Skip to main content

28Aug2017

యాబీనుకు అనే కానానుకు రాజుకు 900 ఇనుప రథాలుండేవి. అతడు 20 సం|| ఇశ్రాయేలీయుల ప్రజలను తీవ్రంగా బాధించాడు, కనుక వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ రోజుల్లో దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు నాయాధిపతిగా ఉండేది.
దెబోరా బారాకుతో౼"ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్ళు! నఫ్తాలి జెబూలూను వంశాల నుండి 10,000 మంది వెంటబెట్టుకొని తాబోరు కొండకు వెళ్ళు. యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను, అతని రథాలను, ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతణ్ణి నీ వశం చేస్తాను".
ఐతే బారాకు భయపడి దెబోరాతో౼"నువ్వు కూడా నాతో వస్తేనే వెళ్తానని" చెప్పాడు.కాబట్టి దెబోరా అతనితో పాటు యుద్దానికి వెళ్ళింది..దేవుడు యాయేలు అనే ఒక సామాన్య స్త్రీ చేత, గుడారపు మేకుతో యాబీను రాజు సైన్యాధిపతియైన సీసెరాను చంపించాడు

✔ మన అల్పవిశ్వాసం వల్ల(మన స్వంత శక్తి, జ్ఞానంలో నుండి అంచనా వేసి) దేవుని శక్తిని చులకన చేసి, దేవుణ్ని అవమానించకూడదు. యుద్ధం దేవునిదైతే బలహీనమైన వాని/వాటి నుండి బలమైన కార్యాలు చెయ్య సమర్ధుడాయన. విశ్వాసం దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. నిజానికి సీసెరాను దేవుడు బారాకుకు అప్పగించాడు, అతని అల్పవిశ్వాసం ద్వారా తన ద్వారా జరగవల్సిన గొప్ప కార్యాన్ని దేవుడు మరొక ద్వారా జరిగించాడు.

✔ ఎప్పుడైన గమనించారా! దేవుడు ఒక వ్యక్తిని తన పనికి పిలిచే ముందు..వారు 'నేను ఈ పనికి సమర్థుడను కాను' అని వారు చెప్పినప్పుడు 'నేను నీకు తోడై ఉంటాను కనుక నీవు చెయ్యగలవని' దేవుడు చెప్తాడు. కొన్ని ఉదాహరణలు..
మోషే (నిర్గమ 3:9-12), యెహోషువా(యెహో 1:9), గిద్యోను(న్యాయ 6:15,16)....మరియ(లూకా 1:34,35),
పేతురు(లూకా 5:8,10), పౌలు(ఫిలిప్పీ 4:13)..

✔ దేవుడు సమర్ధుడు! దేవుని పనిముట్టుగా నీవు లేకపోతే 'మిగితా వారి వలె నేను చురుకైన వాడ్ని(talented) కాను' అని అనొద్దు..ఇక్కడ సమస్య విశ్వాసం! సృష్టిలో వ్యర్ధమైనదంటూ ఏమి లేదు! కారణం సృష్టికర్త గొప్పవాడు కాబట్టి. మరి ఆయన పొలికలో సృష్టింపబడిన వారు మరి ఎక్కువగా కారణజన్ములు కారా? నీ అల్ప విశ్వాసం, అవిధేయతల వల్ల దేవుని ప్రణాళికలను వ్యర్ధ పరచుకోకు.

✔ నీవు ప్రత్యేకంగా నిర్మించబడ్డ వానివి. నీ పట్ల దేవుని ఆలోచనలు ప్రత్యేకమైనవే. నీ జీవితానికి నీ సొంత ప్రణాళికలు వ్రాసుకొని జీవితం వ్యర్ధపరచుకోవద్దు. చివరికి అది(ఆయన చిత్తం కాని)దేవుని పనైనా సరే! మొదట వ్యక్తిగతంగా దేవుణ్ని తెలుసుకో! నీ జీవితానికి చాలిన వాడని రూఢీ పర్చుకో! అప్పుడు దేవుని గొప్ప కార్యాల్లో పాలినవాడిగా ఉంటావు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...