
"ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించాడు...ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు. అందరూ ఆయన దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడి, ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు.
వారితో ఆయన అన్నాడు "మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు" ఆయన ఇంకా అన్నాడు౼"మీతో ఖచ్చితంగా అంటున్నాను,ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.."
సమాజ మందిరంలో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు త్రోసుకువెళ్ళారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలంనుంచి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని దాని అంచుకు తీసుకు పోయారు. అయితే ఆయన వారి మధ్యనుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు. (లూకా 4: 16-30)

■ ప్రజల యొక్క స్వభావం ఈ భాగంలో స్పష్టంగా కనిపిస్తుంది.ఈ వాక్యం ముందు భాగంలో యేసు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నట్లు మనం చదువుతాము(v14). క్రీస్తు యెషయా గ్రంథ లేఖనం చదివినప్పుడు అంతా ప్రశంసించారు. ఎప్పుడైతే వారిని ఉద్దేశించి మాట్లాడాడో వెను వెంటనే ఆగ్రహంతో నిండి ఆయన్ను చంపాలని చూశారు. అప్పటివరకు యేసు తాను వాడుక (regular)గా వెళ్లిన సమాజ మందిరం అది. నజరేతువారితో యేసుకు అంతకు మునుపు ఇలాంటి విభేధం ఉన్నట్లు చూడలేం కానీ, ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఆయన అక్కడి నుండి మౌనంగా తప్పుకొని వెళ్ళాడు.
■ దేవుని ఆత్మ బలంతో నింపబడిన వారి మాటలు ఎల్లప్పుడూ మృదువుగానే ఉంటాయా?
స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఇశ్రాయేలీయుల గత చరిత్ర గూర్చి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు మౌనంగానే విన్నారు, ఎప్పుడైతే వారిని వ్యక్తిగతంగా విమర్శించాడో అప్పుడు వారు అతణ్ని మాటలు విని కోపంతో మండిపడి పండ్లుకొరికారు. అతని మీద పడి, రాళ్లు రువ్వి ఛాంపివేశారు
(అ. కా 7: 51-60).
■ ప్రజల వ్యక్తిగత అవసరం దేవుని ఆత్మకే బాగా తెలుసును, కనుక వారిని ప్రేమించి ఆ మాటలనే పలికిస్తాడు. దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడే వ్యక్తి దేవుని ఆధీనంలో ఉంటాడు. పలకబడిన మాటల్లోని సత్యానికి చెవి ఇచ్చి విధేయత చూపినవారు రక్షించబడతారు, ఆదరించబడతారు, సత్యంలో నిలిచివుంటారు (అ.కా 2:37). కఠిన పర్చుకున్న వారు సహజంగా ఇవి ఆ వ్యక్తి మాటలే అనుకుంటారు. నిజానికి అది వారి అంతరంగ స్థితిని అద్దం పట్టినప్పటికి, మొదటి నుంచి వారిని గూర్చి చిన్న చూపు ఉంటుంది(v22,అ.కా 4:13) గనుక ఆ మాటలను త్రోసి పుచ్చుతారు. కారణం..వారు మనిషిని మాత్రమే చూస్తారు, దేవుణ్ని చూడలేని(యదార్థత లేని) వారి హృదయాలపై ముసుగు ధరించుకొని ఉంటారు గనుక యదార్థత లేని వారి హృదయం దేవుణ్ని దాటివెళ్లిపోతాయి. ఈ విధంగా కఠిన పర్చుకుని, ఎదురాడు వారు దైవోగ్రతలోకి వెళ్తారు.
స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఇశ్రాయేలీయుల గత చరిత్ర గూర్చి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు మౌనంగానే విన్నారు, ఎప్పుడైతే వారిని వ్యక్తిగతంగా విమర్శించాడో అప్పుడు వారు అతణ్ని మాటలు విని కోపంతో మండిపడి పండ్లుకొరికారు. అతని మీద పడి, రాళ్లు రువ్వి ఛాంపివేశారు
(అ. కా 7: 51-60).
■ ప్రజల వ్యక్తిగత అవసరం దేవుని ఆత్మకే బాగా తెలుసును, కనుక వారిని ప్రేమించి ఆ మాటలనే పలికిస్తాడు. దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడే వ్యక్తి దేవుని ఆధీనంలో ఉంటాడు. పలకబడిన మాటల్లోని సత్యానికి చెవి ఇచ్చి విధేయత చూపినవారు రక్షించబడతారు, ఆదరించబడతారు, సత్యంలో నిలిచివుంటారు (అ.కా 2:37). కఠిన పర్చుకున్న వారు సహజంగా ఇవి ఆ వ్యక్తి మాటలే అనుకుంటారు. నిజానికి అది వారి అంతరంగ స్థితిని అద్దం పట్టినప్పటికి, మొదటి నుంచి వారిని గూర్చి చిన్న చూపు ఉంటుంది(v22,అ.కా 4:13) గనుక ఆ మాటలను త్రోసి పుచ్చుతారు. కారణం..వారు మనిషిని మాత్రమే చూస్తారు, దేవుణ్ని చూడలేని(యదార్థత లేని) వారి హృదయాలపై ముసుగు ధరించుకొని ఉంటారు గనుక యదార్థత లేని వారి హృదయం దేవుణ్ని దాటివెళ్లిపోతాయి. ఈ విధంగా కఠిన పర్చుకుని, ఎదురాడు వారు దైవోగ్రతలోకి వెళ్తారు.
■ దేవుని ఆత్మ చేత నింపబడిన విశ్వాసి మరి ఎక్కువగా(మత సంభంధమైన నాయకుల చేత) మనుష్యుల చేత ద్వేషించబడి, హింసించబడ్డారు.మనుష్యుల దగ్గర నుండి ఇలాంటి తిరస్కారాన్ని సైతం సహించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారో, వారిని దేవుడు వాడుకుంటాడు. యేసు 30 సం౹౹ సాక్షాన్ని సైతం వదులుకోబడానికి సిద్ధపడ్డాడు. ప్రాణభయంతో అబద్ధమాడిన పేతురు ధైర్యంగా దేవునికోసం నిలబడ్డాడు. ఒకప్పుడు ప్రధాన యాజకులకు మిత్రుడైన పౌలు వారితో విభేదించడానికి సిద్ధపడ్డాడు. అవసరమైతే హుందా ఉన్న మన సాక్ష్యన్ని సైతం బలిపీఠంపై పెట్టాలి.అలాలేనప్పుడు క్రీస్తు కోసం నా ప్రాణాన్ని సైతం పెడతానని వట్టి మాటలు పలకకూడదు.
Comments
Post a Comment