Skip to main content

29Aug2017

పౌలు౼"ఒకప్పుడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నాలో విశ్వాసం లేకపోవడం వల్ల, తెలియక చేశాను కాబట్టి దేవుడు నాపై కనికరం చూపాడు.

పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు.ఈ మాట నమ్మతగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే!
నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను మాదిరిగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన సహనాన్ని నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు" (1తిమో 1:15,16)

✔ ఈ లోకంలో మనుష్యులు మంచి లక్షణాలు/ అలవాట్లు గలవారిని వెతకి, వారిని ప్రేమించినట్లు దేవుడు కూడా అలానే చేస్తే, నాలాంటి అత్యంత బలహీనులకు నిరీక్షణ ఉండేది కాదు. దేవుని వెలుగు హృదయాన్ని తాకుతున్నా, సొంత జ్ఞానంతో కఠిన పర్చుకొని, త్రోసిపుచ్చడం అవిధేయత! అజ్ఞానం..తెలియక చేసి, దేవుని వెలిగింపునివ్వగా యదార్థవంతులై సత్యాన్ని ఒప్పుకొని, తమను తాము ఆ సత్యానికి అప్పగించుకొనువారు (పౌలు వంటి వారు). దేవునికి బాగా తెల్సు ఏది అజ్ఞానమో, ఏది అవిధేయతో!

✔ కొందరు తెలివిగల వారమనే బుద్ధిహీనులు, నేను కోరుకున్నది(పాపం) చేసి, తర్వాత దాన్ని ఒప్పుకొంటాను కనుక దేవుడు క్షమిస్తాడు అనుకొంటారు. వారు ఆశించింది దొరికాక, 'దేవుణ్ని క్షమాపణ అడిగాను కనుక దేవుడు క్షమించాడని' చెప్పుకొని ఆత్మ వంచన చేసుకొంటారు. మనుష్యులను మోసం చెయ్యచ్చు! కాని దేవుణ్ని కాదు! దేవుడు నీ అంత జ్ఞానం లేనివాడనుకొంటున్నావా? ఆ మాత్రం గ్రహించలేకపోవడానికి.. ఆయన హృదయ రహస్యాలు తెల్సిన వాడు! ఒకవేళ యదార్ధంగా 'నాకు ఈ పని ఇష్టంగా ఉంది, నన్ను చెయ్యనివ్వు దేవా!' అంటే దేవుని యెదుట నీ యదార్థతను బట్టి, ఒకవేళ తిరిగి కనికరం పొందవచ్చునెమో! నీ అతి తెలివితో నీవు చిక్కుబడతావు. సమయం ఉండగా తిరిగి మారుమనస్సు పొందు.

✔ హాంతకుడై మరణ శిక్ష అనుభవించిన సిలువపై దొంగ కనికరించబడ్డాడు. అలాంటి కార్యాలు జీవితంలో ఎన్నడూ చేయ్యని వారు నశించిపోయ్యారు. దేవుడు కోరేది ఏమిటో ఇంకా అర్ధం కాలేదా..! మొదట యదార్థత, తర్వాత మారుమనస్సు, దానికి తగిన జీవితం. బలహీన ఘట్టాలలో (మనుష్యుల్లో) తన మహిమ నింపడానికి దేవునికి ఖాళీ ప్రదేశం దొరుకుతుంది. యదార్థత లేని హృదయాల్లో ఆయన నివసించడానికి చోటు ఉండదు. తన కృప మరియెక్కువగా బలహీనులకు చూపడం ద్వారా అనేక మంది బలహీనులకు దేవుడు నిరీక్షణనిస్తాడు. అనుదినం౼'నీవు లేకుండా నేను శూన్యం దేవా అని!' ఖాళీ చేసుకున్న హృదయాలతో ఆయన్ను సమీపించి, ఆయన కృపను వేడుకోవాల్సివుంది. అప్పుడు మనం ఆయన ఆత్మ చేత నింపబడే వారీగా ఉంటాము(ఆయన ఆధీనంలోకి వస్తాము).

✔ ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో గుర్తు చేసుకొని, బలహీనులను దేవుడు మన ముందు ఉంచినప్పుడు అదే కృపను వారికిని చూప బద్ధులమై ఉన్నాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...