Skip to main content

22Aug2017


దేవుని దృష్టిలో భూమిపై నరులు అందరిని పాపులుగా, నాశనానికి పాత్రులుగా ఎంచబడ్డారని బైబిల్ చెప్తుంది. కొన్ని పాపాలు బయటికి కనిపించేవి, కొన్ని రహస్యంగా జరిగేవి, కొన్ని లోలోపలే అంతరంగంగా జరిగేవి. మనుష్యులకు తెల్సినవి బాహ్యంగా కనిపించేవే! పరిమితుడైన మానవుడు ఎదుటివారి రహస్య, అంతరంగాన్ని చూడలేదు. కాని దేవునికి మాత్రం అంతా సుస్పష్టమే!కాబట్టే దేవుని తీర్పులు, మానవుని అంచనాలను తారుమారు చేస్తాయి.

● పరాయి వాని భార్యను ఆశించి, వాణ్ని చంపి వేసిన వ్యక్తిని ఎవరైన భక్తిపరుడని(దేవుని హృదయం వంటి వాడని) అనగలరా? (దావీదు)

● బయటికి మంచి సాక్ష్యం కలిగి నీతిని పాటిస్తున్న వ్యక్తిని నరక అంచుల్లో ఉన్నాడని ఎవ్వరైనా చెప్పగలరా?(ధనవంతుడైన యవ్వన అధికారి)

● ఐదుగ్గురు భర్తలను మార్చి, ఇంకొకనితో ఉంటున్న స్త్రీని ఆ ఊరి రక్షణ కోసం దేవుడు ఎంచుకున్న సాధనం అని ఎవ్వరైనా గుర్తించగలరా?(సమరయ స్త్రీ)

● లంచగొండి, అన్యాయస్తుడైన అధికారిని..భక్తిపరుడు, దేవునికి విశ్వాసపాత్రుడైన వ్యక్తితో పాలినవాడని చెప్పగలరా?(జక్కయ్య)

● పాపాత్ముడైన ఒక మనిషికి పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎవ్వరైనా అప్పగించగలరా?(పేతురు)

● జీవితకాలం అంతా దోపిడీలతో, హత్యలతో బ్రతికిన వాణ్ణి అత్యంత పరిశుద్ధుడు తన వెంట తీసుకొని పరలోకం తీసుకువెళ్తాడని ఎవ్వరైనా ఉహించగలరా?(సిలువపై దొంగ)

● తమ ఆస్థులను దేవుని సేవకై అమ్మి ఇచ్చిన ఒక కుటుంబాన్ని.. దేవుణ్ని మోసాగించినవారని ఎవ్వరైనా చెప్పగలరా?(అననీయ సప్పిరాలు)

★ కానీ దేవుడు చెప్పాడు★

౼ ఇలాంటి ఉదాహరణలెన్నో బైబిల్లో ఉన్నాయి. పైన చెప్పిన వారి జీవితాల్లో ప్రభువుని కలుసుకోక ముందు వారి జీవితం౼కలుసుకున్న తర్వాత వారి జీవితం. వారు తప్పు చేసినప్పటి జీవితం౼తప్పు తెల్సుకొని యదార్ధంగా పశ్చత్తాపడినప్పటి జీవితం.

౼ ఒక మనిషి వైఖరి తప్పు చేసినప్పుడు కాదు తెలిసేది, ఆ తప్పు తప్పని తెలిసిన తర్వాత వాళ్ళ స్పందించిన తీరును బట్టి తెలుస్తుంది..అదే, దేవుని మాట పట్ల వారి నిజమైన వైఖరి! కొందరు కఠిన పర్చుకోగా, కొందరు కప్పిపుచ్చు కొంటారు. మరికొందరైతే యదార్ధంగా అంగీకరించి క్షమాపణ పొంది వదిలివేస్తారు. అలాంటి వారు దైవికమైన ప్రజలు. దేవుని సంభంధి విశ్లేషించే తీరు దైవమనస్సుని పోలి ఉండాలి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...