Skip to main content

Posts

19Dec2017

❇ 450 మంది బయలు ప్రవక్తలు ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ "బయలు స్వామీ! మాకు జవాబివ్వు!" అంటూ బయలు పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేశాడు గనుక వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, వాళ్ళ అలవాటుచొప్పున రక్తధార లయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు.మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు. అప్పుడు ఏలీయా ప్రజలందరితో "నా దగ్గరికి రండి" అన్నాడు. ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలిపీఠాన్ని సరి చేసి ప్రార్ధించాడు.... వెంటనే దేవుని దగ్గర నుండి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు (1రాజు 18:22-39) ❇ ■ ఇక్కడ రెండు రకాల భక్తి విధానాలు కనిపిస్తున్నాయి. బయలు ప్రవక్తలు దేవుడు ఉన్నాడని నమ్మేవారే కానీ నాస్తి...

18Dec2017

❇  తండ్రితో గొడవ పడి, ఆస్తిని నష్టపర్చి తిరిగి వచ్చిన చిన్న కొడుకును బట్టి ఆ తండ్రి విందు చేశాడు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. ఒక సేవకుణ్ణి పిలిచి౼‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. ఆ పనివాడు అతనితో౼‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు. కాని అతడు౼‘ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. (లూకా 15:25-30) ❇ ■ చిన్న కొడుకు తండ్రిని ఆస్తి పంచి ఇవ్వమని అడిగినప్పుడు, తండ్రి ఇద్దరికీ ఆస్తిని పంచిపెట్టాడు. ఐనా పెద్దవాడు తండ్రితోనే ఉన్నాడు. తండ్రి ఇంట్లో, తండ్రి పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అతడు తండ...

13Dec2017

❇  మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. మిద్యానులో రగూయేలు అనే యాజకునికి 7 కుమార్తెలున్నారు. ఒకరోజు వారు తమ తండ్రి గొర్రెల మందకు నీళ్లు తీసుకొని రావడాని ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేశారు కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు నీళ్లు చేదుకోనివ్వకుండా వారిని వెళ్లగొట్టేశారు. కనుక మోషే వారికి సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. అతడు వారితో ౼"ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అన్నాడు. వారు-“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు. అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు. అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు.  ❇ ■ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలనుకున్న మోషేకు చేదు అనుభవం ఎదురయ్యింది.అప్పటికే మేలుకు ప్రతిగా జరిగిన కీడు...

08Dec2017

❇ సాయంత్రమైనప్పుడు యేసు తన శిష్యులతో ౼“సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి!” అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సముద్రంపై బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి౼“ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం!మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలను గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు.. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. అప్పుడు ఆయన౼“మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు(మార్కు 4:35-40) ❇ ■ దేవుడు తోడున్న పడవపైకి గాలివాన-తుఫానులు(శ్రమలు) వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి! ఇంకా చెప్పాలంటే ఆయనే (శ్రమలను) పంపుతాడు! ఈ సంఘటనకు ముందు యేసు శిష్యులకు అనేక పరలోక సత్యాలను భోధించాడు (మార్కు 4:33,34). అదే రోజు సాయంత్రం ఆయనే వారిని ఈ ప్రయాణానికి పిలిచాడు. ఇప్పుడు వారి ముందున్న యేసు(దేవుని) మాట౼"అవతలి...

06Dec2017

❇ అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరే నిప్పు. ఈ విధంగా వారు పాపం చేసారు కనుక యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో౼“యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు,’నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి'”. అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు. అప్పుడు అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులను మోషే పిలిపించాడు. వారు మీషాయేలును ఎల్సాఫానును. అతడు వారితో౼“పరిశుద్ధ స్థలం ముందుకు వెళ్లండి. మీ సోదరుల శవాలను పాళెము వెలుపలకు తీసుకొని పొండి” అన్నాడు. అప్పుడు వారు నాదాబు, అబీహు శవాలను పాళెము వెలుపలకు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.(లేవీ 10:1-5) ❇ ■ ధర్మశాస్త్రంలో అదేశించబడిన పనులు రాబోయే క్రీస్తు విమోచన కార్యానికి ముంగుర్తులు. ఎక్కడ దేవుని ప్రత్యక్షత (revelation) ఎక్కువగా ఉంటుందో అక్కడ విధేయత ఎక్కువగా ఎదురు చూడబడుతుంద...

01Dec2017

❇  అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే౼ "ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించాడు...ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయన దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడి, ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. వారితో ఆయన అన్నాడు "మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు" ఆయన ఇంకా అన్నాడు౼"మీతో ఖచ్చితంగా అంటున్నాను,ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.." సమాజ మందిరంలో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు త్రోసుకువెళ్ళారు....

