Skip to main content

24Aug2017

యేసు దారిలో వెళ్తుండగా అధికారి, ధనవంతుడైన యవ్వనుడొకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి౼"మంచి బోధకుడా, పరలోక రాజ్యం వెళ్లాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు.

యేసు౼"నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచి వారు కాదు!దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా!
వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు మరియు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు" అని అతనితో అన్నాడు.

అప్పుడతడు౼"వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అని అన్నాడు.

యేసు అతన్ని ప్రేమతో చూసి౼"ఇంకా ఒకటి లోటుగా ఉంది. నీవు పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు! అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు!"
ఐతే అతడు గొప్ప ఆస్తిపరుడు కనుక యేసు చెప్పిన ఆ మాట వినగానే..చాలా విచారంగా, ముఖం చిన్నబుచ్చుకొని దుఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు


◆మంచి ఉద్దేశ్యం కలిగి ఆశగా పరుగెత్తుకొని వచ్చి అంతే నిరాశతో వెనుదిరిగాడు.క్రీస్తు ముందు వినయంగా మోకరిల్లాడు కాని అంతరంగంలో దేవుణ్ణి తిరస్కరించి వెళ్ళిపోయాడు. యవ్వనుడు, సంపన్నుడైన అధికారిలో బయటికి కనిపించే ఆధ్యాత్మిక చింతన, బయటకు మంచి (బాహ్య)సాక్య జీవితం! నీతిమంతుడు, మంచివాడు అని అనేకులు ద్వారా చెవిలో వినపడుతున్న మాటలు, అలాగే మనస్సులో కూడా అదే భావన!ఈ వ్యక్తిని మోసం చేశాయి.ఐతే దేవుని చూపు భిన్నంగా ఉంటుందని మనం ఇప్పటికే అనేక సార్లు విన్నాం కదా!మోసపోవొద్దు!మన కొలబద్ధ దేవుని వాక్కు!

◆ క్రీస్తు అతనిని ప్రేమించి నిజం చెప్పాడు.ఆ నిజం ఏమిటంటే... మన ఏ మంచి పని మనల్ని దేవుని రాజ్యం చేర్చలేదు.ఒకవేళ మంచి పని వల్ల దేవునిరాజ్యం చేరాలంటే..!ఏ పాపం చెయ్యకుండా.. పనులలో, ఆలోచనల్లో, అంతరంగంలో ఏ లోపం అంటూ లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండగలిగినట్లేతే, అప్పుడు పరిశుద్ధ దేవునితో ఉండగలం.ఇది అసంభవం!రుచికరమైన వంటలో ఒక చిన్న బొద్దింకను వేస్తే తినగలమా?అంతా చెడిపోనట్లు ఎంచుతాము కదా! అలాగే మంచి పనుల ద్వారా ఎవ్వరూ, ఎన్నడూ నీతిమంతులుగా దేవుని ముందు నిలబడలేరు. మనలోని తప్పులు మన నీతి పనులన్నింటిని అపవిత్ర పరుస్తాయి.

◆ కనుకనే మనకు రక్షకుడు అవసరమయ్యాడు. పాపంలేని నీతిమంతుడు మన స్థానంలో మన పాప శిక్ష భరించడం ద్వారా..నీతిమంతుడు, రక్షకుడైన ఆయన్ను (యేసును) విశ్వసించడం ద్వారా ఆయన నీతిని పొందగలం. అలా నమ్మినప్పుడు ఏమి చెప్తున్నామంటే.."నా నీతి,నా మంచి నీ దగ్గరకు నన్ను చేర్చలేదు దేవా! నీ నీతి మాత్రమే నన్ను రక్షించగలదని" నమ్మి ఆయనలో దాగుతున్నాము.ఇది విశ్వాసం ద్వారా కలిగే నీతి. పనులను బట్టి వచ్చే నీతి అతిశయానికి దారితీస్తుంది(గలతీ 2:15,16).
౼ విశ్వాసం ద్వారా కలిగే నీతి అనే పునాది మీద దేవుని చేత ఏర్పాటు చేయబడిన మంచి పనులు అనే కట్టడాలు(క్రీస్తు స్వరూపం) కట్టబడాల్సివుంది(ఎఫెస్సి 2:8౼10).కట్టువాడు దేవుని ఆత్మే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...