■ దేవుడు ఎంతో ధనవంతుడైన యోబు ఆస్తినంతటిని తీసివేసినా, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులను అనుమతించినా...
౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10)
కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు.
అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు
౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3)
■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి"
౼అని షూషను కోటలో ఎంతో సౌఖ్యముగా జీవిస్తున్న యూదుడైన నెహెమ్యా విని ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసముండి, దేవునికి విజ్ఞాపన ప్రార్ధన చేశాడు.తిరిగి నిర్మించడానికి బయలుదేరాడు(నెహెమ్యా 1:1-4).
మొదట్లో ఉజ్జియా తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు. యెహోవాను వెదికి అనుసరించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లేట్టు చేశాడు.అయితే అతని రాజ్యం స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి(విర్రవీగి) చెడిపోయ్యాడు.(2దిన 26:16)
◆ ఇది ఏమి తెలియజేస్తుంది, ఒకని హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు నమ్మకస్తునిగా ఉండగలడు. ఏ స్థితి, పరిస్థితి దేవుని నుండి తొలగటానికి/నిర్లక్ష్య పెట్టడాన్ని కారణంగా చెప్ప సాహసించకూడదు. ఇలా మేఘము వలె ఆవరించే కొన్ని ఉదాహరణలను దేవుడు మన ముందు సాక్షాలుగా ఉంచాడు(ఉంచుతూ ఉన్నాడు).
పౌలు౼"నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను"(ఫిలిప్పీ 4:11)
౼"నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక! మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?" అన్నాడు.(యోబు 1:21,2:10)
కాని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి ఎన్నో అద్భుతాల ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షించాడు. అరణ్యములో వారికి నీళ్లు దొరకలేదు.
అప్పుడు ప్రజలు మోషే మీద సణిగారు
౼“ఇప్పుడు మేము ఏమి త్రాగాలి? అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు (నిర్గ 17:3)
■ "చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. వాటి తలుపులు కాల్చివేయబడ్డాయి"
౼అని షూషను కోటలో ఎంతో సౌఖ్యముగా జీవిస్తున్న యూదుడైన నెహెమ్యా విని ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసముండి, దేవునికి విజ్ఞాపన ప్రార్ధన చేశాడు.తిరిగి నిర్మించడానికి బయలుదేరాడు(నెహెమ్యా 1:1-4).
మొదట్లో ఉజ్జియా తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు. యెహోవాను వెదికి అనుసరించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లేట్టు చేశాడు.అయితే అతని రాజ్యం స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి(విర్రవీగి) చెడిపోయ్యాడు.(2దిన 26:16)
◆ ఇది ఏమి తెలియజేస్తుంది, ఒకని హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆయనకు నమ్మకస్తునిగా ఉండగలడు. ఏ స్థితి, పరిస్థితి దేవుని నుండి తొలగటానికి/నిర్లక్ష్య పెట్టడాన్ని కారణంగా చెప్ప సాహసించకూడదు. ఇలా మేఘము వలె ఆవరించే కొన్ని ఉదాహరణలను దేవుడు మన ముందు సాక్షాలుగా ఉంచాడు(ఉంచుతూ ఉన్నాడు).
పౌలు౼"నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను"(ఫిలిప్పీ 4:11)
Comments
Post a Comment