29Nov2017

❇ ఫిలిప్పు యేసుతో౼"ప్రభువా, తండ్రి(తండ్రియైన దేవుణ్ణి)ని మాకు చూపించు. అది మాకు చాలు" యేసు అతనితో౼"ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే! 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు? 'నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాడు' అని నువ్వు నమ్మడంలేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు. ...తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు" (యోహా 14:8-10,26; 16:13) ❇ ■ దేవదూత క్రీస్తు పుట్టకమునుపు ఆయన పేరును (ప్రవచనాల ప్రకారం) "ఇమ్మానుయేలు" గా పిలిచాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్ధం. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసిస్తుంది....

25Nov2017

❇ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో పెళ్ళికి యేసుని, ఆయన తల్లిని, ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయనతో౼“వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది” అంది. యేసు ఆమెతో౼“అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” ఆయన తల్లి పనివారితో౼“మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. యేసు పనివారితో౼“ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో౼“ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు గురించి ఆ పనివారికి మాత్రమే తెలుసు. విందు ప్రధానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి౼“ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం పోస్తారు.ఆ తర్వాత నాసిరకంది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు” అన్నాడు ❇ ■ మొదట ద్రాక్షారసం మనుష్యుల చేత తయారు చేయబడినదైతే, రెండవది దేవుని చేత చేయబడినది. ఖచ్చితంగా రెండవదే శ్రేష్ఠమైన ద్రాక్షారసమై ఉండి ఉంటుంది(త్రాగిన వెంటనే విందు ప్రధాని పెండ్లి కుమారుని కలిశాడు). మొదటి ద్రాక్షరసం దేవ...

23Nov2017

❇ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటితో వచ్చి షోమ్రోన్ను పట్టణాన్ని ముట్టడించాడు. అప్పుడు షోమ్రోనులో తీవ్రమైన కరవు సంభవించింది. ఆ నగర బయట, ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు. వారు ఒకడితో ఒకడు౼ "మనం నగరంలోకి వెళ్లినా కరువు వల్ల చస్తాం! లేక ఇక్కడే కూర్చునివున్నా చస్తాం! గనుక మనం ఇప్పుడు సిరియనుల యుద్ధ శిబిరానికి వెళదాం పదండి! ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం! చంపితే చస్తాం!" అని చెప్పుకొన్నారు. ఐతే అప్పటికే దేవుడు సిరియా సైన్యానికి, రథాలూ-గుర్రాల చప్పుడు వినిపించేలా చేశాడు గనుక ఇశ్రాయేలీయులు హిత్తియ రాజుల్నీ, ఐగుప్తు రాజుల్నీ సహాయంగా పిలుచుకొని పెద్ద సైన్యంతో దాడికి దిగారనుకొని అక్కడ నుండి ఉన్నపాటున పారిపోయారు. ఆ కుష్ఠురోగులు శిబిరం ప్రవేశించి సిరియనులు పారిపోయ్యారని తెల్సుకొని, ఆకలితో ఉన్నందున వారి గుడారాల్లోకి చొరబడి, తిని త్రాగారు. అక్కడనుంచి వెండి, బంగారం, దుస్తులు ఎత్తుకుపోయి వేరే చోట దాచారు. అప్పుడు వారు ఒకడితో ఒకడు౼"మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభదినం. కానీ మనం ఎవరికీ చెప్పడం లేదు. మనం వెళ్ళి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం!" అని చెప్...

22Nov2017

❇ యెహోవా మోషేతో౼"నేను బెసెలేలును ప్రత్యేకించుకొన్నాను. నేను అతణ్ణి దైవాత్మతో నింపాను. అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను.నేర్పుతో పనులను కల్పించడానికీ, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ పొదగడం కోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశాను". బెసెలేలు తుమ్మకర్రతో దేవుని మందసాన్ని చేశాడు. రెక్కలు పైకి విప్పి ఉన్న రెండు కెరూబు ఆకారాలు బంగారంతో, మందసపు మూతపై కప్పి ఉన్నట్లుగా చేశాడు. మరియు తుమ్మకర్రతో బల్లను-ధూపవేదికను-బలిపీఠాన్ని, మేలిమి బంగారంతో దీపస్తంభాన్ని , కంచుతో గంగాళాన్నీ-దాని పీఠాన్నీ, మరియు ఆవరణాన్ని-వాటి తెరలను తయారు చేశాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినది అంతా బెసెలేలు, అహోలీయాబుతో కలిసి చేశాడు. ❇ ■ దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ప్రత్యక్ష గుడారం నమూనా పరలోక పోలికగా (గుర్తుగా) ఉంటుంది. దేవుడు మెషేకు ప్రత్యక్ష గుడారపు నమూనాను కొండపైన చూపాడు(నిర్గ 25:40).దానిని సరిగ్గా అలాగే చెయ్యడానికి అనగా మోషే దాని గూర్చి వివరణ ఇవ్వగా, ఒకరు సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే మలచాల్సివుంది. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్...

17Nov2017

❇ యేసు సిలువ వేయబడక ముందు రాత్రి..భోజన సమయంలో శిష్యులు తమలో 'ఎవరు గొప్ప' అనే వివాదం వారిలో తలెత్తింది. అప్పుడు యేసు౼"ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు. మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక వడ్డించే వాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవసాగాడు. యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో౼"నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక మాదిరి చూపించ...

