట్టాడు! ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా మరొకరిని మోసాగించాడు. ఈ విధంగా మానవాళి జీవాన్నంతటిని వాడు దొంగిలించాడు. దేవుడు ద్వారా ఇవ్వబడిన ప్రతి ఒక్కరిని దేవునిలో నుండే ప్రేమించాలి/లోబడాలి కాని దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. చివరికి మనం ఎవరి ద్వారా దేవునిలోకి వచ్చామో, వారిని సైతం అపవాది మోసాగించ గల సమర్ధుడు ('ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారు'౼మార్కు 13:22).
✔ అప్పటి వరకు ఆదాముకు తన భార్య ఇచ్చిన అన్ని ఫలాలూ మంచివై ఉండొచ్చు కానీ మానవాళి అంతటిని నాశనానికి నడిపించడానికి నిషేధించబడిన ఆ ఒక్క పండు చాలు! ఇప్పుడు ఆదాము మోసగించబడకుండా ఉండాలంటే ప్రతి పండును దేవుని మాటతో పోల్చి చూసుకోవాలి. అలాగే ఒక బోధకుడు 99 సత్యాలు భోదించి ఉండొచ్చు గాని..ఆధ్యాత్మిక జీవం నుండి తొలగించడానికి ఒక్క అబద్ద బోధ చాలు.
కనుక ప్రతి బోధ దేవుని వాక్యంతో సరి చూసుకోవాలి.నీ మొదటి సహవాసి దేవుడై ఉండాలి. దేవుని దగ్గరకు ప్రతి భోధ తీసుకెళ్ళి పరీక్షించాలి(బెరయా సంఘం ఇలాంటిదే). ఇది మంచి విషయం. ఎవ్వరికీ మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోకూడదు. అలా అప్పగించుకున్నట్లేతే సాతాను సులువుగా మోసగిస్తాడు. వాక్యానుసారమైన బోధ వ్యక్తిగతంగా దినదినం దేవునికి (క్రీస్తుకు) దగ్గర చేస్తుంది. క్రీస్తు సారూప్యంలోకి మార్చుతుంది. ఇది ఆరోగ్యకరమైన భోధకు గుర్తు! ఆయనకు మాత్రమే ప్రధమ స్థానం ఇచ్చి, మహిమపరచిన వారిని ఆయన భద్రం చేస్తాడు. (యూదా 1:24)
✔ పాపాన్ని దేవుడు ఎంత ద్వేషిస్తాడో తెలియాలంటే ఏదెను తోటను, కలువరి సిలువను చూస్తే అర్ధమౌతుంది.'ఒకే ఒక్క పాపం'౼మనిషిని ప్రేమామయుడైన దేవుని చేత బయటకు గెంటివేసేట్లు చేసింది. మానవాళి దేవునితో శాశ్విత ఎడబాటుకు(నరకశిక్షకు) కారణమయ్యింది. పాపం దేవాది దేవుణ్ణి సిలువలో నిలువెల్లా నరకయాతనకు గురిచేసింది. నేడు క్రీస్తు కృపను నిర్లక్ష్యం చేస్తున్నవారు కృపలో నుండి తొలిగేపొయ్యెవారిగా ఉంటారు. దేవుడు క్రీస్తును అనుగ్రహించినది..మన నిస్సాహాయతను, దేవుని కృపను గుర్తెరిగి, పాపాన్ని అసహ్యించుకొని దేవుణ్ని మరింతగా హత్తుకోవాలని! అంతేకాని, కృప ఉంది కనుక నేడు మీరు నిశ్చింతగా, నిర్భయంగా పాపం చేసి శిలువ రక్తంలో కడుక్కోమని కాదు. దేవుడు దేవుడే! ఆయన పరిశుద్ధత ఏదేనులోను, నేడు ఒక్కటే! ఆయన పరిశుద్ధుడు!
దేవుడు ఆదామును౼“నీవు ఎక్కడున్నావు?” అని పిలిచాడు.
"చెట్టు చాటున నగ్నంగా ఉన్నాను కనుకనే రాలేకపోతున్నాను.. నీవు నా కిచ్చిన ఈ స్త్రీ వల్లే ఇదంతా జరిగిందని"బదులిచ్చాడు.
అప్పుడు దేవుడు మోసగించిన సర్పాన్ని, (దురాశ చేత అవిధేయత చూపిన) మోసపోయిన హవ్వను శపించాడు.
