Skip to main content

11Aug2017

యిర్మియా ద్వారా దేవుడు పలికిన మాటలు.
"మీరు నా మాట వినలేదు...నన్ను విసికించి, మీకు మీరే హాని కొనితెచ్చుకొన్నారు..ఈ దేశమంతా పాడైపోతుంది! శిథిలాలవుతుంది. ఈ జనాలు బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు సేవ చేస్తారు"(యిర్మియా 25:7-11)

అప్పుడు అధికారులు రాజుతో ఇలా చెప్పారు౼“ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు” అన్నారు.(యిర్మియా 38:4)

౼ కానీ యిర్మీయా ఇశ్రాయేలు కోసం విలపించాడు.
"దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది. నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది. భయమేస్తూ ఉంది. నా జనులు బాధపడివుండటం వల్ల నేను బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
నా తల బావిగా, నా కండ్లు కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను"(యిర్మియా 8:18,21, 9:1)


౼ యేసు యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం ఏడ్చి౼"ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టి దిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపులనుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు"(లూకా 19:41- 43)

✔ దేవుని సమాచారం ఎవ్వరు మోసుకొస్తారో వారు దేవుని మనసు కలిగి ఆ పని చెయ్యాలని లేఖనాలు మనకు భోదిస్తున్నాయి. ప్రవక్తలు (చాటున ) ఏడుస్తూనే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పక మానలేదు. అది దేవుని మనస్సు. ఇలాంటి మనస్సు లేకుండా చేస్తే , అది నేరాన్ని ఎంచినట్లు అవుతుంది. నేరాన్ని ఎంచడమే ఐతే, సాతాను ఎప్పుడు అదే పనిలో సిద్ధంగా ఉంటాడు కదా!

✔ అలాగని మౌనంగా ఉండటం..దేవుని ప్రేమ చూపటమా?కాదు! దాని తీవ్రతను తెలియజేయటమే(గద్దించడమే) నిజంగా వారిని దైవ ప్రేమతో ప్రేమించినట్లు..చాటున వారి కోసం దుఃఖిస్తూ, (విజ్ఞాపన) ప్రార్థన చేస్తూ ఈ పని చేయాల్సివుంటుంది. ఇలా చేస్తున్నప్పుడు ప్రశ్నించుకోవాల్సిన కొన్ని విషయాలు..
1.నేను దేవుని (ప్రేమా) మనస్సుతోనే ఈ పని చేస్తున్నానా?
2.నిజంగా ఆ స్థితి నుండి బయటకు రావాలని, వారిని హృదయంలో హత్తుకునే ఈ పని చేస్తున్నానా?
3. వారి ఆధ్యాత్మిక జీవితం గూర్చి నిజంగా నాకు భారం ఉందా(ప్రార్ధించానా)?
4. నేను ఎప్పుడైనా వారిని ప్రోత్సహించానా?
5. క్రీస్తు నా స్థానంలో ఉంటే ఆయన వారితో ఇలానే మాట్లాడుతాడా?(ఆయన జాలి, క్షమాపణ, గద్దింపు, కోపం, కొరడా.. ఎవ్వరితో, ఎక్కడ, ఎలా వాడాడో లేఖనాలను చూడండి. అవి తారుమారు అవ్వకూడదు)

★ పాపాన్ని అంగీకరించని(కప్పుకొనే) వేషధారణను, తిరుగుబాటును గద్దించాలి. పాపభంధకాల్లో చిక్కబడి అపవాది కాడి క్రింద ఉన్న బలహీనులకు (సహాయం)కృప చూపాలి. ఏదీ చేసినా పాపభంధకాల్లో నుండి, దేవుని కృపలోకి తేవడమే మన ధ్యేయంగా ఉండాలి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...