14Nov2017

❇ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, ఓడ బ్రద్దలైపోయే తీవ్రమైన తుఫాను రేగింది. నావికులకు భయపడి ప్రతివాడు తన తన దేవుళ్ళకి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అప్పటికే యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు. ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి౼“ఓయ్! నువ్విక్కడ నిద్రపోతున్నావా?లేచి నీ దేవునికి ప్రార్ధన చెయ్!ఒకవేళ ఆయన మనల్ని కనికరించి నాశనం కాకుండా కాపాడతాడేమో"అన్నాడు అప్పుడు నావికులు౼"ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, రండి" అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది. ❇ ■ దేవుడు ప్రవక్తయైన యోనాను నీనెవే మహా పట్టణానికి వెళ్లి ఆ ప్రజల ఘోర పాపాలను బట్టి హెచ్చరించమని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయ్యాడు. అప్పుడు దేవుడు గొప్ప తుఫానును సముద్రం పైకి పంపాడు. పెద్ద గాలి తుఫానులతో నీటిలో నివసించే ప్రాణులు, అందులో ప్రయాణించే ఓడలు (మనుష్యులు) భయాందోళనకు గురైయ్యారు. ఓడను తేలిక చేయడానికి వారి వస్తువులు సముద్రంలో పడేశారు. ఎంతో నష్టం వారికి ...

10Nov2017

❇ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు(మతనిష్ఠ గలవాడు), ఇంకొకడు (అన్యాయంగా) పన్నులు వసూలు చేసేవాడు. పరిసయ్యుడు నిలబడి౼"దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అని తనలో తాను ప్రార్థన చేశాడు. ఐతే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాల్లేదు. వాడు గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో౼"దేవా, పాపినైన నన్ను కరుణించు! " అన్నాడు. పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ❇ ■ పరిసయ్యుడు బాహ్యంగా ఎంతో నీతిమంతునిగా కనిపిస్తున్నాడు. పరులవి ఏమీ ఆశించక, ఆధ్యాత్మిక చింతన(భక్తి) కలిగి జీవిస్తున్నాడు. వారానికి రెండుసార్లు ఉపవాసం, సంపాదనలో పదో వంతు దేవునికి ఇస్తూ, నైతిక విలువలతో ఆలయంలో ఎంతో భక్తిపరునిగా, ఎందరికో మాదిరిగా ఉన్నాడు. ఇతని ప్రార్ధనను బట్టి చూస్తే చెడు మార్గాలకు పోని జీవన...

09Nov2017

❇ ఆకాశమా, ఆలకించు!భూమీ, విను! దేవుడు మాట్లాడు తున్నాడు౼ “నేను నా పిల్లలను పెంచి పోషించాను. వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని తెలుసు, గాడిదకు యజమాని మేత పెట్టే స్థలం తెలుసు. కానీ (ఇశ్రాయేలు) నా ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు. అయ్యో! ఈ ప్రజలు దోషులు...!వారు దేవుణ్ణి వదలిపెట్టారు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడ్ని) తిరస్కరించారు, ఆయనను విడిచి తొలగిపోయారు"(యెషయా 1:2-4) ❇ ■ దేవుని ఇంట్లో(సన్నిధిలో) ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన మనుష్యులను ప్రాణం లేని గ్రహాల్లాగా, నక్షత్రాల్లాగా, సముద్రాల్లాగా పుట్టించలేదు గాని ఆయన్ను స్వేచ్ఛగా కోరుకుంటూ, సేవించగలిగే వారిగా ఆయన స్వభావంలో పుట్టించాడు. దేవుడు సృష్టిని ఆరు దినాల్లో ముగించాడు. ప్రతి దినం సృష్టిని రూపొందిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మానవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. సృష్టినంతా వాని కోసమే నిర్మించాడు. ప్రేమగల తండ్రి తన బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ, సిద్ధపర్చినట్లుగా..ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాడు. ఆహారానికి రకరకాల పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఇచ్చాడు. ఈ అందమైన ప్రకృతిలో వానికి ఏ కొదువా ఆయన చెయ్యలేదు. ఆరవ...

08Nov2017

❇ అప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ, అగాధం తాళం చెవి ఉన్నాయి. ఆ దేవదూత 'అపవాది', 'సాతాను' అనే పేర్లున్న ఆది సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాల వరకూ బంధించి, వాణ్ణి అగాధంలో పడవేసి, దానిని మూసివేసి, దానికి ముద్ర వేసాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగి తీరాలి... 1000 సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలోనుండి విడుదల అవుతాడు. వాడు బయల్దేరి నాలుగు దిక్కులలో ఉన్న గోగు, మాగోగు అనే దేశాల్ని మోసం చేసి యుద్ధానికై సమకూరుస్తాడు. వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకంనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసం చేసిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ(anti-christ), అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు (ప్రకటన 20:1-10).❇ ■ సాతాను(అపవాది) యొక్క అంతిమ గతి ఇలా ఉండబోతుంది. "సాతాను భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకు న్నాడు"(ప్రక 12:12).ఆ అంతిమ తీర్ప...