తర్వాత ఆదాముతో౼"నీవు 'నీ భార్య మాట విని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము తిన్నావు'..నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు. మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు" ❇
✔ ఒంటరిగా ఉన్న ఆదాము కోసం సాటియైన సహకారిగా దేవుడే హవ్వను సృష్టించాడు. దేవుడిచ్చిన తోడును ఆదాము ఎంతో ప్రేమించాడు. (దేవుని కంటే )ఎవరి మాట ఎక్కువగా వినేందుకు ఆదాము ఇష్టపడతాడో సాతాను పసిగట్టాడు! ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా మరొకరిని మోసాగించాడు. ఈ విధంగా మానవాళి జీవాన్నంతటిని వాడు దొంగిలించాడు. దేవుడు ద్వారా ఇవ్వబడిన ప్రతి ఒక్కరిని దేవునిలో నుండే ప్రేమించాలి/లోబడాలి కాని దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. చివరికి మనం ఎవరి ద్వారా దేవునిలోకి వచ్చామో, వారిని సైతం అపవాది మోసాగించ గల సమర్ధుడు ('ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారు'౼మార్కు 13:22).
✔ అప్పటి వరకు ఆదాముకు తన భార్య ఇచ్చిన అన్ని ఫలాలూ మంచివై ఉండొచ్చు కానీ మానవాళి అంతటిని నాశనానికి నడిపించడానికి నిషేధించబడిన ఆ ఒక్క పండు చాలు! ఇప్పుడు ఆదాము మోసగించబడకుండా ఉండాలంటే ప్రతి పండును దేవుని మాటతో పోల్చి చూసుకోవాలి. అలాగే ఒక బోధకుడు 99 సత్యాలు భోదించి ఉండొచ్చు గాని..ఆధ్యాత్మిక జీవం నుండి తొలగించడానికి ఒక్క అబద్ద బోధ చాలు.
కనుక ప్రతి బోధ దేవుని వాక్యంతో సరి చూసుకోవాలి.నీ మొదటి సహవాసి దేవుడై ఉండాలి. దేవుని దగ్గరకు ప్రతి భోధ తీసుకెళ్ళి పరీక్షించాలి(బెరయా సంఘం ఇలాంటిదే). ఇది మంచి విషయం. ఎవ్వరికీ మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోకూడదు. అలా అప్పగించుకున్నట్లేతే సాతాను సులువుగా మోసగిస్తాడు. వాక్యానుసారమైన బోధ వ్యక్తిగతంగా దినదినం దేవునికి (క్రీస్తుకు) దగ్గర చేస్తుంది. క్రీస్తు సారూప్యంలోకి మార్చుతుంది. ఇది ఆరోగ్యకరమైన భోధకు గుర్తు! ఆయనకు మాత్రమే ప్రధమ స్థానం ఇచ్చి, మహిమపరచిన వారిని ఆయన భద్రం చేస్తాడు. (యూదా 1:24)
✔ పాపాన్ని దేవుడు ఎంత ద్వేషిస్తాడో తెలియాలంటే ఏదెను తోటను, కలువరి సిలువను చూస్తే అర్ధమౌతుంది.'ఒకే ఒక్క పాపం'౼మనిషిని ప్రేమామయుడైన దేవుని చేత బయటకు గెంటివేసేట్లు చేసింది. మానవాళి దేవునితో శాశ్విత ఎడబాటుకు(నరకశిక్షకు) కారణమయ్యింది. పాపం దేవాది దేవుణ్ణి సిలువలో నిలువెల్లా నరకయాతనకు గురిచేసింది. నేడు క్రీస్తు కృపను నిర్లక్ష్యం చేస్తున్నవారు కృపలో నుండి తొలిగేపొయ్యెవారిగా ఉంటారు. దేవుడు క్రీస్తును అనుగ్రహించినది..మన నిస్సాహాయతను, దేవుని కృపను గుర్తెరిగి, పాపాన్ని అసహ్యించుకొని దేవుణ్ని మరింతగా హత్తుకోవాలని! అంతేకాని, కృప ఉంది కనుక నేడు మీరు నిశ్చింతగా, నిర్భయంగా పాపం చేసి శిలువ రక్తంలో కడుక్కోమని కాదు. దేవుడు దేవుడే! ఆయన పరిశుద్ధత ఏదేనులోను, నేడు ఒక్కటే! ఆయన పరిశుద్ధుడు!
Comments
Post a Comment