❇ పౌలు౼"ఒకప్పుడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నాలో విశ్వాసం లేకపోవడం వల్ల, తెలియక చేశాను కాబట్టి దేవుడు నాపై కనికరం చూపాడు.
పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే!
నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16) ❇
✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో!
✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక దేవుడు క్షమిస్తాడు అనుకొంటారు. వారు ఆశించింది దొరికాక, 'దేవుణ్ని క్షమాపణ అడిగాను కనుక దేవుడు క్షమించాడని' చెప్పుకొని ఆత్మ వంచన చేసుకొంటారు. మనుష్యులను మోసం చెయ్యచ్చు! కాని దేవుణ్ని కాదు! దేవుడు నీ అంత జ్ఞానం లేనివాడనుకొంటున్నావా? ఆ మాత్రం గ్రహించలేకపోవడానికి.. ఆయన హృదయ రహస్యాలు తెల్సిన వాడు! ఒకవేళ యదార్ధంగా 'నాకు ఈ పని ఇష్టంగా ఉంది, నన్ను చెయ్యనివ్వు దేవా!' అంటే దేవుని యెదుట నీ యదార్థతను బట్టి, ఒకవేళ తిరిగి కనికరం పొందవచ్చునెమో! నీ అతి తెలివితో నీవు చిక్కుబడతావు. సమయం ఉండగా తిరిగి మారుమనస్సు పొందు.
✔ హాంతకుడై మరణ శిక్ష అనుభవించిన సిలువపై దొంగ కనికరించబడ్డాడు. అలాంటి కార్యాలు జీవితంలో ఎన్నడూ చేయ్యని వారు నశించిపోయ్యారు. దేవుడు కోరేది ఏమిటో ఇంకా అర్ధం కాలేదా..! మొదట యదార్థత, తర్వాత మారుమనస్సు, దానికి తగిన జీవితం. బలహీన ఘట్టాలలో (మనుష్యుల్లో) తన మహిమ నింపడానికి దేవునికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. యదార్థత లేని హృదయాల్లో ఆయన నివసించడానికి చోటు ఉండదు. తన కృప మరియెక్కువగా బలహీనులకు చూపడం ద్వారా అనేక మంది బలహీనులకు దేవుడు నిరీక్షణనిస్తాడు. అనుదినం౼'నీవు లేకుండా నేను శూన్యం దేవా అని!' ఖాళీ చేసుకున్న హృదయాలతో ఆయన్ను సమీపించి, ఆయన కృపను వేడుకోవాల్సివుంది. అప్పుడు మనం ఆయన ఆత్మ చేత నింపబడే వారీగా ఉంటాము(ఆయన ఆధీనంలోకి వస్తాము).
✔ ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో గుర్తు చేసుకొని, బలహీనులను దేవుడు మన ముందు ఉంచినప్పుడు అదే కృపను వారికిని చూప బద్ధులమై ఉన్నాము.
పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే!
నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16) ❇
✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో!
✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక దేవుడు క్షమిస్తాడు అనుకొంటారు. వారు ఆశించింది దొరికాక, 'దేవుణ్ని క్షమాపణ అడిగాను కనుక దేవుడు క్షమించాడని' చెప్పుకొని ఆత్మ వంచన చేసుకొంటారు. మనుష్యులను మోసం చెయ్యచ్చు! కాని దేవుణ్ని కాదు! దేవుడు నీ అంత జ్ఞానం లేనివాడనుకొంటున్నావా? ఆ మాత్రం గ్రహించలేకపోవడానికి.. ఆయన హృదయ రహస్యాలు తెల్సిన వాడు! ఒకవేళ యదార్ధంగా 'నాకు ఈ పని ఇష్టంగా ఉంది, నన్ను చెయ్యనివ్వు దేవా!' అంటే దేవుని యెదుట నీ యదార్థతను బట్టి, ఒకవేళ తిరిగి కనికరం పొందవచ్చునెమో! నీ అతి తెలివితో నీవు చిక్కుబడతావు. సమయం ఉండగా తిరిగి మారుమనస్సు పొందు.
✔ హాంతకుడై మరణ శిక్ష అనుభవించిన సిలువపై దొంగ కనికరించబడ్డాడు. అలాంటి కార్యాలు జీవితంలో ఎన్నడూ చేయ్యని వారు నశించిపోయ్యారు. దేవుడు కోరేది ఏమిటో ఇంకా అర్ధం కాలేదా..! మొదట యదార్థత, తర్వాత మారుమనస్సు, దానికి తగిన జీవితం. బలహీన ఘట్టాలలో (మనుష్యుల్లో) తన మహిమ నింపడానికి దేవునికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. యదార్థత లేని హృదయాల్లో ఆయన నివసించడానికి చోటు ఉండదు. తన కృప మరియెక్కువగా బలహీనులకు చూపడం ద్వారా అనేక మంది బలహీనులకు దేవుడు నిరీక్షణనిస్తాడు. అనుదినం౼'నీవు లేకుండా నేను శూన్యం దేవా అని!' ఖాళీ చేసుకున్న హృదయాలతో ఆయన్ను సమీపించి, ఆయన కృపను వేడుకోవాల్సివుంది. అప్పుడు మనం ఆయన ఆత్మ చేత నింపబడే వారీగా ఉంటాము(ఆయన ఆధీనంలోకి వస్తాము).
✔ ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో గుర్తు చేసుకొని, బలహీనులను దేవుడు మన ముందు ఉంచినప్పుడు అదే కృపను వారికిని చూప బద్ధులమై ఉన్నాము.
Comments
Post a Comment